ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు కొట్టిన దెబ్బ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా గట్టిగానే తగిలింది. అప్పటిదాకా తనను ఎవరూ ఏమి చేయలేరన్నట్లుగా టేకిట్ ఈజీగా సాగిన వర్మ… సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కూడిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు కొరడా ఝుళిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి తాను తీసుకున్న రూ.1.15 కోట్ల నిధులను తిరిగి చెల్లించాలంటూ నోటీసులు రావడం ఆయనను మరింతగా కలవరపాటుకు గురి చేసింది.
కారణమేమిటో తెలియదు గానీ… టీడీపీ పేరు విన్నా, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు విన్నా వర్మ భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై ఆయన సెటైర్లు సంధిస్తూనే ఉంటారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ అన్నా కూడా వర్మ విమర్శలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి వర్మ దగ్గరయ్యారు. టీడీపీ, జనసేనలను గిల్లి మరీ ఏడిపించే యత్నం చేశారు.
వర్మ మార్కు జిత్తులకు బాగానే ఎంజాయి చేసిన జగన్.. వర్మకు ఆయాచిత లబ్ధి చేకూర్చారన్నది కూటమి సర్కారు ఆరోపణ. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం పేరిట వర్మ తీసిన సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లను జగన్ సర్కారు విడుదల చేసింది. తాజాగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ యువనేత జీవీ రెడ్డి… ఈ వ్యవహారాన్ని బయటకు తీశారు. ఎందుకైతే వర్మకు జగన్ హయాంలో నిధులు విడుదల చేశారో… ఆ లక్ష్యం నెరవేరలేదని తేల్చారు.
నిర్దేశించిన లక్ష్యం నెరవేరకుంటే… తీసుకున్న సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సిందే కదా. అదే వాదనను బయటకు తీసిన జీవీ రెడ్డి… ఫైబర్ నెట్ నుంచి తీసుకున్న నిధులను తక్షణమే రిటర్న్ చేయాలని వర్మకు నోటీసులు పంపారట. ఈ నోటీసులకు వెంటనే స్పందించిన వర్మ… ఇప్పటికిప్పుడు అంత డబ్బు వెనక్కి ఇచ్చేయాలంటే ఎలా? ఇప్పుడు తన వద్ద అంత డబ్బు లేదు.. అంటూ బదులిచ్చారట. వర్మ ఆన్సర్ తో ఏం చేయాలో ఆలోచించిన రెడ్డి.. నిధుల చెల్లింపునకు వర్మకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ లోగా వర్మ డబ్బు చెల్లించకుంటే,..చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అంటే… ఈ వ్యవహారంలోనూ వర్మ జైలుకు వెళ్లే ప్రమాదం ముందు నిలిచినట్టేనా అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…