Political News

ఢిల్లీ పెద్ద‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొంద‌లేక‌, ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న స్థితి నుంచి సొంతంగా ప‌గ్గాలు చేప‌ట్టే వ‌ర‌కు చేరిన హ‌స్తం పార్టీ ఇప్పుడు తెలంగాణ‌లో ఒకింత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామాలు ఎదుర్కుంటోందా? సీఎం రేవంత్ కు ఢిల్లీ పెద్ద‌ల‌కు గ్యాప్ విష‌యంలో రాష్ట్ర మంత్రులు కూడా త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల ప్ర‌త్యేక స‌మావేశాల త‌ర్వాత ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన అంశాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం సీఎం రేవంత్ పాల‌న‌పై మంత్రులే ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేసే వ‌ర‌కు వెళ్లింద‌ని స‌మాచారం. పేరుకు పార్టీ కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ కేసీతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ మంత్రులు, ముఖ్యనేత‌లు ఈ సంద‌ర్భంగా ఒకింత రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశార‌ట‌. రాజ‌కీయప‌ర‌మైన అంశాలే కాకుండా ప‌రిపాల‌న‌లో కీల‌క‌మైన బిల్లుల చెల్లింపు విష‌యంలో త‌మ‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల గురించి కేసీ వేణుగోపాల్ వ‌ద్ద వాపోయారట‌. కొన్ని శాఖ‌ల‌ బిల్లులు క్లియ‌ర్ అవుతున్నప్పటికీ..ప‌లు శాఖల్లో మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉండటం త‌మ‌కు అవ‌మానంగా ఉంద‌ని ఒకింత కంప్లైంట్ రూపంలో చేరవేశార‌ని స‌మాచారం.

బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేయ‌డంతో పాటుగా సీఎం రేవంత్ వ్య‌వ‌హార‌శైలిని కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నార‌ట‌. ఆర్థిక శాఖ మంత్రికి స్వేచ్చ ఉంది కాబ‌ట్టి బిల్లులు ఆయ‌న్నే అడ‌గాలంటూ సీఎం స‌మాధానం దాటవేస్తున్నార‌ని, అయితే ఫైనాన్స్ మినిస్ట‌ర్ మాత్రం… ఖజానాలో నిధులు లేవ‌ని, సీఎం గారు ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లో ప‌రిశీల‌న త‌ర్వాతే నిర్ణ‌యం అంటూ త‌మ‌తో వెల్ల‌డిస్తున్నార‌ని దీంతో… త‌మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైందని మంత్రులు వాపోయిన‌ట్లు స‌మాచారం.

సాక్షాత్తు మంత్రులే బిల్లుల చెల్లింపు ఆలస్యం ప‌ట్ల తాము ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌ను ఏక‌రువు పెట్ట‌డంపై కేసీ వేణుగోపాల్ ఒకింత షాక్ అయిన‌ట్లు స‌మాచారం. కొన్ని శాఖ‌ల‌కు బిల్లులు క్లియ‌ర్ చేసి ప‌లు శాఖ‌ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో క‌ర్ణాట‌క‌లో ఇదే ర‌క‌మైన స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు అన్ని శాఖ‌ల‌కూ నెల‌వారి కొంత మొత్తం కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌న తాము చేశామ‌ని… అదే విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రికి కూడా వెల్ల‌డిస్తామ‌ని కేసీ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

This post was last modified on January 20, 2025 2:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

28 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

34 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

49 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago