వైసీపీ హయాంలో మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదలు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వరకు చంద్రబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలై ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది. ఆ పిటిషన్ ను దేశపు అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్, ఈ కేసు వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది మణిందర్ సింగ్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఫైర్ అయింది. ఇది తప్పుడు పిటిషన్ అని, ఈ పిటిషన్ గురించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని పిటిషనర్ ను సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
కాగా, జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టింది మొదలు చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు నమోదయ్యాయి. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలోని సీఐడీ పోలీస్స్టేషన్లో 2023లో రెండు, 2022లో ఒకటి, 2021లో మూడు, 2020లో రెండు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఉచిత ఇసుక పాలసీలో అవకతవకల ఆరోపణల కేసు, సీఆర్డీఏ, రాజధాని, ఇన్నర్ రింగు రోడ్డు మాస్టర్ప్లాన్ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఏపీ ఫైబర్నెట్, ఎసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…