ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా అత్యుత్సాహానికి పోతున్న తమ్ముళ్ల తీరుకు తగ్గట్లే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస అయ్యారు. ఫ్యూచర్ సీఎం లోకేశ్ అంటూ జ్యూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి టీజీ భరత్ పై ఆయన సీరియస్ అయ్యారు. సమావేశం అనంతరం భరత్ ను చంద్రబాబు మందలించారు.
మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని.. ఎప్పుడు.. ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికిన చంద్రబాబు.. ‘‘ఇక్కడకు మనం ఎందుకు వచ్చాం? మీరేం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించటానికి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి కాదుగా?’’ అంటూ సీరియస్ అయ్యారు.
ఈ సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ.. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా.. కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యనే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను తెలుగు తమ్ముళ్లు తీసుకురావటం.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన రోజు తర్వాత.. మంత్రి టీజీ భరత్ నోటి నుంచి లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్య రావటం సంచలనంగా మారింది. దీనికి చెక్ చెప్పేలా.. టీజీ భరత్ పై సీరియస్ అయిన చంద్రబాబు.. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దంటూ గట్టిగా చెప్పారు. మరి.. చంద్రబాబు క్లాస్ మిగిలిన తమ్ముళ్లు అర్థం చేసుకుంటారా? లేదంటే.. టీజీ భరత్ మాదిరి తమ స్వామిభక్తిని ప్రదర్శించుకొని తిట్లు తింటారా?అన్నది చూడాలి.
This post was last modified on January 21, 2025 9:44 am
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…