అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే… ఏదో కారణం చేత నిర్ణీత గడువలోగా సదరు కార్డులను వినియోగించుకోలేకపోతే… అందులోని మన డబ్బు మాయమైపోయినట్టే. ఈ విషయంపై మనం అడిగితే తప్పించి… ఆయా సంస్థలు మనకు సమాధానం చెప్పవు. ఒకవేళ అడిగినా… అన్ని సంస్థలూ సరైన సమాధానాలు ఇస్తాయన్న గ్యారెంటీ లేదు. వెరసి చాలా మంది వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ తరహా మోసాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం స్పందించారు.
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్టిట్యూషన్స్ (పీపీఐ)లు ఇకపై నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఒకవేళ గిఫ్ట్ కార్డుల్లోని మొత్తాలను వినియోగదారులు సకాలంలో వినియోగంచకున్నా కూడా ఆయా మొత్తాలను పీపీఐలు మాయం చేయడానికి వీల్లేదని పవన్ అన్నారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన గుర్తు చేశారు. వినియోగం కాని మొత్తాలను వినియోగదారుల ఖాతాల్లోకి జమ చేయాల్సిందేనని పవన్ సూచించారు.
అయినా ఈ గిఫ్ట్ కార్డులపై పవన్ ఎందుకు స్పందించాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో చాలా మంది గిఫ్ట్ కార్డుల్లో మాయమైపోతున్న తమ బ్యాలెన్స్ లపై గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు వినియోగదారులు ఈ విషయాన్ని పవన్ దృస్టికి తీసుకువచ్చారట. దీంతో గతంలో తన కార్యాలయం కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డులను వినియోగించిన విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తమ కార్యాలయ గిఫ్ట్ కార్డుల్లోనూ బ్యాలెన్స్ లు మాయమైపోయిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు
దేశంలో కోట్లాది మంది వినియోగదారులు ఈ గిఫ్ట్ కార్డులను వాడుతున్న విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ గిఫ్ట్ కార్డుల సంస్థలు జారీ చేస్తున్న మోసాలపై స్పందించకపోతే దేశ ప్రజలకు నష్టమేనని భావించారు. అంతే…వెనువెంటనే ఈ వ్యవహారంపై ఆయా కంపెనీలు అనుసరిస్తున్న విధి విధానాలను అధికారులతో అడిగి తెలుసుకున్న పవన్.. ఆయా సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డులు, వాటిలోని బ్యాలెన్స్ ల గడువు, గడువు తీరిన తర్వాత ఆయా సంస్థలు సదరు బ్యాలెన్స్ లను ఏం చేస్తున్నాయన్న దానిపై ఆరా తీసిన తర్వాత పవన్ స్పందించారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…