అదేంటో గానీ.. అధికారంలో ఉన్నంత కాలం దర్జాగా ఎంజాయి చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారం నుంచి దిగిపోయినంతనే ప్రతి చిన్న విషయంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ దొరకడం కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చేతికే ఆయన చిక్కిపోతున్నారు. వెరసి ఇలా జగన్ బుక్కైన ప్రతి సారి లోకేశ్ తనదైన శైలిలో వైసీపీ అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరో అంశంలోనూ లోకేశ్ కు జగన్ దొరికిపోయారు.
వైసీపీ పాలనలో నాడు నేడు అంటూ ప్రభుత్వ బడులను మెరుగు పరిచే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టినట్టు జగన్ నిత్యం చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుడా అమ్మ ఒడి అని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అని, సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం అని, పిల్లలకు బైజూస్ కోచింగ్ అని, బైలింగ్యువల్ బుక్కులని… ఇలా లెక్కలేనన్ని సంస్కరణలు తీసుకుని వచ్చానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తాను చేపట్టిన సంస్కరణల ద్వారా అక్షరాస్యతలో కేరళను మించి ఏపీ ఫస్ట్ ప్లేస్ చేరుకుందని ఊదరగొట్టారు.
తాజాగా కూటమి కేబినెట్ లో విద్యా శాఖ పగ్గాలు చేపట్టిన లోకేశ్… జగన్ సంస్కరణల వల్ల సర్కారీ విద్య మెరుగుపడిందా?… లేదంటే డీలా పడిందా? అన్న దిశగా కాస్తంత లోతుగానే పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ విద్యా వ్యవస్థ స్థితిగతులపై ఏటా విడుదలవుతున్న యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎష్ఈఆర్) నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో ఏపీ విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు గణాంకాలతో సహా ఉన్నాయి. వీటిని పరిశీలించిన లోకేశ్… సర్కారీ బడులను జగన్ సర్వనాశనం చేశారని తేల్చారు. ఈ వివరాలతో లోకేశ్..జగన్ పై మరో అస్త్రాన్ని వదిలారు. జగన్ సర్కారీ బడి పిల్లలకు మేనమామ కాదని, ఆయన పిల్లల పాలిట ముమ్మాటికీ కంస మామేనని సెటైర్ సంధించారు.
ఇక జగన్ జమానాలో సర్కారీ బడుల పతనానికి సంబంధించి లోకేశ్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే… ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 14 ఏళ్ల పిల్లల హాజరు శాతం 2018లో 63.2 శాతం ఉంటే… 2024లో అది 61.8 శాతానికి పడిపోయింది. ఇక తాగునీటి సౌకర్యం ఉన్న సర్కారీ బడులు 2018లో 58.1 శాతం అయితే…2024లో అది 55.9 శాతానికి పడిపోయింది. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న బడులు 2018లో 86.4 శాతం అయితే… 2024లో అది 78.4 శాతానికి పడిపోయింది. బడుల్లోబాలికలకు ప్రత్యేక మరుగు దొడ్లు కలిగిన పాఠశాలలు 2018లో 81.1 శాతంగా ఉంటే… 2024లో అది 77.2 శాతానికి పడిపోయింది.
This post was last modified on January 29, 2025 10:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…