రాంగోపాల్ వర్మ.. ఓ దర్శకుడిగా తెరకెక్కించేది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే అయినా.. సహజంగా ఆయన చాలా భయస్తుడు. పోలీసులు, కేసులు, విచారణలు అంటే వర్మ విపరీతంగా భయపడిపోతారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలే నిదర్శనం.
వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల విచారణకు గాను రావాలంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులకు వర్మ పెద్దగా స్పందించకపోవడంతో మద్దిపాడు పోలీసులు వర్మను అరెస్ట్ చేసేందుకు నేరుగా హైదరాబాద్ వెళ్లారు.
అయితే పోలీసుల రాకను గమనించిన వర్మ పత్తా లేకుండా పోయారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న ఆయన… కోర్టు ఆ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే దాకా కూడా వర్మ కనిపించ లేదు. బెయిల్ ఇచ్చినంతనే తానెక్కడికీ వెళ్లలేదని బుకాయించారు.
తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ మరోమారు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన వర్మ… పోలీసులు చెప్పిన ఫిబ్రవరి 4వ తేదీ కాకుండా ఫిబ్రవరి 7న విచారణకు హాజరవుతానంటూ సమాచారం ఇచ్చారట. దీంతో వర్మ చెప్పినట్లుగానే పోలీసులు ఫిబ్రవరి 7న విచారణకు రావాలంటూ మరోమారు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో వర్మను అరెస్ట్ చేయవద్దంటూ ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు… ఆ సందర్భంగా విచారణకు సహకరించాలని వర్మకు ఆదేశాలు జారీ చేసింది., దీంతో విచారణకు హాజరు కాకపోతే ఎక్కడ తన బెయిల్ రద్దు అవుతుందోనన్న భయంతోనే వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on January 29, 2025 3:21 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…