Political News

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా సత్తా చాటిన యంగ్ పొలిటీషియన్ గానూ మనందరికీ చిర పరచితులే. సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబుకు రాజకీయ విరోధిగా సాగిన గల్లా అరుణ కుమారి కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయదేవ్.,.. తన ఫ్యామిలీని టీడీపీకి చేరువ చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నప్పటికీ అటు ఆర్థికంగానే కాకుండా ఇటు రాజకీయంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న వార్తలు ఏపీ వాసులను కలచివేశాయి. ఈ కారణంగానే గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించాల్సి వచ్చిందని, శారీరకంగానూ ఆయన హింసను ఎదుర్కొన్నారన్న వాదనలూ లేకపోలేదు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు గానీ.. గల్లా అయితే అడ్రెస్ లేకుండా పోయారు.

ఎంపీగా ఉన్న తొలినాళ్లలో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచిన గల్లా…తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల పుణ్యమా అని దావోస్ లో కనిపించారు. ఈ సదస్సుల ప్రారంభం రోజే దావోస్ వచ్చిన గల్లా… సీఎం చంద్రబాబును కూడా కలిశారు. అయితే సదస్సుల్లో మూడో రోజు అయిన బుధవారం గల్లా చురుగ్గా కదిలారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి కనిపించిన గల్లా… పలు కీలక భేటీల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తోనూ ఆయన చర్చిస్తూ కనిపించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన వారంతా గల్లా తిరిగి యాక్టివేట్ అయినట్టేనా?అని ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.

This post was last modified on January 22, 2025 8:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago