రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇందుకు ఏ ఒక్క పార్టీల నేతలు మినహాయింపు కాదు. అయితే రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అటు కేంద్రంలో రాష్ట్రపతి, ఇటు రాష్ట్రాల్లో గవర్నర్లు ఏర్పాటు చేసే తేనీటి విందు మాత్రంలో నేతల హడావిడి అస్సలు కనిపించదు.
ఎప్పుడూ టెన్షన్ గా కనిపించే నేతల ముఖాలు… ఎట్ హోం కార్యక్రమంలో మాత్రం వెలిగిపోతూ ఉంటాయి. అలా ఉల్లాసంగా సేద దీరుతూ… ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతూ ఉంటారు.
ఆదివారం భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని రాజ్ భవన్ లో ఎట్ హోం పేరిట తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీరజ్ సింగ్ ఠాకూర్, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఏపీ సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సహా చాలా మంది నేతలు, అధికారులు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో బాగంగా ఒకరిని మరొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఎటువంటి బాదర బందీల్లేకుండా ముచ్చట్లలో పడిపోయారు.
వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన పలువురు సాదారణ పౌరులను కూడా గవర్నర్ ఆహ్వానించారు. అలాంటి వారితోనూ నేతలు కలిసిమెలిసి… వారి అనుభవాలను ఆసక్తిగా విన్నారు. మొత్తంగా అన్ని రంగాలకు చెందిన వారి కలయికతో ఎట్ హోం కార్యక్రమం కలర్ ఫుల్ గా సాగింది.
This post was last modified on January 26, 2025 9:14 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…