Political News

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ ఈ స‌మావేశాల‌కు హాజ‌రు అవుతూ పెట్టుబ‌డుల వేట‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు సీఎంలు దావోస్‌లో స‌మావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్ద‌రితో పాటు మ‌రో సీఎం స‌మావేశమైన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దావోస్ లో జ‌రిగే స‌మావేశాల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లాగానే దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైని క‌లిగి ఉన్న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సైతం వెళ్లారు. వేర్వేరుగా త‌మ రాష్ట్రాల‌కు సంబంధించిన స‌మావేశాల్లో పాల్గొన్నారు. ఆ త‌దుప‌రి దావోస్‌లోనే జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా వివిధ అంశాల‌పై త‌మ అభిప్రాయాల‌ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పంచుకున్నారు.

ఈ స‌మావేశం అనంత‌రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన ఆంద్ర‌ప్ర‌దేశ‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌బ‌ల‌శ‌క్తిగా ఎదిగిన ఈ ముగ్గురు నేత‌లు అంత‌ర్జాతీయ వేదిక‌గా త‌మ రాష్ట్రాల‌కు అద్భుత‌మైన పెట్టుబ‌డులు సాధించేందుకు కృషి చేస్తున్నారంటూ ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. దావోస్ టూర్లో ఈ మూడు రాష్ట్రాల‌కు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు రావ‌చ్చున‌ని జోస్యం చెప్తున్నారు.

దాదాపుగా గ‌త ఏడాది కాలంలోనే ఈ ముగ్గురు నేత‌లు త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి ప్రజా మ‌ద్ద‌తుతో అధికారాన్ని కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లు ఎదుర్కొని సీఎం పీఠం అధిరోహించారు. అనంత‌రం త‌మ‌దైన శైలిలో పాల‌న కొన‌సాగిస్తూ తాజాగా దావోస్ వేదిక‌గా పెట్టుబ‌డుల స‌మీక‌ర‌ణ‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరు దిగిన ఫోటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

This post was last modified on January 22, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

42 minutes ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

3 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

10 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

11 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

11 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

13 hours ago