ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి ప్రాణం రాగా… ఆ తర్వాత అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల లభ్యతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించిన దాని కంటే మంచి మద్దతు లభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వగా… కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయి.
మొత్తంగా రోజుల వ్యవధిలోనే అమరావతికి రూ.26 వేల కోట్ల మేర నిధుల లభ్యత అందిరావడం శుభ పరిణామమేనని చెప్పక తప్పదు. నిధుల లభ్యతపై ప్రకటనలు రాగానే.. ఏపీ సర్కారు అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించింది. ఇప్పటికే ఆయా పరిసరాలను శుభ్రం చేయించిన ప్రభుత్వం… అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేసింది. అంతేకాకుండా అమరావతి నిర్మాణ పనులకు తాజాగా టెండర్లను కూడా పిలిచారు.
ఇలాంటి కీలక తరుణంలో హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఇటీవలే జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధుల విడుదలకు ఆమోద ముద్ర పడిందని, త్వరలోనే నిధులను విడుదల చేయనున్నట్లు హడ్కో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించిన మంత్రి నారాయణ… ఇకపై అమరావతి నిర్మాణం జెట్ స్పీడుతో పరుగులు పెడుతుందని తెలిపారు. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి కూడా రుణం విడుదలకు మార్గం సుగమం అయ్యిందని, దానికి తోడు హడ్కో నిధులూ అందుబాటులోకి రావడంతో ఇక అమరావతి నిర్మాణంపై వెను దిరిగి చూడాల్సిన అవసరమే రాదని చెప్పాలి.
This post was last modified on January 22, 2025 8:42 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…