మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మిస్తానని టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కుప్పంలో పండే కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేలా అక్కడి రైతులకు ఈ ఎయిర్ పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే చంద్రబాబు కామెంట్లను నాడు అధికారంలో ఉన్న వైసీపీ దాదాపుగా హేళన చేసింది. అయితే తాజాగా మంగళవారం జరిగిన ఓ ఘటన కుప్పంలో ఎంత త్వరగా వీలయితే.. అంత త్వరగా ఎయిర్ పోర్టును నిర్మించాలని చెప్పేసింది.
యువతలోని నైపుణ్యాన్ని వృద్ధి చేసే దిశగా సాగుతున్న 1ఎం1బీ కంపెనీకి ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఈ దిశగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఈ సంస్థ ఇప్పుడు కుప్పంలో గ్రీన్ స్కిల్స్ అకాడెమీ అండ్ కెరీర్ రెడీనెస్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఆ సంస్థ ప్రతినిధుల సమక్షంలో మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కంపెనీ కుప్పంతో పాటుగా రాయలసీమ జిల్లాలకు చెందిన దాదాపుగా 50 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. అంతేకాకుండా 30 వేల దాకా ఉద్యోగాలను అందించేందుకు తోడ్పాటు అందించనుంది. ఇక హీనపక్షం 100 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1ఎం1బీ కంపెనీ ఫోకస్ ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ కేంద్రంగానే సాగనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో సమీప భవిష్యత్తుల్లోనే ఏపీ కేంద్రంగా మారనుంది. ఇప్పటికే ఈ రంగంలో ఏపీలో భారీ పెట్టుబడులు వచ్చాయి. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ఇప్పటికే గ్రీన్ ఎనర్జీలో భారీ ప్రాజెక్టు రాగా…ఇప్పుడు కొత్తగా విశాఖ పరిదిలోనూ అంతకంటే పెద్ద ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో కార్యాలయం తెరచిన 1ఎం1బీ కి చేతి నిండా పని ఉన్నట్లే. ఈ లెక్కన కుప్పానికి రాకపోకలు సాగించే నిపుణుల సంఖ్య ఒక్కసారిగా ఓ రేంజిలో పెరగనుంది. అంటే బాబు చెప్పినట్లుగా కుప్పంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టు కట్టి తీరాల్సిందే. అది కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మించక తప్పదని చెప్పాలి.
This post was last modified on January 29, 2025 8:10 am
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…