నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెట్టే దిశగా లోకేశ్ వేసిన అడుగులను గుర్తు చేసుకుంటూ ఆయన అబిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. తెల్లవారక ముందే.. సోషల్ మీడియా వేదికగా లోకేశ్ కు లెక్కలేనన్ని ఖాతాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలోఒఓక దానిని పరిశీలిస్తే… “అభిమన్యుడు అనుకున్నారు..అర్జునుడివి అని తెలుసుకోలేకపోయారు” అంటూ ఓ అభిమాని లోకేశ్ ను ఆకాశానికెత్తేశాడు.
లోకేశ్ సత్తాను వివరిస్తూ సదరు అభిమాని చేసిన కామెంట్ అక్షరాలా నిజమేనని చెప్పుకొవాలి. ఎందుకంటే… 2019 ఎన్నికల్లో లోకేశ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఓ సీఎం కుమారుడిగా, టీడీపీకి భావి అదినేతగా ప్రొజెక్ట్ అయిన లోకేశ్ ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అంతేనా… టీడీపీ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా 23 సీట్లకు పరిమితమైపోయింది. ఇక ఎంపీ సీట్లలోనూ బారీ తగ్గుదల కనిపించింది. ఫలితంగా 2022 నాటికి రాజ్యసభలో సభ్యత్వం లేని పార్టీగా మారిపోయింది. టీడీపీ మళ్లీ బతికి బట్ట కడుతుందా? అన్న రీతిలో వైరి వర్గాలు హేళన చేశాయి.
అలాంటి సమయంలో యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. అదే సమయంలో తనను ఓడించిన మంగళగిరిపై మరింత దృష్టి పెట్టారు. ఓ వైపు మంగళగిరిలో ఇంటింటికీ తనను తాను పరిచయం చేసుకుంటూనే… యువగళంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఎక్కడ టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు ఎదురైనా… క్షణాల్లో అక్కడకు వెళ్లి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు. పలితంగా పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోకేశ్ ఉండగా…తమకు ఇబ్బందులు రావన్న నమ్మకా్ని ప్రోది చేయగలిగారు.
ఇక తన తండ్రి నారా చంద్రబాబునాయుడిని వైసీపీ సర్కారు అరెస్ట్ చేయించిన సమయంలో లోకేశ్ ధైర్యంగా నిలబడిన తీరు నిజంగానే ఆయనలోని అసలు సిసలు నాయకుడిని జనాలకు పరిచయం చేసింది. జైలులోని తండ్రి పరామర్శిస్తూనే పార్టీని ఎన్నికలకు రెడీ చేశారు. అంతేకాకుండా జనసేన, బీజేపీలతో పొత్తు కుదిరేలా చేశారు. 2024 ఎన్నికలకు గెలుపు గుర్రాలను రెడీ చేసుకున్నారు. ఎన్నికలకు నగారా మోగిన వెంటనే రంగంలోకి దిగిపోయిన లోకేశ్.. అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా యుద్ధాన్ని గెలిచి.. ప్రత్యర్థులను చిత్తు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…