Political News

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: విజయసాయిరెడ్డి

వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యత్వానికి శనవారం రాజీనామా చేయనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగతమైనదని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరి ప్రమేయం గానీ, ప్రభావం గానీ లేదని కూడా ఆయన తెలిపారు.

వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే కాదు ఇక భవిష్యత్తులోనూ ఏ రాజకీయ పార్టీలో కూడా చేరబోనని కూడా ఆయన ప్రకటించారు. డబ్బు ఆశించో, ఎవరో ఒత్తిడి చేస్తేనో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన తెలిపారు. తనకు రాజకీయాల్లో మంచి అవకాశాలు కల్పించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని సాయిరెడ్డి తెలిపారు.

వైసీపీలో కీలక పదవులు కట్టబెట్టిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన సాయిరెడ్డి.. జగన్ సతీమణి బారతి రెడ్డికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక జగన్ తనను రెండు సార్లు రాజ్యసభకు పంపారని, జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాభివృద్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపారు. ఈ క్రమంలో కేంద్రానికి, రాష్ట్రానికి వారధిలా వ్యవహరించానన్నారు. పదేళ్ల పాటు తనకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఇక టీడీపీ, జనసేనలతో అనుబంధాన్ని సాయిరెడ్డి ఆసక్తికరంగా ప్రస్తావించారు. టీడీపీపై తనది రాజకీయ పరమైన పోరాటమే తప్పించి… ఆ పార్టీతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని తెలిపారు. చంద్రబాబు కుటుంబంతోనూ తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ తో తనకు చిరకాల స్నేహం ఉందని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయం చేసుకుంటానని ఆయన మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి చేసిన ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

This post was last modified on January 24, 2025 9:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago