ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా అత్యుత్సాహానికి పోతున్న తమ్ముళ్ల తీరుకు తగ్గట్లే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస అయ్యారు. ఫ్యూచర్ సీఎం లోకేశ్ అంటూ జ్యూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి టీజీ భరత్ పై ఆయన సీరియస్ అయ్యారు. సమావేశం అనంతరం భరత్ ను చంద్రబాబు మందలించారు.
మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని.. ఎప్పుడు.. ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికిన చంద్రబాబు.. ‘‘ఇక్కడకు మనం ఎందుకు వచ్చాం? మీరేం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించటానికి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి కాదుగా?’’ అంటూ సీరియస్ అయ్యారు.
ఈ సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ.. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా.. కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యనే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను తెలుగు తమ్ముళ్లు తీసుకురావటం.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన రోజు తర్వాత.. మంత్రి టీజీ భరత్ నోటి నుంచి లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్య రావటం సంచలనంగా మారింది. దీనికి చెక్ చెప్పేలా.. టీజీ భరత్ పై సీరియస్ అయిన చంద్రబాబు.. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దంటూ గట్టిగా చెప్పారు. మరి.. చంద్రబాబు క్లాస్ మిగిలిన తమ్ముళ్లు అర్థం చేసుకుంటారా? లేదంటే.. టీజీ భరత్ మాదిరి తమ స్వామిభక్తిని ప్రదర్శించుకొని తిట్లు తింటారా?అన్నది చూడాలి.
This post was last modified on January 21, 2025 9:44 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…