విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో విశాక ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వబోమని ఏపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పారు.
కానీ, వైసీపీ నేతలు మాత్రం అది అసత్యమంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పర్యటించిన కుమార స్వామి మరోసారి ఆ అంశంపై కీలక ప్రకటన చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్ ను పునర్నిర్మిస్తామని తెలిపారు. విశాఖ ఉక్కును పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కుమార స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉందని, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాల కారణంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం 35 వేల కోట్లు అప్పుల్లో స్టీల్ ప్లాంట్ ఉందని అన్నారు. ప్రైవేటీకరణ వద్దని సీఎం చంద్రబాబు, లోకేష్ చాలాసార్లు విజ్ఞప్తి చేశారని, తమ అభ్యర్థనలను ప్రధాని మోదీ అంగీకరించారని అన్నారు.
ఈ క్రమంలోనే మొదటి దశలో అప్పుల నుంచి బయట పడేందుకు కేంద్రం దాదాపు 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఎన్పీఏ సమస్య పరిష్కరించిన తర్వాత 2 ఫార్మేసులు సమర్ధవంతంగా నిర్వహించడంలో కార్మికులు సక్సెస్ అయ్యారని తెలిపారు.
ప్రస్తుతం స్టీల్ ప్లాంటు సమర్ధవంతంగా పనిచేస్తోందని, కార్మికుల ఇబ్బందులను 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ను నంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని చెప్పారు. తమకు సహకరించమని కోరామని, అందుకు యూనియన్లు అంగీకరించాయని అన్నారు.
This post was last modified on January 30, 2025 7:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…