టీడీపీ ఏంటీ… వైసీపీతో కలిసి పోటీ చేయడమేమిటి? వైసీపీ ఏంటీ…పోయిపోయి టీడీపీతో జత కట్టడేమేమిటి?. నిజమేనండోయ్.. ఈ ఈక్వేషన్ ఊహకే అందట్లేదు. అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే… అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెడాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు. అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం టీఎన్డీయూసీ… వైసీపీతో కలిసి సాగుతోంది.
ఖమ్మం జిల్లా అంటే తెలిసిందే కదా. జిల్లా తెలంగాణలో ఉన్నా… ఆంధ్రా మూలాలు బాగానే ప్రభావితం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓ ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లను గెలిచిందిక్కడే. ఆ తర్వాత 2018లో తెలంగాణ వ్యాప్తంగా ఓడినా.. టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు కూడా దక్కింది ఈ జిల్లాలోనే. ఆ తర్వాత అటు వైసీపీ విజేతలు గానీ, ఇటు టీడీపీ విన్నర్లు గానీ…ఆ పార్టీలను వదిలివెళ్లిన సంగతి తెలిసిందే. అంటే.. ఎన్ని వేరియేషన్లు ఉన్నా… ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలకు ఈ జిల్లాలో ఇంకా అంతో ఇంతో పట్టు ఉన్నట్లే లెక్క.
ఇక సారపాక ఐటీసీ కంపెనీ విషయానికి వస్తే… కంపెనీలో మెజారిటీ కార్మికులు ఆంధ్రా మూలాలు ఉన్న వారే. కంపెనీలో మొత్తం 5 వేల మంది దాకా కార్మికులు ఉన్నా…గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వారు మాత్రం 1,253 మందే ఉన్నారట. నాలుగేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతుండగా… గతంలో కూడా వైసీపీ మద్దతు తీసుకుని టీటీడీ విక్టరీ కొట్టేసింది. ఈ సారి కూడా అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తుండగా… వైసీపీ అందుకు సరేనంది. ఇంకేముంది గత ఫలితం రిపీట్ అయినట్టేనన్న ధీమాతో ఈ రెండు పార్టీలు సాగుతున్నాయి.
ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా టీఎన్టీయూసీని ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా జనసేన మద్దతుదారుల ఓట్లకు గాలం వేసింది. ఏపీలో టీడీపీతో సాగుతున్నా… కాంగ్రెస్ వ్యూహంతో ఇక్కడి జనసేన ఓట్లలో చీలిక వచ్చేసిందట. ఓ వర్గం టీడీపీతోనే ఉండగా… చీలిక వర్గం కాంగ్రెస్ తో జత కట్టిందట. పలితంగా టీడీపీ, వైసీపీ జెండాలు కలిసిపోగా… జనసేన జెండాలు మాత్రం రెండు శిబిరాల్లోనూ కనిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఫలితం కూడా శుక్రవారం రాత్రికి విడుదల కానుంది.
This post was last modified on January 31, 2025 7:07 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…