ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు కొట్టిన దెబ్బ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా గట్టిగానే తగిలింది. అప్పటిదాకా తనను ఎవరూ ఏమి చేయలేరన్నట్లుగా టేకిట్ ఈజీగా సాగిన వర్మ… సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కూడిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు కొరడా ఝుళిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి తాను తీసుకున్న రూ.1.15 కోట్ల నిధులను తిరిగి చెల్లించాలంటూ నోటీసులు రావడం ఆయనను మరింతగా కలవరపాటుకు గురి చేసింది.
కారణమేమిటో తెలియదు గానీ… టీడీపీ పేరు విన్నా, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు విన్నా వర్మ భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై ఆయన సెటైర్లు సంధిస్తూనే ఉంటారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ అన్నా కూడా వర్మ విమర్శలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి వర్మ దగ్గరయ్యారు. టీడీపీ, జనసేనలను గిల్లి మరీ ఏడిపించే యత్నం చేశారు.
వర్మ మార్కు జిత్తులకు బాగానే ఎంజాయి చేసిన జగన్.. వర్మకు ఆయాచిత లబ్ధి చేకూర్చారన్నది కూటమి సర్కారు ఆరోపణ. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం పేరిట వర్మ తీసిన సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లను జగన్ సర్కారు విడుదల చేసింది. తాజాగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ యువనేత జీవీ రెడ్డి… ఈ వ్యవహారాన్ని బయటకు తీశారు. ఎందుకైతే వర్మకు జగన్ హయాంలో నిధులు విడుదల చేశారో… ఆ లక్ష్యం నెరవేరలేదని తేల్చారు.
నిర్దేశించిన లక్ష్యం నెరవేరకుంటే… తీసుకున్న సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సిందే కదా. అదే వాదనను బయటకు తీసిన జీవీ రెడ్డి… ఫైబర్ నెట్ నుంచి తీసుకున్న నిధులను తక్షణమే రిటర్న్ చేయాలని వర్మకు నోటీసులు పంపారట. ఈ నోటీసులకు వెంటనే స్పందించిన వర్మ… ఇప్పటికిప్పుడు అంత డబ్బు వెనక్కి ఇచ్చేయాలంటే ఎలా? ఇప్పుడు తన వద్ద అంత డబ్బు లేదు.. అంటూ బదులిచ్చారట. వర్మ ఆన్సర్ తో ఏం చేయాలో ఆలోచించిన రెడ్డి.. నిధుల చెల్లింపునకు వర్మకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ లోగా వర్మ డబ్బు చెల్లించకుంటే,..చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అంటే… ఈ వ్యవహారంలోనూ వర్మ జైలుకు వెళ్లే ప్రమాదం ముందు నిలిచినట్టేనా అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on January 30, 2025 12:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…