రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానంటూ వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. తన నిష్క్రమణ పర్వంలో మిగిలి ఉన్న కార్యాన్ని కూడా శనివారం ఉదయం పూర్తి చేసేశారు. శనివారం ఉదయం ఎంచక్కా ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి… రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న తన రాజీనామా పత్రాన్ని ఆయన ధన్ కడ్ చేతిలో పెట్టేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సాయిరెడ్డి అందజేసిన రాజీనామా పత్రాన్ని అందుకున్న థన్ కడ్…తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే… శనివారం ఉదయం వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఢిల్లీలోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. సాయిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన బయటకు రాగా… అక్కడే వేచి చూస్తున్న మీడియాతో ఆయన పొడిపొడిగానే మాట్లాడారు. రాజకీయ సన్యాసం విషయంపై పునరాలోచన చేయాలని తాను సాయిరెడ్డిని కోరానని ఆయన తెలిపారు. తన ప్రతిపాదనకు సాయిరెడ్డి సానుకూలంగానే స్పందించినట్లుగా తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే సాయిరెడ్డి నిర్ణయం వెనుక ఉన్న కారణాలు తనకేమీ తెలియవని గురుమూర్తి తెలిపారు.
తన ఇంటికి వచ్చిన గురుమూర్తితో భేటీ అనంతరం ఆయనతో పాటే తన ఇంటి నుంచి సాయిరెడ్డి బయటకు వచ్చారు. గురుమూర్తిని అలా పంపించేసి… సాయిరెడ్డి తన కారులో ఎక్కి నేరుగా ఉపరాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా గురుమూర్తి మీడియాతో మాట్లాడుతుండగానే… సాయిరెడ్డి కారు బయలుదేరింది. దీంతో గురుమూర్తి కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోగా.. సాయిరెడ్డి తన కారును ముందుకు కదిలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోసం యత్నించగా… వారికి సైగలు చేస్తూ ఏమీ మాట్లాడకుండానే సాయిరెడ్డి సాగిపోయారు.
This post was last modified on January 25, 2025 11:43 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…