Political News

ఫైర్ బ్రాండుకు జగన్ షాక్

పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుపొందిన నగిరి ఎంఎల్ఏ రోజాకు జగన్మోహన్ రెడ్డి షాకిచ్చారా ? తాజాగా ప్రభుత్వం భర్తీ చేసిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాన్ని చూస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో రోజాకు బద్ధశతృవు అయిన కే. శాంతిని ఏరికోరి ఈడిగ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. పైగా కార్పొరేషన్ కు క్యాబినెట్ ర్యాంకు ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక్కసారిగా రోజా, శాంతి హోదా సమాన స్ధాయిగా మారిపోయింది. రోజా ఎంఎల్ఏనే అయినా ఏపిఐఐసీ ఛైర్మన్ గా అపాయింట్ అయిన తర్వాత క్యాబినెట్ మంత్రి ర్యాంకు దక్కింది. ఇపుడు శాంతికి కూడా ఛైర్మన్ హోదాలో క్యాబినెట్ మంత్రి ర్యాంకు వచ్చింది.

శాంతి గతంలో నగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. ఈమెకన్నా ముందే ఈమె భర్త కేజే కుమార్ కూడా మున్సిపల్ ఛైర్మన్ చేశారు. వీళ్ళద్దరికీ నియోజకవర్గంలో గట్టిపట్టుంది. పైగా నియోజకవర్గంలో బీసీ, ఎస్సీల సామాజికవర్గాలే ఎక్కువ. ఈ సామాజికవర్గాల తర్వాతే క్షత్రియులుంటారు. ఇటువంటి కేజే దంపతులు ఒకపుడు రోజాకు బాగా సన్నిహితులు. ఎంఎల్ఏ కాకముందు రోజా నియోజకవర్గంలో పర్యటించటానికి వచ్చినపుడు రాత్రిపూట బస చేయాలంటే వీళ్ళింట్లోనే ఉండేవారు.

ఇంతటి సన్నిహితుల మధ్య ఎందుకు గొడవలు మొదలయ్యాయో ఎవరికీ తెలీదు. ఒకపుడు సన్నిహితుల ఇఫుడు ఉప్పునిప్పుగా మారిపోయారు. అప్పటి నుండి దంపతులిద్దరు రోజాను పూర్తిస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో రోజా కూడా దంపతులను వీలైనంతగా తొక్కేసేందుకే ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇటువంటి నేపధ్యంలోనే దంపతులకు జిల్లాలోని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల అండ దొరికింది. నిజానికి వీళ్ళకు కూడా రోజాతో పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

దాంతో రోజాతో సంబంధం లేకుండానే శాంతికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కిందని పార్టీలో ప్రచారం మొదలైపోయింది. ఎంఎల్ఏల సిఫారసు లేకుండా ఆ నియోజకవర్గంలోని వాళ్ళకు జగన్ కూడా ఎంటర్ టైన్ చేయటం లేదు. రోజాను అడిగితే శాంతికి పదవి ఇవ్వమని సిఫారసు చేసే అవకాశాలు లేవన్నది అందరికీ తెలిసిందే. అలాంటిది శాంతికి ఛైర్ పర్సన్ పదవి దక్కిందంటే రోజాకు షాక్ తగిలినట్లుగానే అనుకోవాలి. తెర వెనుక బలమైన లాబీయింగ్ రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన కారణంగానే శాంతికి ఛైర్ పర్సన్ వచ్చిందనేది వాస్తవం. మరి ఈ విషయంలో రోజా ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

This post was last modified on October 20, 2020 8:17 am

Share
Show comments
Published by
Satya
Tags: JaganRoja

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

7 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

31 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago