ఏపీలో వాట్పాస్ గవర్నెన్స్ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కొత్త తరహా సేవలను ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రభుత్వం తరఫున అధికారిక వాట్సాప్ నెంబరును లోకేశ్ విడుదల చేశారు.ఆ నెంబరు 9552300009 గా లోకేశ్ ప్రకటించారు. ఈ నెంబర్ కు సందేశం పంపడం ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకుని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త సేవల గురించి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్పిందని,… ఈ విషయంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని ఆయన తెలిపారు. వాట్సాప్ గవర్నెన్న్ ను అమలు చేస్తున్న తొలి ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం ప్రపంచంలోనే గుర్తింపు సంపాదించుకుందని ఆయన తెలిపారు.
ఈ సేవల్లో భాగంగా తొలుత 161 సేవలను అందిస్తామన్న లోకేశ్… మలి విడతలో మరో 360 సేవలను జత చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల్లో రెవెన్యూ, మునిసిపల్, ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయ శాఖ తదితర శాఖల సేవలను తొలి దశలో అందిస్తామని తెలిపారు. చివరకు టీటీడీ సేవలను దీని ద్వారా అందజేస్తామన్నారు. ఇక ఈ సేవలను వినియోగించుకోవడం కూడా చాలా సులభమేనని కూడా లోకేశ్ వివరించారు.
అయినా వాట్సాప్ గవర్నెన్స్ నే తాము ఎందుకు ఎంచుకున్నామన్న విషయాన్ని కూడా లోకేశ్ వెల్లడించారు. వాట్సాప్ దాదాపుగా అందరూ వినియోగిస్తున్న సేవగా గుర్తించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా యువగళం పాదయాత్రలో భాగంగా సర్టిఫికెట్లను పొందడంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించానని… ఆ ఇబ్బందిని తొలగించేందుకే ఈ కొత్త విదానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు అందించే సర్టిఫికెట్ల మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పిన లోకేశ్… ఆయా ప్రభుత్వ శాఖల్లో దీనిని స్కాన్ చేస్తే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. తద్వారా నకిలీలకు చెక్ పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ ను ఆరు నెలల పాటు అమలు చేస్తూనే నిశితంగా పరిశీలన చేస్తామని లోకేశ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను మరింత సులభతరం చేసేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. ఈ సేవల వినియోగం తీరును క్లుప్తంగా వివరించిన లోకేశ్… సేవల వినియోగం సులభమేనని తెలిపారు. ఎక్కడైనా ఈ సేవలత్లో అంతరాయం కలిగితే… ప్రభుత్వం నుంచే సంబంధిత వ్యక్తులను ఫోన్ వెళుతుందని తెలిపారు. అంటే… ఈ సేవల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెటా నుంచి సంద్య పాల్గొన్నారు. తన స్వస్థలం విశాఖపట్టణంగా ఆమె ఈ సందర్బంగా వెల్లడించారు.
This post was last modified on January 30, 2025 1:43 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…