టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. అత్యధిక శాతం తెలుపు రంగు చొక్కా…నలుపు, నీలం రంగు కలగలసినట్టుండే ప్యాంటుతో కనిపించేవారు. ఎక్కడికెళ్లినా లోకేశ్ ఇదే లుక్కులో కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర నుంచి అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఆయన తన పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో 10 రోజుల పాటు విదేశాల్లో ఉన్నా… ఈ డ్రెస్ తప్పించి ఆయన వేరే డ్రెస లో కనిపించింది లేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునేందుకు సీఎం నారా చద్రబాబునాయుడితో కలిసి లోకేశ్ సోమవారం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ నయీ లుక్కులో తళుక్కున్నారు. గ్రే కలర్ లో కనిపిస్తున్న ప్యాంట్ ను ధరిచిన లోకేశ్… దానిపై ఎరుపు రంగు చొక్కాను వేసుకున్నారు. ఈ చొక్కా కూడా ఏదో సాధారణ చొక్కాలా కాకుండా..చలికి తట్టుకునేందుకు వేసుకునే స్వెట్ షర్ట్ లా అది కనిపిస్తోంది. ఈ తరహా దుస్తుల్లో లోకేశ్ ఎప్పుడూ కనిపిచలేదనే చెప్పాలి. ఇక ఈ డ్రెస్ మీదకు లోకేశ్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించారు.
దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులను కలిసిన తర్వాత అక్కడి తెలుగు ప్రజలతో చంద్రబాబు బృదం మీట్ అండ్ గ్రీట్ పేరిట ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా లోకేశ్ ఈ కొత్త లుక్కులో అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. అయితే కొత్త తరహా దుస్తులను వేసుకున్న ఆయన వాటితో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించారు. అయితేనేం… దావోస్ టూర్ పుణ్యమా అని లోకేశ్ నయా లుక్కులో టీడీపీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేశారు.
This post was last modified on January 20, 2025 8:50 pm
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…