Political News

టీడీపీ, వైసీపీ కలిస్తే?… ఊహకే అందట్లేదా?

టీడీపీ ఏంటీ… వైసీపీతో కలిసి పోటీ చేయడమేమిటి? వైసీపీ ఏంటీ…పోయిపోయి టీడీపీతో జత కట్టడేమేమిటి?. నిజమేనండోయ్.. ఈ ఈక్వేషన్ ఊహకే అందట్లేదు. అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే… అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెడాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు. అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం టీఎన్డీయూసీ… వైసీపీతో కలిసి సాగుతోంది.

ఖమ్మం జిల్లా అంటే తెలిసిందే కదా. జిల్లా తెలంగాణలో ఉన్నా… ఆంధ్రా మూలాలు బాగానే ప్రభావితం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓ ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లను గెలిచిందిక్కడే. ఆ తర్వాత 2018లో తెలంగాణ వ్యాప్తంగా ఓడినా.. టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు కూడా దక్కింది ఈ జిల్లాలోనే. ఆ తర్వాత అటు వైసీపీ విజేతలు గానీ, ఇటు టీడీపీ విన్నర్లు గానీ…ఆ పార్టీలను వదిలివెళ్లిన సంగతి తెలిసిందే. అంటే.. ఎన్ని వేరియేషన్లు ఉన్నా… ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలకు ఈ జిల్లాలో ఇంకా అంతో ఇంతో పట్టు ఉన్నట్లే లెక్క.

ఇక సారపాక ఐటీసీ కంపెనీ విషయానికి వస్తే… కంపెనీలో మెజారిటీ కార్మికులు ఆంధ్రా మూలాలు ఉన్న వారే. కంపెనీలో మొత్తం 5 వేల మంది దాకా కార్మికులు ఉన్నా…గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వారు మాత్రం 1,253 మందే ఉన్నారట. నాలుగేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతుండగా… గతంలో కూడా వైసీపీ మద్దతు తీసుకుని టీటీడీ విక్టరీ కొట్టేసింది. ఈ సారి కూడా అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తుండగా… వైసీపీ అందుకు సరేనంది. ఇంకేముంది గత ఫలితం రిపీట్ అయినట్టేనన్న ధీమాతో ఈ రెండు పార్టీలు సాగుతున్నాయి.

ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా టీఎన్టీయూసీని ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా జనసేన మద్దతుదారుల ఓట్లకు గాలం వేసింది. ఏపీలో టీడీపీతో సాగుతున్నా… కాంగ్రెస్ వ్యూహంతో ఇక్కడి జనసేన ఓట్లలో చీలిక వచ్చేసిందట. ఓ వర్గం టీడీపీతోనే ఉండగా… చీలిక వర్గం కాంగ్రెస్ తో జత కట్టిందట. పలితంగా టీడీపీ, వైసీపీ జెండాలు కలిసిపోగా… జనసేన జెండాలు మాత్రం రెండు శిబిరాల్లోనూ కనిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఫలితం కూడా శుక్రవారం రాత్రికి విడుదల కానుంది.

This post was last modified on January 31, 2025 7:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 minute ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

38 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago