రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిన్నవారు కూడా చేయని సాహసం చేసి.. అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఘనత, సొంతగా పార్టీని స్థాపించుకున్న ఘనత కూడా.. జగన్కు దక్కింది. సుదీర్ఘ పాదయాత్రలు, ఓదార్పు యాత్రల అనంతరం.. 2019లో అప్రతిహత విజయం అందుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. కానీ, ఐదేళ్లు తిరిగి చూసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒంటరి అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోగా.. వీరి జాబితాలో సాయిరెడ్డి మరో సంచలనంగా మారారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వి. విజయసాయిరెడ్డిని కేవలం ఓ పార్టీ నాయకుడిగా చూడలేం. ఆయనకు.. జగన్కు, వైఎస్ కుటుంబానికి కూడా పేగు బంధం ఉంది. రాజారెడ్డి హయాం నుంచి కూడా.. వైఎస్ కుటుంబానికి ఆడిటర్గా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి తర్వాత కాలంలో జగన్కు కుడిభుజంగా మారారనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో వైసీపీ పుంజుకున్నా.. జగన్కు-ఢిల్లీపెద్దలకు మధ్య అప్రకటిత అనుబంధం కొనసాగినా దానికి కారణం.. సాయిరెడ్డి.
వివాదం అయినా.. విజ్ఞాపన అయినా.. అంతా సాయిరెడ్డి కనుసన్నల్లోనే ఢిల్లీ రాజకీయాలు సాగాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రమే కాదు.. దీనికి ముందు తర్వాత కూడా.. నిన్న మొన్నటి వరకు కూడా సాయిరెడ్డి పాత్ర ఢిల్లీలో కీలకం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ‘సాయి రెడ్డి’ అని స్వతంత్రంగా పిలుచుకునే స్థాయిలో సాయిరెడ్డి రాజకీయాలు సాగాయి. జగన్ ఢిల్లీకి వెళ్లినా.. అక్కడ చర్చలు జరిపినా.. ధర్నాలు చేసినా అంతాసాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. అలా ఆయన డిల్లీ వైసీపీ రాజకీయాలను శాసించారనే చెప్పాలి.
అలాంటి సాయిరెడ్డి నిష్క్రమణతో ఇప్పుడు వైసీపీ ఢిల్లీ రాజకీయాలు డీలా పడ్డాయన్న వాదన వినిపిస్తోం ది. భాష తెలిసి ఉండడం మాత్రమే రాజకీయాలకు పరాకాష్ఠ కాదు. లాబీయింగ్ సహా.. ఎంతటి వారినైనా మెప్పించగల నేర్పు, ఒప్పించగల కూర్పు ఉన్న నాయకుడిగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇది అనేక సందర్భాల్లో సాయిరెడ్డికి మాత్రమేకాదు.. వైసీపీకి ఎంతో మేలు చేసింది. ఆయన రాజీనామా దరిమిలా.. ఢిల్లీలో వైసీపీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా.. వైసీపీ పేరు ఉనికి కూడా ప్రమాదంలో పడిందన్న జాతీయ మీడియా వాదనను తోసిపుచ్చలేం. నేతలు చాలా మంది ఉన్నా.. సాయిరెడ్డి వంటి నాయకుడు మాత్రం రాడనే అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 28, 2025 2:35 pm
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…