టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారంటే… అన్ని కొత్త కొత్త అంశాలపైనే చర్చ సాగుతుంది. నిత్యం నూతన పాలనా విధానాలను ప్రజలకు అందిస్తూ సాగుతున్న చంద్రబాబు… తాజాగా ఏపీ ప్రజలకు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ పేరిట సరికొత్త తరహాలో సేవలు అందించనున్నారు.
ఈ చర్యతో ఏపీని ఆయన దేశంలోనే తొలి స్థానంలో నిలపన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర పాలనలోఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పక తప్పదు. బుధవారం పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు… వాట్సాప్ గవర్నెన్స్ ను గురువారం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.
రేపు (గురువారం) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కొత్త విధానంలో వాట్పాస్ ద్వారా 161 సర్వీసులను ప్రజలకు అందించనున్నారు.
ఇందుకోసం ప్రభుత్వం ఓ వాట్సాప్ నెంబర్ ను ప్రకటించనుంది. ఈ నెంబర్ కు ప్రజలు వినతులు పంపితే…ప్రభుత్వం నుంచి ఆయా సేవల వివరాలు, సర్టిఫికెట్లు అదే వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలకు అందనున్నాయి.
ఈ నూతన పాలనా విధానం కోసం ఇదివరకే వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 161 సేవలు మాత్రమే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందనున్నా… మలి దశలో మరిన్ని సేవలను ఈ విధానం ద్వారా అందించనున్నారు.
తొలి దశ సేవల్లో భాగంగా ఆయా శాఖల సేవలతో పాటుగా పలు శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపును కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది.
This post was last modified on January 29, 2025 7:21 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…