రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానంటూ వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. తన నిష్క్రమణ పర్వంలో మిగిలి ఉన్న కార్యాన్ని కూడా శనివారం ఉదయం పూర్తి చేసేశారు. శనివారం ఉదయం ఎంచక్కా ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి… రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న తన రాజీనామా పత్రాన్ని ఆయన ధన్ కడ్ చేతిలో పెట్టేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సాయిరెడ్డి అందజేసిన రాజీనామా పత్రాన్ని అందుకున్న థన్ కడ్…తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే… శనివారం ఉదయం వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఢిల్లీలోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. సాయిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన బయటకు రాగా… అక్కడే వేచి చూస్తున్న మీడియాతో ఆయన పొడిపొడిగానే మాట్లాడారు. రాజకీయ సన్యాసం విషయంపై పునరాలోచన చేయాలని తాను సాయిరెడ్డిని కోరానని ఆయన తెలిపారు. తన ప్రతిపాదనకు సాయిరెడ్డి సానుకూలంగానే స్పందించినట్లుగా తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే సాయిరెడ్డి నిర్ణయం వెనుక ఉన్న కారణాలు తనకేమీ తెలియవని గురుమూర్తి తెలిపారు.
తన ఇంటికి వచ్చిన గురుమూర్తితో భేటీ అనంతరం ఆయనతో పాటే తన ఇంటి నుంచి సాయిరెడ్డి బయటకు వచ్చారు. గురుమూర్తిని అలా పంపించేసి… సాయిరెడ్డి తన కారులో ఎక్కి నేరుగా ఉపరాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా గురుమూర్తి మీడియాతో మాట్లాడుతుండగానే… సాయిరెడ్డి కారు బయలుదేరింది. దీంతో గురుమూర్తి కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోగా.. సాయిరెడ్డి తన కారును ముందుకు కదిలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోసం యత్నించగా… వారికి సైగలు చేస్తూ ఏమీ మాట్లాడకుండానే సాయిరెడ్డి సాగిపోయారు.
This post was last modified on January 25, 2025 11:43 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…