Political News

9552300009 నెంబ‌ర్‌తో ప్ర‌భుత్వ సేవ‌లు

ఏపీలో వాట్పాస్ గవర్నెన్స్ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కొత్త తరహా సేవలను ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రభుత్వం తరఫున అధికారిక వాట్సాప్ నెంబరును లోకేశ్ విడుదల చేశారు.ఆ నెంబరు 9552300009 గా లోకేశ్ ప్రకటించారు. ఈ నెంబర్ కు సందేశం పంపడం ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకుని పొందవచ్చని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కొత్త సేవల గురించి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్పిందని,… ఈ విషయంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని ఆయన తెలిపారు. వాట్సాప్ గవర్నెన్న్ ను అమలు చేస్తున్న తొలి ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం ప్రపంచంలోనే గుర్తింపు సంపాదించుకుందని ఆయన తెలిపారు.

ఈ సేవల్లో భాగంగా తొలుత 161 సేవలను అందిస్తామన్న లోకేశ్… మలి విడతలో మరో 360 సేవలను జత చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల్లో రెవెన్యూ, మునిసిపల్, ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయ శాఖ తదితర శాఖల సేవలను తొలి దశలో అందిస్తామని తెలిపారు. చివరకు టీటీడీ సేవలను దీని ద్వారా అందజేస్తామన్నారు. ఇక ఈ సేవలను వినియోగించుకోవడం కూడా చాలా సులభమేనని కూడా లోకేశ్ వివరించారు.

అయినా వాట్సాప్ గవర్నెన్స్ నే తాము ఎందుకు ఎంచుకున్నామన్న విషయాన్ని కూడా లోకేశ్ వెల్లడించారు. వాట్సాప్ దాదాపుగా అందరూ వినియోగిస్తున్న సేవగా గుర్తించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా యువగళం పాదయాత్రలో భాగంగా సర్టిఫికెట్లను పొందడంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించానని… ఆ ఇబ్బందిని తొలగించేందుకే ఈ కొత్త విదానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు అందించే సర్టిఫికెట్ల మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పిన లోకేశ్… ఆయా ప్రభుత్వ శాఖల్లో దీనిని స్కాన్ చేస్తే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. తద్వారా నకిలీలకు చెక్ పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ ను ఆరు నెలల పాటు అమలు చేస్తూనే నిశితంగా పరిశీలన చేస్తామని లోకేశ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను మరింత సులభతరం చేసేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. ఈ సేవల వినియోగం తీరును క్లుప్తంగా వివరించిన లోకేశ్… సేవల వినియోగం సులభమేనని తెలిపారు. ఎక్కడైనా ఈ సేవలత్లో అంతరాయం కలిగితే… ప్రభుత్వం నుంచే సంబంధిత వ్యక్తులను ఫోన్ వెళుతుందని తెలిపారు. అంటే… ఈ సేవల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెటా నుంచి సంద్య పాల్గొన్నారు. తన స్వస్థలం విశాఖపట్టణంగా ఆమె ఈ సందర్బంగా వెల్లడించారు.

This post was last modified on January 30, 2025 1:43 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

3 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

4 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

5 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

6 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

10 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

11 hours ago