ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు వెళ్లిన ఆయన తిరిగి వచ్చే నాటికి భారీ పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. తొలుత హైదరాబాద్ కు చెందిన మేఘాతో డీల్ కుదుర్చుకోవటంపై కొద్దిపాటి విమర్శలు వచ్చాయి. ఈ డీల్ కోసం అంత దూరాన ఉన్న దావోస్ లోనే చేసుకోవాలా? హైదరాబాద్ లో చేసుకోకూడదా? అని. ఇదే మాటను కాస్త అటు ఇటుగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ తో చెప్పేశారు.
అయితే.. కేసీఆర్ పదేళ్ల పాలన సందర్భంగా మంత్రి హోదాలో పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన కేటీఆర్ సైతం ఇలాంటి పనులే చేసినా.. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి.. సీఎం రేవంత్ ను ఎటకారం ఆడేశారు. ఇదిలా ఉండగా.. చూస్తుండగానే.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున భారీ డీల్స్ కు ఓకే చేసుకుంటూ పోతున్న సీఎం రేవంత్ దూకుడు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బుధవారం ఒక్కరోజులో రికార్డుస్థాయిలో పెట్టుబడుల్ని తెలంగాణకు ఆకర్షించి హైలెట్ అయిన ఆయన.. గంటల వ్యవధిలోనే మరో భారీ పెట్టుబడి డీల్ ను ఓకే చేసుకున్నారు.
తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టబడి పెట్టేందుకు వీలుగా అమెజాన్ తోఒప్పందం చేసుకున్నారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
మరోవైపు ఇన్ఫోసిస్ సీఎఫ్ వో సంగ్రాజ్ తో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ కావటం.. పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా రూ.750 కోట్లతో తొలిదశ విస్తరణ చేపడతామని సదరు సంస్థ తెలిపింది. ఈ విస్తరణ నేపథ్యంలో కొత్తగా 17వేల ఉద్యోగాలు వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున భారీ ఒప్పందాలతో దావోస్ లో అదరగొట్టేస్తున్నారు సీఎం రేవంత్.
This post was last modified on January 23, 2025 10:53 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…