తాటిపర్తి చంద్రశేఖర్… వైసీపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. విద్యాధికుడు అయిన ఈయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. సివిల్ ఇంజినీరింగ్ చదివిని ఈయన… సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటారు. తన పార్టీ ఓడిపోయినా… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర పరాజయం పాలైనా తాటిపర్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అధికార పక్షంపై నిత్యం విసుర్లు సంధిస్తూ సాగుతున్న తాటిపర్తి… విమర్శల్లో తనదైన శైలి వ్యంగ్యాన్ని మేళివిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలతో కూడిన పోస్టులపై కూటమి సర్కారు కొరడా ఝుళిపిస్తున్నా కూడా తాటిపర్తి తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే తన సోషల్ మీడియా పోస్టులపై తాటిపర్తి పోలీసుల నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. పోలీసుల నుంచి తాఖీదులు జారీ అయిన తర్వాతే తాటిపర్తి సోషల్ మీడియాలో మరింతగా యాక్టివేట్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక అంశంపై పోస్టులు పెడుతున్న తాటిపర్తి… తాజాగా సీఎం నారా చంద్రబాబునాయుడు దావోస్ టూర్ పైనా సెటైరికల్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
ఈ పోస్టులో చంద్రబాబు ఆరోగ్యంపైనా కామెంట్లు చేసిన తాటిపర్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. టీవీ5 ఛానెల్లో జర్నలిస్టు మూర్తి చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన తాటిపర్తి.. అందులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వ్యంగ్యంగా ప్రశ్నించారు. జైలులో గడిపిన తర్వాత చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయాన్నిఈ సందర్భంగా తాటిపర్తి గుర్తు చేశారు. అయితే గడ్డకట్టే చలిలోనూ దావోస్ లో చంద్రబాబు 24 ఏళ్ల యువకుడిగా కష్టపడుతున్నారని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఏదేమైనా..స్కిల్ కేసులో బెయిల్ వచ్చాక… సీఎం సీటు వచ్చాక చంద్రబాబు ఆరోగ్యం మెరుగవ్వడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందంటూ ఆయన ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…