వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివచ్చారు. వీరిలో వీవీఐపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు.
మంగళవారం రాత్రికే ప్రయాగ్ రాజ్ చేరుకున్న రోజా.. బుధవారం కుంభ మేళాలో పుణ్య స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభ మేళాలో మరో మహిళతో కలిసి రిక్షాపై కూర్చుని వెళుతూ రోజా కనిపించారు. ఆ తర్వాత నదిలో పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఇలా కుంభమేళాలో రోజా సంచరిస్తున్న, పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.
సరిగ్గా రోజా ప్రయాగ్ రాజ్ లో ఉన్న సమయంలోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపింది. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో రోజా ప్రయాగ్ రాజ్ లోనే ఉన్నారు. అయితే ఆమె అక్కడి ఏ ఘాట్ లో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా తొక్కిసలాట జరిగిన రోజే.. రోజా అక్కడ ఉన్న వైనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
This post was last modified on January 29, 2025 10:43 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…