టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. అత్యధిక శాతం తెలుపు రంగు చొక్కా…నలుపు, నీలం రంగు కలగలసినట్టుండే ప్యాంటుతో కనిపించేవారు. ఎక్కడికెళ్లినా లోకేశ్ ఇదే లుక్కులో కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర నుంచి అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఆయన తన పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో 10 రోజుల పాటు విదేశాల్లో ఉన్నా… ఈ డ్రెస్ తప్పించి ఆయన వేరే డ్రెస లో కనిపించింది లేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునేందుకు సీఎం నారా చద్రబాబునాయుడితో కలిసి లోకేశ్ సోమవారం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ నయీ లుక్కులో తళుక్కున్నారు. గ్రే కలర్ లో కనిపిస్తున్న ప్యాంట్ ను ధరిచిన లోకేశ్… దానిపై ఎరుపు రంగు చొక్కాను వేసుకున్నారు. ఈ చొక్కా కూడా ఏదో సాధారణ చొక్కాలా కాకుండా..చలికి తట్టుకునేందుకు వేసుకునే స్వెట్ షర్ట్ లా అది కనిపిస్తోంది. ఈ తరహా దుస్తుల్లో లోకేశ్ ఎప్పుడూ కనిపిచలేదనే చెప్పాలి. ఇక ఈ డ్రెస్ మీదకు లోకేశ్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించారు.
దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులను కలిసిన తర్వాత అక్కడి తెలుగు ప్రజలతో చంద్రబాబు బృదం మీట్ అండ్ గ్రీట్ పేరిట ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా లోకేశ్ ఈ కొత్త లుక్కులో అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. అయితే కొత్త తరహా దుస్తులను వేసుకున్న ఆయన వాటితో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించారు. అయితేనేం… దావోస్ టూర్ పుణ్యమా అని లోకేశ్ నయా లుక్కులో టీడీపీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేశారు.
This post was last modified on January 20, 2025 8:50 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…