Political News

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ ఈ స‌మావేశాల‌కు హాజ‌రు అవుతూ పెట్టుబ‌డుల వేట‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు సీఎంలు దావోస్‌లో స‌మావేశం కూడా అయ్యారు. అయితే, తాజాగా ఈ ఇద్ద‌రితో పాటు మ‌రో సీఎం స‌మావేశమైన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దావోస్ లో జ‌రిగే స‌మావేశాల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లాగానే దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైని క‌లిగి ఉన్న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సైతం వెళ్లారు. వేర్వేరుగా త‌మ రాష్ట్రాల‌కు సంబంధించిన స‌మావేశాల్లో పాల్గొన్నారు. ఆ త‌దుప‌రి దావోస్‌లోనే జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా వివిధ అంశాల‌పై త‌మ అభిప్రాయాల‌ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పంచుకున్నారు.

ఈ స‌మావేశం అనంత‌రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన ఆంద్ర‌ప్ర‌దేశ‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌బ‌ల‌శ‌క్తిగా ఎదిగిన ఈ ముగ్గురు నేత‌లు అంత‌ర్జాతీయ వేదిక‌గా త‌మ రాష్ట్రాల‌కు అద్భుత‌మైన పెట్టుబ‌డులు సాధించేందుకు కృషి చేస్తున్నారంటూ ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. దావోస్ టూర్లో ఈ మూడు రాష్ట్రాల‌కు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు రావ‌చ్చున‌ని జోస్యం చెప్తున్నారు.

దాదాపుగా గ‌త ఏడాది కాలంలోనే ఈ ముగ్గురు నేత‌లు త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి ప్రజా మ‌ద్ద‌తుతో అధికారాన్ని కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లు ఎదుర్కొని సీఎం పీఠం అధిరోహించారు. అనంత‌రం త‌మ‌దైన శైలిలో పాల‌న కొన‌సాగిస్తూ తాజాగా దావోస్ వేదిక‌గా పెట్టుబ‌డుల స‌మీక‌ర‌ణ‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరు దిగిన ఫోటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

This post was last modified on January 22, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

2 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

2 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

3 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

3 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

3 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

5 hours ago