ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను జనం చూసేందుకు పందేల నిర్వాహకులు బరులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎంత పెద్ద బరిని ఏర్పాటు చేస్తే… అందులో అంతే స్థాయిలో పందేలు జరిగాయి.
సేమ్… ఈ సూత్రాన్నే టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బాగా ఒంట బట్టించుకున్నారని చెప్పాలి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేలా ఈ వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారు.
ఆదివారం రాత్రి గన్నవరం నుంచి చంద్రబాబు అధికారులతో కలిసి దావోస్ పయనం కాగా… లోకేశ్ మాత్రం హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా దావోస్ బయలుదేరారు. తాను రచించుకున్న వ్యూహంలో భాగంగా చంద్రబాబు దావోస్ లో అడుగు పెట్టడానికి కాస్తంత ముందుగా అక్కడ వాలిపోయేందుకే లోకేశ్ ముంబై మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం 6 గంటలకే దావోస్ సమీపంలోని జ్యూరిచ్ లో ల్యాండయ్యారు. ఆ మరుక్షణమే లోకేశ్ రంగంలోకి దిగిపోయారు కూడా.
అయినా లోకేశ్ రూపొందించుకున్న ఈ నయా వ్యూహం ఏమిటన్న విషయానికి వస్తే… సీఎం హోదాలో చంద్రబాబు దావోస్ లో వందలాది మంది పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తారు. ఆ భేటీలకు చంద్రబాబు వెళ్లేలోగానే… సదరు ప్రతినిధి బృందాలతో లోకేశ్ ముందుగానే సమావేశం అవుతారట.
అంటే… ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీలు, అవకాశం ఉన్న రంగాలు… ఇలా ఏపీకి అనుకూలంగా ఉన్న దాదాపు అన్ని విషయాలను ఆయా బృందాలకు లోకేశ్ వివరిస్తారట. అంటే… చంద్రబాబుకు గ్రౌండ్ ప్రిపేర్ చేయడన్న మాట.
లోకేశ్ పని ముగియగానే… రంగంలోకి దిగనున్న చంద్రబాబు పెద్దగా కష్టపడకుండానే… ఆయా పారిశ్రామిక ప్రతినిధి బృందాలను ఏపీకి వచ్చేలా ఒప్పించేస్తారన్నమాట. ఇప్పటికే సింగిల్ గానే అమెరికా టూర్ వెళ్లిన లోకేశ్… తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
ఆ భేటీల అనుభవంతోనే లోకేశ్ ఈ నయా వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యూహం పక్కాగానే వర్కవుట్ అవుతుందని, ఫలితంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావడం ఖాయమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…