ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు వినిపించని రీతిలో చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5 కే పేదలకు ఆహారాన్ని అందిస్తోంది. రోజుకు కేవలం రూ.15తో కడుపు నింపుకునే విధంగా వీటికి చంద్రబాబు సర్కారు రూపకల్పన చేసింది. చంద్రబాబు చూపిన బాటలోనే అధికార యంత్రాంగం కూడా నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అధికారుల తీరుపై ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేశారు.
గుంటూరు మిర్చి యార్డు.. రెండు తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏటా సంక్రాంతి ముగియగానే యార్డుకు మిర్చి రావడం ప్రారంభమవుతుంది. జనవరి నుంచి మే నెలాఖరు దాకా ఈ సీజన్ నడుస్తుంది. దూర ప్రాంతాల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువస్తున్నారు. అయితే మొన్నటిదాకా యార్డులో కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. భోజనంతో పాటు వసతి కూడా ఉచితంగా అందించే దిశగా యార్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాము పండించిన మిర్చిని విక్రయించేందుకు యార్డుకు వచ్చే రైతులు తమ సరుకు యార్డుకు చేరినట్టుగా రసీదు తీసుకుని…దానిని చూపితే ఉచితంగా టిఫిన్, భోజనం టోకెన్లను అందిస్తున్నారు. ఇదంతా ఉచితంగానే అందిస్తున్నారు. ఇక యార్డులోనే సేదదీరేందుకు ఏసీ సౌకర్యంతో కూడిన లాంజ్ ను ఏర్పాటు చేసిన అధికారులు.. రూ.2 తీసుకుని రైతులకు వసతి కల్పిస్తున్నారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డులో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. యార్డు అధికారులను అభినందించారు.
This post was last modified on January 28, 2025 5:31 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…