Political News

బాబు సీరియస్… ‘డిప్యూటీ’ డిమాండ్లకు చెక్

గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలని, ఆయనకు తక్షణమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వయంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. వీటిని టీడీపీ మిత్రపక్షం జనసేన నుంచి పెద్దగా వ్యతిరేకత రాకున్నా… సోమవారం ఒక్కసారిగా జనసేనకు చెందిన కొందరు వినూత్నంగా స్పందించారు. దీంతో మేల్కొన్న టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా స్పందించింది. అంతే…ఒక్కసారిగా డిప్యూటీ డిమాండ్లన్నీ చప్పున సైలెంట్ అయిపోయాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించగా… ఆ సభా వేదిక మీద నుంచే లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఈ డిమాండ్ ను వినిపించారు. ఏదో అభిమానంతో అలా అని ఉంటారులే అంటూ చంద్రబాబు దానిని పెద్దగా పట్టించుకోలేదు. చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. అయితే ఆ మరునాడు.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోట నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే డిమాండ్ ను వినిపించారు.

ఓ వైపు నేతల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ రెండు, మూడు రోజుల నుంచే వినిపిస్తున్నా… చాలా కాలంగా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. అయినా పార్టీ అధిష్ఠానం అంతగా పట్టించుకోలేదు. అయితే నేతలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ డిమాండ్లు వినిపిస్తున్న వేళ… జనసేన నుంచి ఒకింత వింత వాదనలు వినిపించాయి. తాము కూడా పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా అనుకుంటున్నామని జనసేన కేడర్ ఓ ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. వెరసి టీడీపీ, జనసేనల మధ్య ఓ వార్ కు రంగం సిద్ధమైపోయిందన్న సూచనలు కనిపించాయి.

ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్ఠానం సోమవారం ఉదయం తీవ్రంగా స్పందించింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ డిమాండ్ చేయడం తక్షణమే మానుకోవాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని నేతలకు సూచించింది. అంతేకాకుండా ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం అంతా చూసుకుంటుందని తెలిపింది. రెండు పార్టీలతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్ఠారాజ్యంగా ఎలా డిమాండ్లు చేస్తారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది. పొత్తు ధర్మంలో బాగంగా…మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయాన్ని అయినా పార్టీ తీసుకుంటుందని, అప్పటిదాకా వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టుకుని… వాటిని పార్టీకి ఆపాదించవద్దని సూచించింది. ఈ దెబ్బకు టీడీపీ నేతలంతా ఉన్నపళంగా తమ నోళ్లకు తాళాలు వేసేశారు.

This post was last modified on January 20, 2025 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

43 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

49 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

1 hour ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

2 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago