టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. అత్యధిక శాతం తెలుపు రంగు చొక్కా…నలుపు, నీలం రంగు కలగలసినట్టుండే ప్యాంటుతో కనిపించేవారు. ఎక్కడికెళ్లినా లోకేశ్ ఇదే లుక్కులో కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర నుంచి అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఆయన తన పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో 10 రోజుల పాటు విదేశాల్లో ఉన్నా… ఈ డ్రెస్ తప్పించి ఆయన వేరే డ్రెస లో కనిపించింది లేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునేందుకు సీఎం నారా చద్రబాబునాయుడితో కలిసి లోకేశ్ సోమవారం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ నయీ లుక్కులో తళుక్కున్నారు. గ్రే కలర్ లో కనిపిస్తున్న ప్యాంట్ ను ధరిచిన లోకేశ్… దానిపై ఎరుపు రంగు చొక్కాను వేసుకున్నారు. ఈ చొక్కా కూడా ఏదో సాధారణ చొక్కాలా కాకుండా..చలికి తట్టుకునేందుకు వేసుకునే స్వెట్ షర్ట్ లా అది కనిపిస్తోంది. ఈ తరహా దుస్తుల్లో లోకేశ్ ఎప్పుడూ కనిపిచలేదనే చెప్పాలి. ఇక ఈ డ్రెస్ మీదకు లోకేశ్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించారు.
దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులను కలిసిన తర్వాత అక్కడి తెలుగు ప్రజలతో చంద్రబాబు బృదం మీట్ అండ్ గ్రీట్ పేరిట ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా లోకేశ్ ఈ కొత్త లుక్కులో అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. అయితే కొత్త తరహా దుస్తులను వేసుకున్న ఆయన వాటితో కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించారు. అయితేనేం… దావోస్ టూర్ పుణ్యమా అని లోకేశ్ నయా లుక్కులో టీడీపీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేశారు.
This post was last modified on January 20, 2025 8:50 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…