Political News

బీజేపీ త‌ర‌ఫున బాబు ప్ర‌చారం.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వ మిత్ర‌ప‌క్షం బీజేపీకి మేలు చేసేలా.. సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 70 స్థానాలున్న అసెంబ్లీకి వ‌చ్చే నెల 5న ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో కీల‌క పార్టీలైన ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారం కోల్పోకూడ‌ద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణ‌యించుకుంది. కానీ, ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకోగా.. ఈ సారైనా.. త‌మ స‌త్తా చాటాల‌ని.. పునర్ వైభ‌వం తీసుకురావాల‌ని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూడు పార్టీల మ‌ధ్య ప్ర‌చారం హోరెత్తి పోతోంది. అంతేకాదు.. ఢిల్లీ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు లెక్క‌కు మిక్కిలిగా ఉచిత హామీల‌ను గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. స‌ల‌స‌ల కాగుతున్న ఈ ప్ర‌చార ప‌ర్వంలో బీజేపీ త‌ర‌ఫున ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌నున్నారు. గ‌త నెల‌లోనే ఆయ‌న‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ప్ర‌చారం చేయండి బాబూ అంటూ.. పార్టీ నేత, కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా సూచించారు. అయితే.. ఢిల్లీలో అధికారంలో ఉన్న‌ది త‌న మిత్రుడు, మాజీ సీఎం కేజ్రీవాల్ పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు కొంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లో ప‌డ్డారు. అయితే.. ఎట్ట‌కేల‌కు బీజేపీ ఆహ్వానాన్ని మ‌న్నిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున సీఎం చంద్ర‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఈ నెల 31నే రాజ‌ధానికి త‌ర‌లి వెళ్ల‌నున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు. తెలుగు వారి విష‌యంలో చంద్ర‌బాబుకు ఉన్న క్రేజ్‌, విజ‌న్‌ను దృష్టిలో పెట్టుకుని.. వారి ఓట్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి చంద్ర‌బాబుకు బీజేపీ పెద్ద‌లు షెడ్యూల్ కూడా ఖ‌రారు చేశారు.

క‌రోల్ బాగ్, పార్ల‌మెంటు రోడ్ స‌హా.. ప‌లు ప్రాంతాల్లోని తెలుగు వారు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స‌హాయ‌కారులుగా.. బీజేపీనేత‌లు ఉండ‌నున్నారు. ఇదిలావుంటే.. ఫిబ్రవరి 5వ తేదీన జ‌ర‌గ‌నున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫ‌లితాలు అదే నెల‌ 8వ తేదీన వెలువడను న్నాయి.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

30 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago