Political News

ఢిల్లీ పెద్ద‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొంద‌లేక‌, ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న స్థితి నుంచి సొంతంగా ప‌గ్గాలు చేప‌ట్టే వ‌ర‌కు చేరిన హ‌స్తం పార్టీ ఇప్పుడు తెలంగాణ‌లో ఒకింత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామాలు ఎదుర్కుంటోందా? సీఎం రేవంత్ కు ఢిల్లీ పెద్ద‌ల‌కు గ్యాప్ విష‌యంలో రాష్ట్ర మంత్రులు కూడా త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల ప్ర‌త్యేక స‌మావేశాల త‌ర్వాత ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన అంశాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం సీఎం రేవంత్ పాల‌న‌పై మంత్రులే ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేసే వ‌ర‌కు వెళ్లింద‌ని స‌మాచారం. పేరుకు పార్టీ కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ కేసీతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ మంత్రులు, ముఖ్యనేత‌లు ఈ సంద‌ర్భంగా ఒకింత రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశార‌ట‌. రాజ‌కీయప‌ర‌మైన అంశాలే కాకుండా ప‌రిపాల‌న‌లో కీల‌క‌మైన బిల్లుల చెల్లింపు విష‌యంలో త‌మ‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల గురించి కేసీ వేణుగోపాల్ వ‌ద్ద వాపోయారట‌. కొన్ని శాఖ‌ల‌ బిల్లులు క్లియ‌ర్ అవుతున్నప్పటికీ..ప‌లు శాఖల్లో మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉండటం త‌మ‌కు అవ‌మానంగా ఉంద‌ని ఒకింత కంప్లైంట్ రూపంలో చేరవేశార‌ని స‌మాచారం.

బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేయ‌డంతో పాటుగా సీఎం రేవంత్ వ్య‌వ‌హార‌శైలిని కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నార‌ట‌. ఆర్థిక శాఖ మంత్రికి స్వేచ్చ ఉంది కాబ‌ట్టి బిల్లులు ఆయ‌న్నే అడ‌గాలంటూ సీఎం స‌మాధానం దాటవేస్తున్నార‌ని, అయితే ఫైనాన్స్ మినిస్ట‌ర్ మాత్రం… ఖజానాలో నిధులు లేవ‌ని, సీఎం గారు ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లో ప‌రిశీల‌న త‌ర్వాతే నిర్ణ‌యం అంటూ త‌మ‌తో వెల్ల‌డిస్తున్నార‌ని దీంతో… త‌మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైందని మంత్రులు వాపోయిన‌ట్లు స‌మాచారం.

సాక్షాత్తు మంత్రులే బిల్లుల చెల్లింపు ఆలస్యం ప‌ట్ల తాము ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌ను ఏక‌రువు పెట్ట‌డంపై కేసీ వేణుగోపాల్ ఒకింత షాక్ అయిన‌ట్లు స‌మాచారం. కొన్ని శాఖ‌ల‌కు బిల్లులు క్లియ‌ర్ చేసి ప‌లు శాఖ‌ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో క‌ర్ణాట‌క‌లో ఇదే ర‌క‌మైన స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు అన్ని శాఖ‌ల‌కూ నెల‌వారి కొంత మొత్తం కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌న తాము చేశామ‌ని… అదే విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రికి కూడా వెల్ల‌డిస్తామ‌ని కేసీ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Satya

Recent Posts

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

53 minutes ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

2 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

4 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

6 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

11 hours ago