Political News

బాబు సీరియస్… ‘డిప్యూటీ’ డిమాండ్లకు చెక్

గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలని, ఆయనకు తక్షణమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వయంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. వీటిని టీడీపీ మిత్రపక్షం జనసేన నుంచి పెద్దగా వ్యతిరేకత రాకున్నా… సోమవారం ఒక్కసారిగా జనసేనకు చెందిన కొందరు వినూత్నంగా స్పందించారు. దీంతో మేల్కొన్న టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా స్పందించింది. అంతే…ఒక్కసారిగా డిప్యూటీ డిమాండ్లన్నీ చప్పున సైలెంట్ అయిపోయాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించగా… ఆ సభా వేదిక మీద నుంచే లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఈ డిమాండ్ ను వినిపించారు. ఏదో అభిమానంతో అలా అని ఉంటారులే అంటూ చంద్రబాబు దానిని పెద్దగా పట్టించుకోలేదు. చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. అయితే ఆ మరునాడు.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోట నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే డిమాండ్ ను వినిపించారు.

ఓ వైపు నేతల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ రెండు, మూడు రోజుల నుంచే వినిపిస్తున్నా… చాలా కాలంగా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. అయినా పార్టీ అధిష్ఠానం అంతగా పట్టించుకోలేదు. అయితే నేతలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ డిమాండ్లు వినిపిస్తున్న వేళ… జనసేన నుంచి ఒకింత వింత వాదనలు వినిపించాయి. తాము కూడా పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా అనుకుంటున్నామని జనసేన కేడర్ ఓ ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. వెరసి టీడీపీ, జనసేనల మధ్య ఓ వార్ కు రంగం సిద్ధమైపోయిందన్న సూచనలు కనిపించాయి.

ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్ఠానం సోమవారం ఉదయం తీవ్రంగా స్పందించింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ డిమాండ్ చేయడం తక్షణమే మానుకోవాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని నేతలకు సూచించింది. అంతేకాకుండా ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం అంతా చూసుకుంటుందని తెలిపింది. రెండు పార్టీలతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్ఠారాజ్యంగా ఎలా డిమాండ్లు చేస్తారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది. పొత్తు ధర్మంలో బాగంగా…మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయాన్ని అయినా పార్టీ తీసుకుంటుందని, అప్పటిదాకా వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టుకుని… వాటిని పార్టీకి ఆపాదించవద్దని సూచించింది. ఈ దెబ్బకు టీడీపీ నేతలంతా ఉన్నపళంగా తమ నోళ్లకు తాళాలు వేసేశారు.

This post was last modified on January 20, 2025 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

13 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago