Political News

జ‌గ‌న్ ఢిల్లీ రాజ‌కీయాలు డీలా ..!

రాజ‌కీయాల్లో డ‌క్కా ముక్కీలు తిన్న‌వారు కూడా చేయ‌ని సాహ‌సం చేసి.. అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఘ‌న‌త, సొంత‌గా పార్టీని స్థాపించుకున్న ఘ‌న‌త కూడా.. జ‌గ‌న్‌కు ద‌క్కింది. సుదీర్ఘ పాద‌యాత్ర‌లు, ఓదార్పు యాత్ర‌ల అనంత‌రం.. 2019లో అప్ర‌తిహ‌త విజ‌యం అందుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చారు. కానీ, ఐదేళ్లు తిరిగి చూసుకున్న త‌ర్వాత ఇప్పుడు రాజ‌కీయంగా ఆయ‌న ఒంట‌రి అవుతున్నారనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. కీల‌క నేత‌లు ఇప్పటికే పార్టీని వీడిపోగా.. వీరి జాబితాలో సాయిరెడ్డి మ‌రో సంచ‌ల‌నంగా మారారు.

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన వి. విజ‌య‌సాయిరెడ్డిని కేవలం ఓ పార్టీ నాయ‌కుడిగా చూడ‌లేం. ఆయ‌న‌కు.. జ‌గ‌న్‌కు, వైఎస్ కుటుంబానికి కూడా పేగు బంధం ఉంది. రాజారెడ్డి హ‌యాం నుంచి కూడా.. వైఎస్ కుటుంబానికి ఆడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సాయిరెడ్డి త‌ర్వాత కాలంలో జ‌గ‌న్‌కు కుడిభుజంగా మారారనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ రాజ‌కీయాల్లో వైసీపీ పుంజుకున్నా.. జ‌గ‌న్‌కు-ఢిల్లీపెద్ద‌ల‌కు మ‌ధ్య అప్ర‌క‌టిత అనుబంధం కొన‌సాగినా దానికి కార‌ణం.. సాయిరెడ్డి.

వివాదం అయినా.. విజ్ఞాప‌న అయినా.. అంతా సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ఢిల్లీ రాజ‌కీయాలు సాగాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్ర‌మే కాదు.. దీనికి ముందు త‌ర్వాత కూడా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా సాయిరెడ్డి పాత్ర ఢిల్లీలో కీల‌కం. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సైతం ‘సాయి రెడ్డి’ అని స్వ‌తంత్రంగా పిలుచుకునే స్థాయిలో సాయిరెడ్డి రాజ‌కీయాలు సాగాయి. జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లినా.. అక్క‌డ చ‌ర్చ‌లు జ‌రిపినా.. ధ‌ర్నాలు చేసినా అంతాసాయిరెడ్డి క‌నుస‌న్నల్లోనే సాగాయి. అలా ఆయ‌న డిల్లీ వైసీపీ రాజ‌కీయాల‌ను శాసించార‌నే చెప్పాలి.

అలాంటి సాయిరెడ్డి నిష్క్ర‌మ‌ణ‌తో ఇప్పుడు వైసీపీ ఢిల్లీ రాజ‌కీయాలు డీలా ప‌డ్డాయ‌న్న వాద‌న వినిపిస్తోం ది. భాష తెలిసి ఉండ‌డం మాత్ర‌మే రాజకీయాల‌కు ప‌రాకాష్ఠ కాదు. లాబీయింగ్ స‌హా.. ఎంతటి వారినైనా మెప్పించ‌గ‌ల నేర్పు, ఒప్పించ‌గ‌ల కూర్పు ఉన్న నాయ‌కుడిగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇది అనేక సంద‌ర్భాల్లో సాయిరెడ్డికి మాత్ర‌మేకాదు.. వైసీపీకి ఎంతో మేలు చేసింది. ఆయ‌న రాజీనామా ద‌రిమిలా.. ఢిల్లీలో వైసీపీ గ్రాఫ్ ప‌డిపోవ‌డ‌మే కాకుండా.. వైసీపీ పేరు ఉనికి కూడా ప్ర‌మాదంలో ప‌డింద‌న్న జాతీయ మీడియా వాద‌న‌ను తోసిపుచ్చ‌లేం. నేత‌లు చాలా మంది ఉన్నా.. సాయిరెడ్డి వంటి నాయ‌కుడు మాత్రం రాడ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on January 28, 2025 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

8 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

45 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago