అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు.
ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు.
అయితే ఇంత మంచిగా జనం కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకూ అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భోజనం సరిగా లేదనో, లేదంటే పరిసరాలు శుభ్రంగా లేవనో, లేదంటే సిబ్బంది అధిక మొత్తం డబ్బు అడుగుతున్నారనో…అలా వస్తున్న విమర్శలు ఇలా వెళ్లిపోతున్నాయి.
అయితే ఇప్పుడు కొత్త తరహా ఇబ్బంది వచ్చింది. ఫుల్లుగా మందేసి వస్తున్న మందుబాబులతో అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ తరహా ఇబ్బందికీ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని అన్న క్యాంటీన్ల వద్ద చెక్ పడిపోయింది. నగరంలోని అన్న క్యాంటీన్ల ప్రధాన ద్వారాల పక్కన అద్దాలకు ఇప్పుడు ఓ కొత్త నోటీస్ కనిపిస్తోంది. మందు త్రాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడు అంటూ రాసి ఉన్న సదరు నోటీసు మందుబాటుకు షాక్ ఇస్తోంది.
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉన్న ఈ నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on January 30, 2025 10:21 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…