Political News

ఏం తెస్తారో చూస్తా: ఎంపీల‌కు చంద్ర‌బాబు టార్గెట్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల‌కు టార్గెట్ విధించారు. “ఏం తెస్తారో చూస్తా.. మీ స‌త్తా ఏంటో గ‌మ‌నిస్తా” అని ఆయ‌న ఎంపీల‌ను ఉద్దేశించి.. న‌వ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి కార‌ణం.. ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ప్ర‌భుత్వం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతుండ‌డ‌మే. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్ర‌త్యేక కేటాయింపులు జ‌రిపేలా ఎంపీలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే వారికి స్ప‌ష్టం చేశారు. రెండు సార్లు వారితో భేటీ అయ్యారు. ఏపీ ప్రాధాన్యాల‌ను కూడా ఎంపీల‌కు వివ‌రించారు.

అయితే.. చివ‌రి నిముషంలోనూ బ‌డ్జెట్‌లో మార్పులు , చేర్పులు ఉండే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో చంద్రబాబు మ‌రోసారి ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిస్థితి, అమలు చేయాల్సిన ప‌థ‌కాలు స‌హా.. అనేక విష‌యాల‌ను వారితో చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క ఎంపీ కూడా.. త‌మ త‌మ ప‌రిధిలో రాష్ట్రానికి మేలు జ‌రిగేలా.. ప‌థ‌కాల‌కు సొమ్ములు అందేలా చ‌ర్య‌లు తీసుకుని .. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో పెట్టేలా చూడాల‌ని కోరారు.

ప్ర‌స్తుతం ఒక్క రోజు మాత్ర‌మే బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో మార్పు చేసేందుకు అవ‌కాశం ఉన్న ద‌రిమిలా.. చివరి నిముషాన్ని కూడా.. ప‌క్కాగా వినియోగించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంద‌ని.. కొన్నింటిని ప్రారంభించాల్సి ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాజెక్టులు ఉన్న జిల్లాల‌లోని పార్ల‌మెంటు స్థానాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎంపీలు.. ఒక్కొక్క‌రు ఒక్కొక్క బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. బ‌డ్జెట్ త‌ర్వాత‌.. తాను అన్నీ ప‌రిశీలిస్తాన‌ని కూడా చెప్పారు.

ఈ సంద‌ర్భంగా సైకిల్ పై పార్ల‌మెంటుకు వెళ్తూ.. త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటున్న విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడును చంద్ర‌బాబు అభినందించారు. తెలుగు ద‌నాన్ని ఢిల్లీ వ‌ర‌కు విస్త‌రిస్తున్నారని ప్ర‌శంసించారు. విజ‌య‌న‌గ‌రం ఎంపీగా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. విజ‌య‌న‌గ‌రం పార్లెమెంటు స్థానానికి కూడా మంచి పేరు తీసుకురావాల‌ని చంద్ర‌బాబు సూచించారు. కాగా.. ఈ విష‌యంలో ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌కు నిధులు తీసుకురావ‌డంతోపాటు.. ప్రాజెక్టుల‌కు కూడా నిధులు తెచ్చే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు వారిపైనే పెట్టారు.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

45 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

1 hour ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago