రాంగోపాల్ వర్మ.. ఓ దర్శకుడిగా తెరకెక్కించేది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే అయినా.. సహజంగా ఆయన చాలా భయస్తుడు. పోలీసులు, కేసులు, విచారణలు అంటే వర్మ విపరీతంగా భయపడిపోతారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలే నిదర్శనం.
వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల విచారణకు గాను రావాలంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులకు వర్మ పెద్దగా స్పందించకపోవడంతో మద్దిపాడు పోలీసులు వర్మను అరెస్ట్ చేసేందుకు నేరుగా హైదరాబాద్ వెళ్లారు.
అయితే పోలీసుల రాకను గమనించిన వర్మ పత్తా లేకుండా పోయారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న ఆయన… కోర్టు ఆ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే దాకా కూడా వర్మ కనిపించ లేదు. బెయిల్ ఇచ్చినంతనే తానెక్కడికీ వెళ్లలేదని బుకాయించారు.
తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ మరోమారు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన వర్మ… పోలీసులు చెప్పిన ఫిబ్రవరి 4వ తేదీ కాకుండా ఫిబ్రవరి 7న విచారణకు హాజరవుతానంటూ సమాచారం ఇచ్చారట. దీంతో వర్మ చెప్పినట్లుగానే పోలీసులు ఫిబ్రవరి 7న విచారణకు రావాలంటూ మరోమారు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో వర్మను అరెస్ట్ చేయవద్దంటూ ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు… ఆ సందర్భంగా విచారణకు సహకరించాలని వర్మకు ఆదేశాలు జారీ చేసింది., దీంతో విచారణకు హాజరు కాకపోతే ఎక్కడ తన బెయిల్ రద్దు అవుతుందోనన్న భయంతోనే వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on January 29, 2025 3:21 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…