తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. పుష్ప-2 తొక్కిసలాట ఘటన తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తర్వాత పరిణామాల క్రమంలో ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే.. దీనిని తగ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రిని కలుసుకుని భేటీ అయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. సీఎంవో నుంచి చిరుకు ఆహ్వానం అందడంతో హుటాహుటిన చిరు కూడా.. సీఎం రేవంత్తో కలిసి సదరు కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ(పర్యావరణ హిత) ఎక్సీపీరియం పార్కును నెలకొల్పిన సందర్భం గా సిఎం రేవంత్ తో పాటు చిరు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
సుమారు 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చిరంజీవిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు.. హైదరాబాద్ శివారు ప్రాంతానికే కాకుండా హైదరాబాద్కు కూడా వన్నె తెస్తుందని సీఎం చెప్పారు. ఈ పార్కులో 25 వేల రకాల మొక్కలను నాటారు. ఇప్పటికే అవి గుబురుగా పెరిగాయి. అదేవిధంగా యాంపీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ సినిమాలను ప్రదర్శించనున్నారు.
This post was last modified on January 28, 2025 5:27 pm
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…