తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. పుష్ప-2 తొక్కిసలాట ఘటన తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తర్వాత పరిణామాల క్రమంలో ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే.. దీనిని తగ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రిని కలుసుకుని భేటీ అయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. సీఎంవో నుంచి చిరుకు ఆహ్వానం అందడంతో హుటాహుటిన చిరు కూడా.. సీఎం రేవంత్తో కలిసి సదరు కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ(పర్యావరణ హిత) ఎక్సీపీరియం పార్కును నెలకొల్పిన సందర్భం గా సిఎం రేవంత్ తో పాటు చిరు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
సుమారు 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చిరంజీవిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు.. హైదరాబాద్ శివారు ప్రాంతానికే కాకుండా హైదరాబాద్కు కూడా వన్నె తెస్తుందని సీఎం చెప్పారు. ఈ పార్కులో 25 వేల రకాల మొక్కలను నాటారు. ఇప్పటికే అవి గుబురుగా పెరిగాయి. అదేవిధంగా యాంపీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ సినిమాలను ప్రదర్శించనున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…