Political News

మహా కుంభమేళాలో రోజా… అదే టైంలో తొక్కిసలాట

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివచ్చారు. వీరిలో వీవీఐపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు.

మంగళవారం రాత్రికే ప్రయాగ్ రాజ్ చేరుకున్న రోజా.. బుధవారం కుంభ మేళాలో పుణ్య స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభ మేళాలో మరో మహిళతో కలిసి రిక్షాపై కూర్చుని వెళుతూ రోజా కనిపించారు. ఆ తర్వాత నదిలో పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఇలా కుంభమేళాలో రోజా సంచరిస్తున్న, పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.

సరిగ్గా రోజా ప్రయాగ్ రాజ్ లో ఉన్న సమయంలోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపింది. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో రోజా ప్రయాగ్ రాజ్ లోనే ఉన్నారు. అయితే ఆమె అక్కడి ఏ ఘాట్ లో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా తొక్కిసలాట జరిగిన రోజే.. రోజా అక్కడ ఉన్న వైనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

This post was last modified on January 29, 2025 10:43 pm

Share
Show comments
Published by
Satya
Tags: Roja

Recent Posts

స్మార్టుగా తప్పించుకున్న మాస్ మహారాజా

ఏదో కామెడీతో ఆడేస్తుందనుకున్న ఫంకీ మొదటి వారంలోనే చేతులెత్తేయడం ఊహించని పరిణామం. పెద్దగా పోటీ లేని అవకాశాన్ని వాడుకోలేకపోవడం విశ్వక్…

29 minutes ago

రీల్స్ పిచ్చికి రీల్స్ తోనే సమాధానం

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ఓ వర్గం యువత ఎంతకైనా తెగిస్తోంది. ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…

37 minutes ago

‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’

మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్…

2 hours ago

ముక్కుసూటిగా పోతే.. రఘురామకే ఇబ్బంది.. !

రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు…

2 hours ago

బలవంత్ మీద ఫోకస్ పెరుగుతోంది

ఇది సోషల్ మీడియా కాలం. చిన్న సినిమాలకు మార్కెటింగ్ ప్రాణ సంకటంగా మారిపోయింది. చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక…

3 hours ago

శవమై తేలిన మనపల్లి అత్యాచార నిందితుడు

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా…

3 hours ago