Political News

అన్న క్యాంటీన్ లో కొత్త నిబంధన!… సూపర్ బాసూ!

అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు.

ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు.

అయితే ఇంత మంచిగా జనం కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకూ అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భోజనం సరిగా లేదనో, లేదంటే పరిసరాలు శుభ్రంగా లేవనో, లేదంటే సిబ్బంది అధిక మొత్తం డబ్బు అడుగుతున్నారనో…అలా వస్తున్న విమర్శలు ఇలా వెళ్లిపోతున్నాయి.

అయితే ఇప్పుడు కొత్త తరహా ఇబ్బంది వచ్చింది. ఫుల్లుగా మందేసి వస్తున్న మందుబాబులతో అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ తరహా ఇబ్బందికీ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని అన్న క్యాంటీన్ల వద్ద చెక్ పడిపోయింది. నగరంలోని అన్న క్యాంటీన్ల ప్రధాన ద్వారాల పక్కన అద్దాలకు ఇప్పుడు ఓ కొత్త నోటీస్ కనిపిస్తోంది. మందు త్రాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడు అంటూ రాసి ఉన్న సదరు నోటీసు మందుబాటుకు షాక్ ఇస్తోంది.

ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉన్న ఈ నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on January 30, 2025 10:21 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago