తాటిపర్తి చంద్రశేఖర్… వైసీపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. విద్యాధికుడు అయిన ఈయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. సివిల్ ఇంజినీరింగ్ చదివిని ఈయన… సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటారు. తన పార్టీ ఓడిపోయినా… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర పరాజయం పాలైనా తాటిపర్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అధికార పక్షంపై నిత్యం విసుర్లు సంధిస్తూ సాగుతున్న తాటిపర్తి… విమర్శల్లో తనదైన శైలి వ్యంగ్యాన్ని మేళివిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలతో కూడిన పోస్టులపై కూటమి సర్కారు కొరడా ఝుళిపిస్తున్నా కూడా తాటిపర్తి తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే తన సోషల్ మీడియా పోస్టులపై తాటిపర్తి పోలీసుల నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. పోలీసుల నుంచి తాఖీదులు జారీ అయిన తర్వాతే తాటిపర్తి సోషల్ మీడియాలో మరింతగా యాక్టివేట్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక అంశంపై పోస్టులు పెడుతున్న తాటిపర్తి… తాజాగా సీఎం నారా చంద్రబాబునాయుడు దావోస్ టూర్ పైనా సెటైరికల్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
ఈ పోస్టులో చంద్రబాబు ఆరోగ్యంపైనా కామెంట్లు చేసిన తాటిపర్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. టీవీ5 ఛానెల్లో జర్నలిస్టు మూర్తి చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన తాటిపర్తి.. అందులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వ్యంగ్యంగా ప్రశ్నించారు. జైలులో గడిపిన తర్వాత చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయాన్నిఈ సందర్భంగా తాటిపర్తి గుర్తు చేశారు. అయితే గడ్డకట్టే చలిలోనూ దావోస్ లో చంద్రబాబు 24 ఏళ్ల యువకుడిగా కష్టపడుతున్నారని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఏదేమైనా..స్కిల్ కేసులో బెయిల్ వచ్చాక… సీఎం సీటు వచ్చాక చంద్రబాబు ఆరోగ్యం మెరుగవ్వడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందంటూ ఆయన ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on January 24, 2025 1:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…