ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు టార్గెట్ విధించారు. “ఏం తెస్తారో చూస్తా.. మీ సత్తా ఏంటో గమనిస్తా” అని ఆయన ఎంపీలను ఉద్దేశించి.. నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడుతుండడమే. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిపేలా ఎంపీలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే వారికి స్పష్టం చేశారు. రెండు సార్లు వారితో భేటీ అయ్యారు. ఏపీ ప్రాధాన్యాలను కూడా ఎంపీలకు వివరించారు.
అయితే.. చివరి నిముషంలోనూ బడ్జెట్లో మార్పులు , చేర్పులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, అమలు చేయాల్సిన పథకాలు సహా.. అనేక విషయాలను వారితో చర్చించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క ఎంపీ కూడా.. తమ తమ పరిధిలో రాష్ట్రానికి మేలు జరిగేలా.. పథకాలకు సొమ్ములు అందేలా చర్యలు తీసుకుని .. బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టేలా చూడాలని కోరారు.
ప్రస్తుతం ఒక్క రోజు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పు చేసేందుకు అవకాశం ఉన్న దరిమిలా.. చివరి నిముషాన్ని కూడా.. పక్కాగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని.. కొన్నింటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు ఉన్న జిల్లాలలోని పార్లమెంటు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు.. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత.. తాను అన్నీ పరిశీలిస్తానని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్తూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు. తెలుగు దనాన్ని ఢిల్లీ వరకు విస్తరిస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం ఎంపీగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. విజయనగరం పార్లెమెంటు స్థానానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. కాగా.. ఈ విషయంలో ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు తీసుకురావడంతోపాటు.. ప్రాజెక్టులకు కూడా నిధులు తెచ్చే బాధ్యతను చంద్రబాబు వారిపైనే పెట్టారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…