Political News

బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్

భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది. ఈ అవార్డుల్లో భాగంగా తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం దక్కింది. వీరిద్దరీ అవార్డులు రావడం పట్ల తెలంగాణలో హర్షం వ్యక్తం అవుతున్నా.. ఎందుకనో గానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి… పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఐదుగురికి అవార్డులు వస్తే..తెలంగాణలో కనీసం నాలుగు అవార్డులు అయినా రావాలి కదా అని ఆయన ఓ వింత వాదన వినిపించారు. అంతేకాకుండా పద్మ అవార్డుల కోసం తమ ప్రభుత్వం గోరటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు వంటి వార్ల పేర్లను ప్రతిపాదించామని… వారిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా కేంద్రం అవార్డు ఇవ్వలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై తాను త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపారు.

ఆదివారం నాటి రేవంత్ వ్యాఖ్యలపై సోమవారం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గద్దర్ ఏ భావజాలంతో సాగారో మీకు తెలుసా? అంటూ కూడా ఆయన కాంగ్రెస్ ను నిలదీశారు. విధ్వంసకర భావజాలంతో సాగిన గద్దర్ చాలా మంది బీజేపీ నేతల హత్యలకు కారకులయ్యారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేంద్ర మంత్రిగా ఉంటూ… ఇలా బహిరంగంగానే బండి సంజయ్ ఈ మేర ఆరోపణలు చేయడంపై పెద్ద రచ్చ జరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on January 27, 2025 1:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago