ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు టార్గెట్ విధించారు. “ఏం తెస్తారో చూస్తా.. మీ సత్తా ఏంటో గమనిస్తా” అని ఆయన ఎంపీలను ఉద్దేశించి.. నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడుతుండడమే. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిపేలా ఎంపీలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే వారికి స్పష్టం చేశారు. రెండు సార్లు వారితో భేటీ అయ్యారు. ఏపీ ప్రాధాన్యాలను కూడా ఎంపీలకు వివరించారు.
అయితే.. చివరి నిముషంలోనూ బడ్జెట్లో మార్పులు , చేర్పులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, అమలు చేయాల్సిన పథకాలు సహా.. అనేక విషయాలను వారితో చర్చించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్క ఎంపీ కూడా.. తమ తమ పరిధిలో రాష్ట్రానికి మేలు జరిగేలా.. పథకాలకు సొమ్ములు అందేలా చర్యలు తీసుకుని .. బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టేలా చూడాలని కోరారు.
ప్రస్తుతం ఒక్క రోజు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పు చేసేందుకు అవకాశం ఉన్న దరిమిలా.. చివరి నిముషాన్ని కూడా.. పక్కాగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని.. కొన్నింటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు ఉన్న జిల్లాలలోని పార్లమెంటు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు.. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత.. తాను అన్నీ పరిశీలిస్తానని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్తూ.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు. తెలుగు దనాన్ని ఢిల్లీ వరకు విస్తరిస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం ఎంపీగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. విజయనగరం పార్లెమెంటు స్థానానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. కాగా.. ఈ విషయంలో ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు తీసుకురావడంతోపాటు.. ప్రాజెక్టులకు కూడా నిధులు తెచ్చే బాధ్యతను చంద్రబాబు వారిపైనే పెట్టారు.
This post was last modified on January 29, 2025 9:47 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…