రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిన్నవారు కూడా చేయని సాహసం చేసి.. అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఘనత, సొంతగా పార్టీని స్థాపించుకున్న ఘనత కూడా.. జగన్కు దక్కింది. సుదీర్ఘ పాదయాత్రలు, ఓదార్పు యాత్రల అనంతరం.. 2019లో అప్రతిహత విజయం అందుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. కానీ, ఐదేళ్లు తిరిగి చూసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒంటరి అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోగా.. వీరి జాబితాలో సాయిరెడ్డి మరో సంచలనంగా మారారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వి. విజయసాయిరెడ్డిని కేవలం ఓ పార్టీ నాయకుడిగా చూడలేం. ఆయనకు.. జగన్కు, వైఎస్ కుటుంబానికి కూడా పేగు బంధం ఉంది. రాజారెడ్డి హయాం నుంచి కూడా.. వైఎస్ కుటుంబానికి ఆడిటర్గా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి తర్వాత కాలంలో జగన్కు కుడిభుజంగా మారారనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో వైసీపీ పుంజుకున్నా.. జగన్కు-ఢిల్లీపెద్దలకు మధ్య అప్రకటిత అనుబంధం కొనసాగినా దానికి కారణం.. సాయిరెడ్డి.
వివాదం అయినా.. విజ్ఞాపన అయినా.. అంతా సాయిరెడ్డి కనుసన్నల్లోనే ఢిల్లీ రాజకీయాలు సాగాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రమే కాదు.. దీనికి ముందు తర్వాత కూడా.. నిన్న మొన్నటి వరకు కూడా సాయిరెడ్డి పాత్ర ఢిల్లీలో కీలకం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ‘సాయి రెడ్డి’ అని స్వతంత్రంగా పిలుచుకునే స్థాయిలో సాయిరెడ్డి రాజకీయాలు సాగాయి. జగన్ ఢిల్లీకి వెళ్లినా.. అక్కడ చర్చలు జరిపినా.. ధర్నాలు చేసినా అంతాసాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. అలా ఆయన డిల్లీ వైసీపీ రాజకీయాలను శాసించారనే చెప్పాలి.
అలాంటి సాయిరెడ్డి నిష్క్రమణతో ఇప్పుడు వైసీపీ ఢిల్లీ రాజకీయాలు డీలా పడ్డాయన్న వాదన వినిపిస్తోం ది. భాష తెలిసి ఉండడం మాత్రమే రాజకీయాలకు పరాకాష్ఠ కాదు. లాబీయింగ్ సహా.. ఎంతటి వారినైనా మెప్పించగల నేర్పు, ఒప్పించగల కూర్పు ఉన్న నాయకుడిగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇది అనేక సందర్భాల్లో సాయిరెడ్డికి మాత్రమేకాదు.. వైసీపీకి ఎంతో మేలు చేసింది. ఆయన రాజీనామా దరిమిలా.. ఢిల్లీలో వైసీపీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా.. వైసీపీ పేరు ఉనికి కూడా ప్రమాదంలో పడిందన్న జాతీయ మీడియా వాదనను తోసిపుచ్చలేం. నేతలు చాలా మంది ఉన్నా.. సాయిరెడ్డి వంటి నాయకుడు మాత్రం రాడనే అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 28, 2025 2:35 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…