వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివచ్చారు. వీరిలో వీవీఐపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు.
మంగళవారం రాత్రికే ప్రయాగ్ రాజ్ చేరుకున్న రోజా.. బుధవారం కుంభ మేళాలో పుణ్య స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభ మేళాలో మరో మహిళతో కలిసి రిక్షాపై కూర్చుని వెళుతూ రోజా కనిపించారు. ఆ తర్వాత నదిలో పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఇలా కుంభమేళాలో రోజా సంచరిస్తున్న, పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.
సరిగ్గా రోజా ప్రయాగ్ రాజ్ లో ఉన్న సమయంలోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపింది. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో రోజా ప్రయాగ్ రాజ్ లోనే ఉన్నారు. అయితే ఆమె అక్కడి ఏ ఘాట్ లో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా తొక్కిసలాట జరిగిన రోజే.. రోజా అక్కడ ఉన్న వైనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
This post was last modified on January 29, 2025 10:43 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…