దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ సమావేశాలకు హాజరు అవుతూ పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సీఎంలు దావోస్లో సమావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్దరితో పాటు మరో సీఎం సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దావోస్ లో జరిగే సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగానే దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం వెళ్లారు. వేర్వేరుగా తమ రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తదుపరి దావోస్లోనే జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పంచుకున్నారు.
ఈ సమావేశం అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ, తెలంగాణ, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రబలశక్తిగా ఎదిగిన ఈ ముగ్గురు నేతలు అంతర్జాతీయ వేదికగా తమ రాష్ట్రాలకు అద్భుతమైన పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. దావోస్ టూర్లో ఈ మూడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావచ్చునని జోస్యం చెప్తున్నారు.
దాదాపుగా గత ఏడాది కాలంలోనే ఈ ముగ్గురు నేతలు తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రజా మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత కీలకమైన ఎన్నికలు ఎదుర్కొని సీఎం పీఠం అధిరోహించారు. అనంతరం తమదైన శైలిలో పాలన కొనసాగిస్తూ తాజాగా దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరు దిగిన ఫోటో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
This post was last modified on January 22, 2025 8:45 pm
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…