టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. 74 వయసులోనూ యమా యాక్టివ్ గా కదులుతున్న చంద్రబాబు… ఇటీవలే నాలుగో పర్యాయం సీఎం పదవిని చేపట్టారు. అటు రాజకీయాల్లో, ఇటు వ్యక్తిగతంగానూ క్రమశిక్షణతో మెలిగే చంద్రబాబు… యువ రాజకీయవేత్తలకు ఆదర్శమనే చెప్పాలి. యువ నేతలకే కాదు… ప్రధాన మంత్రి పదవిలో పదేళ్లకు పైగా నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్బంగా బీజేపీ తరఫున ఆ పార్టీ సీనియర్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభా వేదికపై నిలిచిన మోదీకి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నేత రవీంద్ర సింగ్ పాదాభివందనం చేశారు. వేదికపైకి వచ్చీరావడంతోనే మోదీ పాదాలకు సింగ్ నమస్కారం చేశారు.
అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా మోదీ.. సింగ్ పాదాలను టచ్ చేస్తూ పాదాభివందనం చేశారు. యువకుడైన సింగ్ కాళ్లకు మోదీ మొక్కడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ విషయంలో మోదీ… చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనకు ఎవరూ పాదాభివందనం చేయరాదంటూ చంద్రబాబు చాలా కాలం క్రితమే కోరిన సంగతి తెలిసిందే. తన మాట కాదని ఎవరైనా తనకు పాదాభివందనం చేస్తే… తాను కూడా వారికి పాదాభివందనం చేస్తానని కూడా హెచ్చరించారు. చంద్రబాబు మాటను లెక్కచేయకుండా ఇటీవల ఓ వ్యక్తి చంద్రబాబుకు పాదాభివందనం చేయగా…. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సదరు వ్యక్తి పాదాలను టచ్ చేసి అందరికీ షాకిచ్చారు.
ఇటీవలి కాలంలో మోదీ కూడా చంద్రబాబు మాదిరిగానే… తన పాదాలకు ఎవరూ నమస్కారం చేయవద్దని చెబుతూ వస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఆయన మాటను ఎవరూ లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు మాదిరిగా తన పాదాలకు నమస్కారం చేసిన వారికి ప్రతిగా వారి పాదాలకు నమస్కారం చేస్తే సరిపోతుందని మోదీ భావించినట్లున్నారు. ఈ క్రమంలోనే తనకు పాదాభివందనం చేసిన సింగ్ కు మోదీ పాదాభివందనం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 29, 2025 10:32 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…