Political News

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని కమిషన్ ముందు వెల్లడించారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ అంశంపై విచారణ చేపట్టగా, వి.ప్రకాశ్ 101వ సాక్షిగా హాజరై తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయించారు.

తన వద్ద ఉన్న కీలక సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా గతంలోనే స్టేట్‌మెంట్, నోట్ సమర్పించినట్లు వెల్లడించిన ప్రకాశ్, ప్రాజెక్టు ప్రణాళికలు, నిర్మాణ దశల్లో తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ పలు ప్రశ్నలు వేసినట్లు తెలిపారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, మహారాష్ట్ర అభ్యంతరాల కారణంగా సైట్ మార్పులపై కమిషన్ దృష్టి సారించిందని చెప్పారు.

విచారణలో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి సంబంధించిన ఇంజినీర్ల సిఫార్సులు, బొగ్గు గనుల దగ్గర సొరంగాల అంశాలు కీలకంగా చర్చకు వచ్చినట్లు వివరించారు. ఈ అంశాలపై నాటి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించాల్సి వచ్చిందని ప్రకాశ్ వెల్లడించారు. నీటి లభ్యత, పునాదుల సురక్షితత ఆధారంగా కాళేశ్వరాన్ని నిర్మించినట్లు ఆయన కమిషన్‌కు తెలిపారు.

ప్రాజెక్టు నిర్మాణంలో డాక్యుమెంట్ల ఆధారంగా మాత్రమే తాము ముందుకు సాగినట్లు స్పష్టం చేసిన ప్రకాశ్, కాళేశ్వరం ప్రాజెక్టు పునాది నుంచి వివిధ దశల వరకు తీసుకున్న నిర్ణయాలపై పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు. ఈ విచారణతో కాళేశ్వరం వివాదం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. గత ప్రభుత్వ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక నెరరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో మరికొంత మంది ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on January 22, 2025 6:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago