ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు టార్గెట్ విధించారు. “ఏం తెస్తారో చూస్తా.. మీ సత్తా ఏంటో గమనిస్తా” అని ఆయన ఎంపీలను ఉద్దేశించి.. నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడుతుండడమే. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిపేలా ఎంపీలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే వారికి స్పష్టం చేశారు. రెండు సార్లు వారితో భేటీ అయ్యారు. ఏపీ ప్రాధాన్యాలను కూడా ఎంపీలకు వివరించారు.
అయితే.. చివరి నిముషంలోనూ బడ్జెట్లో మార్పులు , చేర్పులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, అమలు చేయాల్సిన పథకాలు సహా.. అనేక విషయాలను వారితో చర్చించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క ఎంపీ కూడా.. తమ తమ పరిధిలో రాష్ట్రానికి మేలు జరిగేలా.. పథకాలకు సొమ్ములు అందేలా చర్యలు తీసుకుని .. బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టేలా చూడాలని కోరారు.
ప్రస్తుతం ఒక్క రోజు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పు చేసేందుకు అవకాశం ఉన్న దరిమిలా.. చివరి నిముషాన్ని కూడా.. పక్కాగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని.. కొన్నింటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు ఉన్న జిల్లాలలోని పార్లమెంటు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు.. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత.. తాను అన్నీ పరిశీలిస్తానని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్తూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు. తెలుగు దనాన్ని ఢిల్లీ వరకు విస్తరిస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం ఎంపీగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. విజయనగరం పార్లెమెంటు స్థానానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. కాగా.. ఈ విషయంలో ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు తీసుకురావడంతోపాటు.. ప్రాజెక్టులకు కూడా నిధులు తెచ్చే బాధ్యతను చంద్రబాబు వారిపైనే పెట్టారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…