వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలంటేనే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే. పెట్టుబడులు ఆకర్షించాలంటే… సదరు స్టాళ్లు, పెవిలియన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాలు కూడా అదే పని చేశాయి. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. అయినా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇరు రాష్ట్రాలు వీలయినంత మేర కృషి చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన దావోస్ సదస్సుకు రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి తమ తమ ప్రతినిధి బృందాలతో దావోస్ లో వాలిపోయారు.
గతంలో అయితే దావోస్ వెళ్లాలంటే,… సీఎం హోదాలో ఉన్న వారు స్పెషల్ ఫ్లైట్లు వాడేవారు. హదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో నేరుగా దావోస్ చేరుకునేందుకు వారు ప్రత్యేక విమానాలు వినియోగించేవారు. ఇందుకోసం భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేవారు. అయితే ఈ దఫా మాత్రం స్పెషల్ ఫ్లైట్ల జాడే కనిపించలేదు. విజయవాడ నుంచి సాధారణ విమానంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు… అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ లో జూరిచ్ చేరారు. ఇక దావోస్ సదస్సు కంటే ముందే… సింగపూర్ టూర్ వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫ్లైట్ ఏమీ వినియోగించలేదు. వెరసి ప్రజా ధనాన్ని బాగానే పొదుపు చేసినట్టు లెక్క.
ఇక సోమవారం జూరిచ్ నుంచి దావోస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రైలు మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన కేబినెట్ లోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎంచక్కా రైలు ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రకృతి అందాలు తిలకిస్తూ… అలా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దావోస్ చేరుకున్నారు. జూరిచ్ నుంచి దావోస్ వరకు ఖరీదైన కార్ల ప్రయాణాన్ని రద్దు చేసుకుని ట్రైన్ జర్నీని ఎంచుకున్న రేవంత్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అటు ఏపీ సీఎం, ఇటు తెలంగాణ సీఎం… ఇద్దరూ దావోస్ టూర్ లో పొదుపు మంత్రాన్ని పఠిస్తున్న తీరు నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పక తప్పదు.
This post was last modified on January 20, 2025 8:43 pm
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…