Political News

కొడుకు బరిని సిద్ధం చేస్తే… తండ్రి రంగంలోకి దిగుతారట

ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను జనం చూసేందుకు పందేల నిర్వాహకులు బరులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎంత పెద్ద బరిని ఏర్పాటు చేస్తే… అందులో అంతే స్థాయిలో పందేలు జరిగాయి.

సేమ్… ఈ సూత్రాన్నే టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బాగా ఒంట బట్టించుకున్నారని చెప్పాలి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేలా ఈ వ్యూహాన్ని ఆయన ఎంచుకున్నారు.

ఆదివారం రాత్రి గన్నవరం నుంచి చంద్రబాబు అధికారులతో కలిసి దావోస్ పయనం కాగా… లోకేశ్ మాత్రం హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా దావోస్ బయలుదేరారు. తాను రచించుకున్న వ్యూహంలో భాగంగా చంద్రబాబు దావోస్ లో అడుగు పెట్టడానికి కాస్తంత ముందుగా అక్కడ వాలిపోయేందుకే లోకేశ్ ముంబై మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

సోమవారం ఉదయం 6 గంటలకే దావోస్ సమీపంలోని జ్యూరిచ్ లో ల్యాండయ్యారు. ఆ మరుక్షణమే లోకేశ్ రంగంలోకి దిగిపోయారు కూడా.

అయినా లోకేశ్ రూపొందించుకున్న ఈ నయా వ్యూహం ఏమిటన్న విషయానికి వస్తే… సీఎం హోదాలో చంద్రబాబు దావోస్ లో వందలాది మంది పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తారు. ఆ భేటీలకు చంద్రబాబు వెళ్లేలోగానే… సదరు ప్రతినిధి బృందాలతో లోకేశ్ ముందుగానే సమావేశం అవుతారట.

అంటే… ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీలు, అవకాశం ఉన్న రంగాలు… ఇలా ఏపీకి అనుకూలంగా ఉన్న దాదాపు అన్ని విషయాలను ఆయా బృందాలకు లోకేశ్ వివరిస్తారట. అంటే… చంద్రబాబుకు గ్రౌండ్ ప్రిపేర్ చేయడన్న మాట.

లోకేశ్ పని ముగియగానే… రంగంలోకి దిగనున్న చంద్రబాబు పెద్దగా కష్టపడకుండానే… ఆయా పారిశ్రామిక ప్రతినిధి బృందాలను ఏపీకి వచ్చేలా ఒప్పించేస్తారన్నమాట. ఇప్పటికే సింగిల్ గానే అమెరికా టూర్ వెళ్లిన లోకేశ్… తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.

ఆ భేటీల అనుభవంతోనే లోకేశ్ ఈ నయా వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యూహం పక్కాగానే వర్కవుట్ అవుతుందని, ఫలితంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావడం ఖాయమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on January 20, 2025 10:09 am

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

46 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

54 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago