తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. పుష్ప-2 తొక్కిసలాట ఘటన తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తర్వాత పరిణామాల క్రమంలో ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే.. దీనిని తగ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రిని కలుసుకుని భేటీ అయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. సీఎంవో నుంచి చిరుకు ఆహ్వానం అందడంతో హుటాహుటిన చిరు కూడా.. సీఎం రేవంత్తో కలిసి సదరు కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ(పర్యావరణ హిత) ఎక్సీపీరియం పార్కును నెలకొల్పిన సందర్భం గా సిఎం రేవంత్ తో పాటు చిరు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
సుమారు 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చిరంజీవిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు.. హైదరాబాద్ శివారు ప్రాంతానికే కాకుండా హైదరాబాద్కు కూడా వన్నె తెస్తుందని సీఎం చెప్పారు. ఈ పార్కులో 25 వేల రకాల మొక్కలను నాటారు. ఇప్పటికే అవి గుబురుగా పెరిగాయి. అదేవిధంగా యాంపీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ సినిమాలను ప్రదర్శించనున్నారు.
This post was last modified on January 28, 2025 5:27 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…