ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు వినిపించని రీతిలో చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5 కే పేదలకు ఆహారాన్ని అందిస్తోంది. రోజుకు కేవలం రూ.15తో కడుపు నింపుకునే విధంగా వీటికి చంద్రబాబు సర్కారు రూపకల్పన చేసింది. చంద్రబాబు చూపిన బాటలోనే అధికార యంత్రాంగం కూడా నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అధికారుల తీరుపై ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేశారు.
గుంటూరు మిర్చి యార్డు.. రెండు తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏటా సంక్రాంతి ముగియగానే యార్డుకు మిర్చి రావడం ప్రారంభమవుతుంది. జనవరి నుంచి మే నెలాఖరు దాకా ఈ సీజన్ నడుస్తుంది. దూర ప్రాంతాల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువస్తున్నారు. అయితే మొన్నటిదాకా యార్డులో కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. భోజనంతో పాటు వసతి కూడా ఉచితంగా అందించే దిశగా యార్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాము పండించిన మిర్చిని విక్రయించేందుకు యార్డుకు వచ్చే రైతులు తమ సరుకు యార్డుకు చేరినట్టుగా రసీదు తీసుకుని…దానిని చూపితే ఉచితంగా టిఫిన్, భోజనం టోకెన్లను అందిస్తున్నారు. ఇదంతా ఉచితంగానే అందిస్తున్నారు. ఇక యార్డులోనే సేదదీరేందుకు ఏసీ సౌకర్యంతో కూడిన లాంజ్ ను ఏర్పాటు చేసిన అధికారులు.. రూ.2 తీసుకుని రైతులకు వసతి కల్పిస్తున్నారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డులో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. యార్డు అధికారులను అభినందించారు.
This post was last modified on January 28, 2025 5:31 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…