ఏపీలోని కూటమి ప్రభుత్వ మిత్రపక్షం బీజేపీకి మేలు చేసేలా.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 70 స్థానాలున్న అసెంబ్లీకి వచ్చే నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కీలక పార్టీలైన ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ అధికారం కోల్పోకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. కానీ, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలని బీజేపీ నిర్ణయించుకోగా.. ఈ సారైనా.. తమ సత్తా చాటాలని.. పునర్ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల మధ్య ప్రచారం హోరెత్తి పోతోంది. అంతేకాదు.. ఢిల్లీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లెక్కకు మిక్కిలిగా ఉచిత హామీలను గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సలసల కాగుతున్న ఈ ప్రచార పర్వంలో బీజేపీ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. గత నెలలోనే ఆయనకు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ప్రచారం చేయండి బాబూ అంటూ.. పార్టీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచించారు. అయితే.. ఢిల్లీలో అధికారంలో ఉన్నది తన మిత్రుడు, మాజీ సీఎం కేజ్రీవాల్ పార్టీ కావడంతో చంద్రబాబు కొంత తర్జనభర్జనలో పడ్డారు. అయితే.. ఎట్టకేలకు బీజేపీ ఆహ్వానాన్ని మన్నిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఈ నెల 31నే రాజధానికి తరలి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. తెలుగు వారి విషయంలో చంద్రబాబుకు ఉన్న క్రేజ్, విజన్ను దృష్టిలో పెట్టుకుని.. వారి ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబుకు బీజేపీ పెద్దలు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.
కరోల్ బాగ్, పార్లమెంటు రోడ్ సహా.. పలు ప్రాంతాల్లోని తెలుగు వారు ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయనకు సహాయకారులుగా.. బీజేపీనేతలు ఉండనున్నారు. ఇదిలావుంటే.. ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు అదే నెల 8వ తేదీన వెలువడను న్నాయి.
This post was last modified on January 29, 2025 8:12 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…