వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివచ్చారు. వీరిలో వీవీఐపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు.
మంగళవారం రాత్రికే ప్రయాగ్ రాజ్ చేరుకున్న రోజా.. బుధవారం కుంభ మేళాలో పుణ్య స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభ మేళాలో మరో మహిళతో కలిసి రిక్షాపై కూర్చుని వెళుతూ రోజా కనిపించారు. ఆ తర్వాత నదిలో పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఇలా కుంభమేళాలో రోజా సంచరిస్తున్న, పుణ్య స్నానం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.
సరిగ్గా రోజా ప్రయాగ్ రాజ్ లో ఉన్న సమయంలోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపింది. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో రోజా ప్రయాగ్ రాజ్ లోనే ఉన్నారు. అయితే ఆమె అక్కడి ఏ ఘాట్ లో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా తొక్కిసలాట జరిగిన రోజే.. రోజా అక్కడ ఉన్న వైనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
This post was last modified on January 29, 2025 10:43 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…