అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు.
ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు.
అయితే ఇంత మంచిగా జనం కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకూ అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భోజనం సరిగా లేదనో, లేదంటే పరిసరాలు శుభ్రంగా లేవనో, లేదంటే సిబ్బంది అధిక మొత్తం డబ్బు అడుగుతున్నారనో…అలా వస్తున్న విమర్శలు ఇలా వెళ్లిపోతున్నాయి.
అయితే ఇప్పుడు కొత్త తరహా ఇబ్బంది వచ్చింది. ఫుల్లుగా మందేసి వస్తున్న మందుబాబులతో అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ తరహా ఇబ్బందికీ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని అన్న క్యాంటీన్ల వద్ద చెక్ పడిపోయింది. నగరంలోని అన్న క్యాంటీన్ల ప్రధాన ద్వారాల పక్కన అద్దాలకు ఇప్పుడు ఓ కొత్త నోటీస్ కనిపిస్తోంది. మందు త్రాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడు అంటూ రాసి ఉన్న సదరు నోటీసు మందుబాటుకు షాక్ ఇస్తోంది.
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉన్న ఈ నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…