తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. పుష్ప-2 తొక్కిసలాట ఘటన తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తర్వాత పరిణామాల క్రమంలో ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే.. దీనిని తగ్గించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నిర్మాతలు దర్శకులతో ముఖ్యమంత్రిని కలుసుకుని భేటీ అయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. సీఎంవో నుంచి చిరుకు ఆహ్వానం అందడంతో హుటాహుటిన చిరు కూడా.. సీఎం రేవంత్తో కలిసి సదరు కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ(పర్యావరణ హిత) ఎక్సీపీరియం పార్కును నెలకొల్పిన సందర్భం గా సిఎం రేవంత్ తో పాటు చిరు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
సుమారు 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చిరంజీవిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు.. హైదరాబాద్ శివారు ప్రాంతానికే కాకుండా హైదరాబాద్కు కూడా వన్నె తెస్తుందని సీఎం చెప్పారు. ఈ పార్కులో 25 వేల రకాల మొక్కలను నాటారు. ఇప్పటికే అవి గుబురుగా పెరిగాయి. అదేవిధంగా యాంపీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ సినిమాలను ప్రదర్శించనున్నారు.
This post was last modified on January 28, 2025 5:27 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…