అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు.
ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు.
అయితే ఇంత మంచిగా జనం కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకూ అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భోజనం సరిగా లేదనో, లేదంటే పరిసరాలు శుభ్రంగా లేవనో, లేదంటే సిబ్బంది అధిక మొత్తం డబ్బు అడుగుతున్నారనో…అలా వస్తున్న విమర్శలు ఇలా వెళ్లిపోతున్నాయి.
అయితే ఇప్పుడు కొత్త తరహా ఇబ్బంది వచ్చింది. ఫుల్లుగా మందేసి వస్తున్న మందుబాబులతో అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ తరహా ఇబ్బందికీ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని అన్న క్యాంటీన్ల వద్ద చెక్ పడిపోయింది. నగరంలోని అన్న క్యాంటీన్ల ప్రధాన ద్వారాల పక్కన అద్దాలకు ఇప్పుడు ఓ కొత్త నోటీస్ కనిపిస్తోంది. మందు త్రాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడు అంటూ రాసి ఉన్న సదరు నోటీసు మందుబాటుకు షాక్ ఇస్తోంది.
ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉన్న ఈ నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on January 30, 2025 10:21 am
రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
భారతదేశ చరిత్రలో ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 16)కు ఒక ప్రత్యేకత ఉండనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లోక్ సభ…