Political News

10-15-30.. కుంభ‌మేళా మృతులు.. తెలుగు వారు ఉన్నారా?

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న ప‌విత్ర మ‌హాకుంభ‌మేళాలో బుధ‌వారం తెల్ల‌వారు జామున చోటు చేసుకున్న తొక్కి సలాట‌లో మౌని అమావాస్య సంద‌ర్భంగా పుణ్య స్నానం ఆచ‌రించేందుకు వ‌చ్చిన భ‌క్తుల్లో కొంద‌రు మృత్యువాత ప‌డ్డారు.  అయితే.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. సుమారు 5-6 గంట‌ల పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌కు కూడా.. మౌనం వ‌హించాయి. అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది.. బాహ్య ప్ర‌పంచానికి తెలిసినా.. యూపీ స‌ర్కారు మాత్రం తొక్కిస‌లాట జ‌రిగింద‌ని కానీ.. ఇంత మంది మృతి చెందార‌ని కానీ చెప్ప‌కుండా పోవ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి, విమ‌ర్శ‌ల‌కు గురి చేసింది.

అయితే.. న‌లుదిక్కుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల‌తో మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ తొలిసారి మ‌హాకుంభ‌మేళాలో తొక్కిస‌లాట జ‌రిగింద‌ని.. మృతుల‌కు నివాళులర్పిస్తున్నాన‌ని చెప్పిన త‌ర్వాత కానీ.. యూపీ స‌ర్కారు నుంచి అదికారిక ప్ర‌క‌ట‌న బ‌య‌ట‌కు రాలేదు. అప్ప‌టి వ‌ర‌కు `జ‌రిగిన ఘ‌ట‌న‌` బాధాక‌రం అంటూ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. అంతేకాదు.. వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని, సోష‌ల్ మీడియాలో అభూత క‌ల్ప‌న‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎట్ట‌కేల‌కు.. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయికి కూడా ఈ విష‌యం చేరిపోవ‌డంతో చివ‌ర‌కు స‌ర్కారు య‌దార్థాన్ని తాజాగా వివ‌రించింది.

మ‌హాకుంభ‌మేళాలో ఏం జ‌రిగిందో ఇక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న డీఐజీ స్థాయి అధికారి వివ‌రించారు. తెల్ల‌వారు జామున 1-2 గంట‌ల మ‌ధ్య జ‌రిగిన ఈ తొక్కిస‌లాట‌లో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రో 80 మంది వ‌ర‌కు ఆసుప‌త్రిలో ఇంకా చికిత్స పొందుతున్నార‌ని బుధ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో డీఐజీ వివ‌రించారు. క్రౌడ్‌ను నియంత్రించేందుకు ఏఐ త‌ర‌హా సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్నామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. భ‌క్తులు కోట్ల సంఖ్య‌లో రావ‌డంతో సెక్టార్‌-2లో ప‌రిస్థితి అదుపు త‌ప్పింద‌న్నారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.

మృతుల్లో తెలుగు వారు?

తొక్కిస‌లాట‌లో మృతి చెందిన వారిలో ఒక‌రిద్ద‌రు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు ఉన్నార‌న్న స‌మాచారం హ‌ల్చ‌ల్ చేస్తోంది. అయితే.. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన వారిలో అయితే.. తెలుగు వారు లేర‌ని అధికారులు తెలిపారు. కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఒక‌రిద్ద‌రు మృతి చెందారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉందని, అప్ప‌టి వ‌ర‌కు వదంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని డీఐజీ సూచించారు. 

This post was last modified on January 29, 2025 10:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

32 minutes ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

4 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

4 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

10 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

12 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

12 hours ago