Political News

బాబు సీరియస్… ‘డిప్యూటీ’ డిమాండ్లకు చెక్

గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలని, ఆయనకు తక్షణమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వయంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. వీటిని టీడీపీ మిత్రపక్షం జనసేన నుంచి పెద్దగా వ్యతిరేకత రాకున్నా… సోమవారం ఒక్కసారిగా జనసేనకు చెందిన కొందరు వినూత్నంగా స్పందించారు. దీంతో మేల్కొన్న టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా స్పందించింది. అంతే…ఒక్కసారిగా డిప్యూటీ డిమాండ్లన్నీ చప్పున సైలెంట్ అయిపోయాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించగా… ఆ సభా వేదిక మీద నుంచే లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఈ డిమాండ్ ను వినిపించారు. ఏదో అభిమానంతో అలా అని ఉంటారులే అంటూ చంద్రబాబు దానిని పెద్దగా పట్టించుకోలేదు. చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. అయితే ఆ మరునాడు.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోట నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే డిమాండ్ ను వినిపించారు.

ఓ వైపు నేతల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ రెండు, మూడు రోజుల నుంచే వినిపిస్తున్నా… చాలా కాలంగా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. అయినా పార్టీ అధిష్ఠానం అంతగా పట్టించుకోలేదు. అయితే నేతలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఈ డిమాండ్లు వినిపిస్తున్న వేళ… జనసేన నుంచి ఒకింత వింత వాదనలు వినిపించాయి. తాము కూడా పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా అనుకుంటున్నామని జనసేన కేడర్ ఓ ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. వెరసి టీడీపీ, జనసేనల మధ్య ఓ వార్ కు రంగం సిద్ధమైపోయిందన్న సూచనలు కనిపించాయి.

ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్ఠానం సోమవారం ఉదయం తీవ్రంగా స్పందించింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ డిమాండ్ చేయడం తక్షణమే మానుకోవాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని నేతలకు సూచించింది. అంతేకాకుండా ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం అంతా చూసుకుంటుందని తెలిపింది. రెండు పార్టీలతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్ఠారాజ్యంగా ఎలా డిమాండ్లు చేస్తారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది. పొత్తు ధర్మంలో బాగంగా…మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయాన్ని అయినా పార్టీ తీసుకుంటుందని, అప్పటిదాకా వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టుకుని… వాటిని పార్టీకి ఆపాదించవద్దని సూచించింది. ఈ దెబ్బకు టీడీపీ నేతలంతా ఉన్నపళంగా తమ నోళ్లకు తాళాలు వేసేశారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago