Political News

ఢిల్లీ పెద్ద‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొంద‌లేక‌, ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న స్థితి నుంచి సొంతంగా ప‌గ్గాలు చేప‌ట్టే వ‌ర‌కు చేరిన హ‌స్తం పార్టీ ఇప్పుడు తెలంగాణ‌లో ఒకింత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామాలు ఎదుర్కుంటోందా? సీఎం రేవంత్ కు ఢిల్లీ పెద్ద‌ల‌కు గ్యాప్ విష‌యంలో రాష్ట్ర మంత్రులు కూడా త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల ప్ర‌త్యేక స‌మావేశాల త‌ర్వాత ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన అంశాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం సీఎం రేవంత్ పాల‌న‌పై మంత్రులే ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేసే వ‌ర‌కు వెళ్లింద‌ని స‌మాచారం. పేరుకు పార్టీ కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ కేసీతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ మంత్రులు, ముఖ్యనేత‌లు ఈ సంద‌ర్భంగా ఒకింత రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశార‌ట‌. రాజ‌కీయప‌ర‌మైన అంశాలే కాకుండా ప‌రిపాల‌న‌లో కీల‌క‌మైన బిల్లుల చెల్లింపు విష‌యంలో త‌మ‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల గురించి కేసీ వేణుగోపాల్ వ‌ద్ద వాపోయారట‌. కొన్ని శాఖ‌ల‌ బిల్లులు క్లియ‌ర్ అవుతున్నప్పటికీ..ప‌లు శాఖల్లో మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉండటం త‌మ‌కు అవ‌మానంగా ఉంద‌ని ఒకింత కంప్లైంట్ రూపంలో చేరవేశార‌ని స‌మాచారం.

బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేయ‌డంతో పాటుగా సీఎం రేవంత్ వ్య‌వ‌హార‌శైలిని కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నార‌ట‌. ఆర్థిక శాఖ మంత్రికి స్వేచ్చ ఉంది కాబ‌ట్టి బిల్లులు ఆయ‌న్నే అడ‌గాలంటూ సీఎం స‌మాధానం దాటవేస్తున్నార‌ని, అయితే ఫైనాన్స్ మినిస్ట‌ర్ మాత్రం… ఖజానాలో నిధులు లేవ‌ని, సీఎం గారు ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లో ప‌రిశీల‌న త‌ర్వాతే నిర్ణ‌యం అంటూ త‌మ‌తో వెల్ల‌డిస్తున్నార‌ని దీంతో… త‌మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైందని మంత్రులు వాపోయిన‌ట్లు స‌మాచారం.

సాక్షాత్తు మంత్రులే బిల్లుల చెల్లింపు ఆలస్యం ప‌ట్ల తాము ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌ను ఏక‌రువు పెట్ట‌డంపై కేసీ వేణుగోపాల్ ఒకింత షాక్ అయిన‌ట్లు స‌మాచారం. కొన్ని శాఖ‌ల‌కు బిల్లులు క్లియ‌ర్ చేసి ప‌లు శాఖ‌ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో క‌ర్ణాట‌క‌లో ఇదే ర‌క‌మైన స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు అన్ని శాఖ‌ల‌కూ నెల‌వారి కొంత మొత్తం కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌న తాము చేశామ‌ని… అదే విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రికి కూడా వెల్ల‌డిస్తామ‌ని కేసీ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

This post was last modified on January 20, 2025 2:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

3 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

7 hours ago

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…

9 hours ago

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…

9 hours ago

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు…

10 hours ago

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…

10 hours ago