టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. అత్యధిక శాతం తెలుపు రంగు చొక్కా…నలుపు, నీలం రంగు కలగలసినట్టుండే ప్యాంటుతో కనిపించేవారు. ఎక్కడికెళ్లినా లోకేశ్ ఇదే లుక్కులో కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర నుంచి అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఆయన తన పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో 10 రోజుల పాటు విదేశాల్లో ఉన్నా… ఈ డ్రెస్ తప్పించి ఆయన వేరే డ్రెస లో కనిపించింది లేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునేందుకు సీఎం నారా చద్రబాబునాయుడితో కలిసి లోకేశ్ సోమవారం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ నయీ లుక్కులో తళుక్కున్నారు. గ్రే కలర్ లో కనిపిస్తున్న ప్యాంట్ ను ధరిచిన లోకేశ్… దానిపై ఎరుపు రంగు చొక్కాను వేసుకున్నారు. ఈ చొక్కా కూడా ఏదో సాధారణ చొక్కాలా కాకుండా..చలికి తట్టుకునేందుకు వేసుకునే స్వెట్ షర్ట్ లా అది కనిపిస్తోంది. ఈ తరహా దుస్తుల్లో లోకేశ్ ఎప్పుడూ కనిపిచలేదనే చెప్పాలి. ఇక ఈ డ్రెస్ మీదకు లోకేశ్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించారు.
దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులను కలిసిన తర్వాత అక్కడి తెలుగు ప్రజలతో చంద్రబాబు బృదం మీట్ అండ్ గ్రీట్ పేరిట ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా లోకేశ్ ఈ కొత్త లుక్కులో అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. అయితే కొత్త తరహా దుస్తులను వేసుకున్న ఆయన వాటితో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించారు. అయితేనేం… దావోస్ టూర్ పుణ్యమా అని లోకేశ్ నయా లుక్కులో టీడీపీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేశారు.
This post was last modified on January 20, 2025 8:50 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…