రాంగోపాల్ వర్మ.. ఓ దర్శకుడిగా తెరకెక్కించేది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే అయినా.. సహజంగా ఆయన చాలా భయస్తుడు. పోలీసులు, కేసులు, విచారణలు అంటే వర్మ విపరీతంగా భయపడిపోతారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలే నిదర్శనం.
వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల విచారణకు గాను రావాలంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులకు వర్మ పెద్దగా స్పందించకపోవడంతో మద్దిపాడు పోలీసులు వర్మను అరెస్ట్ చేసేందుకు నేరుగా హైదరాబాద్ వెళ్లారు.
అయితే పోలీసుల రాకను గమనించిన వర్మ పత్తా లేకుండా పోయారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న ఆయన… కోర్టు ఆ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే దాకా కూడా వర్మ కనిపించ లేదు. బెయిల్ ఇచ్చినంతనే తానెక్కడికీ వెళ్లలేదని బుకాయించారు.
తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ మరోమారు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన వర్మ… పోలీసులు చెప్పిన ఫిబ్రవరి 4వ తేదీ కాకుండా ఫిబ్రవరి 7న విచారణకు హాజరవుతానంటూ సమాచారం ఇచ్చారట. దీంతో వర్మ చెప్పినట్లుగానే పోలీసులు ఫిబ్రవరి 7న విచారణకు రావాలంటూ మరోమారు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో వర్మను అరెస్ట్ చేయవద్దంటూ ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు… ఆ సందర్భంగా విచారణకు సహకరించాలని వర్మకు ఆదేశాలు జారీ చేసింది., దీంతో విచారణకు హాజరు కాకపోతే ఎక్కడ తన బెయిల్ రద్దు అవుతుందోనన్న భయంతోనే వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…