దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ సమావేశాలకు హాజరు అవుతూ పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సీఎంలు దావోస్లో సమావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్దరితో పాటు మరో సీఎం సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దావోస్ లో జరిగే సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగానే దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం వెళ్లారు. వేర్వేరుగా తమ రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తదుపరి దావోస్లోనే జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పంచుకున్నారు.
ఈ సమావేశం అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ, తెలంగాణ, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రబలశక్తిగా ఎదిగిన ఈ ముగ్గురు నేతలు అంతర్జాతీయ వేదికగా తమ రాష్ట్రాలకు అద్భుతమైన పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. దావోస్ టూర్లో ఈ మూడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావచ్చునని జోస్యం చెప్తున్నారు.
దాదాపుగా గత ఏడాది కాలంలోనే ఈ ముగ్గురు నేతలు తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రజా మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత కీలకమైన ఎన్నికలు ఎదుర్కొని సీఎం పీఠం అధిరోహించారు. అనంతరం తమదైన శైలిలో పాలన కొనసాగిస్తూ తాజాగా దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరు దిగిన ఫోటో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
This post was last modified on January 22, 2025 8:45 pm
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…