Political News

ప్రత్యేక విమానాలు లేవు.. కాస్ట్ లీ కార్లూ లేవు

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలంటేనే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే. పెట్టుబడులు ఆకర్షించాలంటే… సదరు స్టాళ్లు, పెవిలియన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాలు కూడా అదే పని చేశాయి. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. అయినా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇరు రాష్ట్రాలు వీలయినంత మేర కృషి చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన దావోస్ సదస్సుకు రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి తమ తమ ప్రతినిధి బృందాలతో దావోస్ లో వాలిపోయారు.

గతంలో అయితే దావోస్ వెళ్లాలంటే,… సీఎం హోదాలో ఉన్న వారు స్పెషల్ ఫ్లైట్లు వాడేవారు. హదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో నేరుగా దావోస్ చేరుకునేందుకు వారు ప్రత్యేక విమానాలు వినియోగించేవారు. ఇందుకోసం భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేవారు. అయితే ఈ దఫా మాత్రం స్పెషల్ ఫ్లైట్ల జాడే కనిపించలేదు. విజయవాడ నుంచి సాధారణ విమానంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు… అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ లో జూరిచ్ చేరారు. ఇక దావోస్ సదస్సు కంటే ముందే… సింగపూర్ టూర్ వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫ్లైట్ ఏమీ వినియోగించలేదు. వెరసి ప్రజా ధనాన్ని బాగానే పొదుపు చేసినట్టు లెక్క.

ఇక సోమవారం జూరిచ్ నుంచి దావోస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రైలు మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన కేబినెట్ లోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎంచక్కా రైలు ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రకృతి అందాలు తిలకిస్తూ… అలా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దావోస్ చేరుకున్నారు. జూరిచ్ నుంచి దావోస్ వరకు ఖరీదైన కార్ల ప్రయాణాన్ని రద్దు చేసుకుని ట్రైన్ జర్నీని ఎంచుకున్న రేవంత్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అటు ఏపీ సీఎం, ఇటు తెలంగాణ సీఎం… ఇద్దరూ దావోస్ టూర్ లో పొదుపు మంత్రాన్ని పఠిస్తున్న తీరు నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

సూటిగా చెప్పిన సమాధానాల్లో సునీత గారి పాఠాలు

గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…

27 minutes ago

కేంద్ర మంత్రివ‌ర్గంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు?

కేంద్ర మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు మంత్రి యోగం ప‌ట్ట‌నుంద‌ని టీడీపీ…

1 hour ago

వారణాసి సెట్… 7 గంటలకు షూటింగ్ అంటే

కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు మామూలు మాస్ మ‌సాలా సినిమాలే తీశాడు రాజ‌మౌళి. మ‌గ‌ధీర నుంచి ఆయ‌నలోని మ‌రో కోణం…

4 hours ago

సైలెంటుగా పరుగులు పెడుతున్న బంగారం

సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…

6 hours ago

దీదీ వర్సెస్ రీతబ్రత… అసలైన తృణమూల్ ఎవరిది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…

8 hours ago

ఆచార్య దర్శకుడితో రామ్ చరణ్…

కొన్ని డిజాస్ట‌ర్లు ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో ప‌నిచేసిన వాళ్లంద‌రినీ జీవిత కాల చేదు జ్ఞాప‌కాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…

10 hours ago