Political News

ఏపీకి ‘ట్రిపుల్’ భరోసా దక్కింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ లేమితో పాటుగా అప్పుల కుప్ప నెత్తిన పెట్టుకుని ఏపీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ… ఏపీలో ఆదాయ వనరులను పెంచుకుంటూ సాగగా… ఆ తర్వాత వచ్చిన వైసీపీ సంక్షేమ పాలనకే ప్రాధాన్యం ఇచ్చింది. పలితంగా ఏపీ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి రాష్ట్రం ఎప్పుడు అబివృద్ధి బాట పడుతుందంటూ మేథావులు ఆందోళన చెందేవారు. అయితే ఇప్పుడు వారి ఆందోళనలకు ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి.

రెండు రోొజుల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. తన టూర్ లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా కొండపావులూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ప్రసంగించిన అమిత్ షా… ఏపీకి సంపూర్ణ భరోసా ఇచ్చారు. అభివృద్ధి పరంగా ఏపీ ప్రజలు ఇకప ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటను ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు.

తన ప్రసంగంలో ఏపీ కష్టాలను ఒకింత లోతుగానే అమిత్ షా ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ భారీ విధ్వంసానికి గురైందని కూడా ఆయన చెప్పారు. అయినా కూడా ఏపీ ప్రజలు భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భరోసా ఇచ్చారు. ఎందుకంటే… ఏపీలోని కూటమి సర్కారుతో కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏపీని మూడింతల స్పీడుతో (ట్రిపుల్ స్పీడ్)తో అభివృద్ధిలో పరుగులు పెట్టేలా చేస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే గడచిన 6 నెలల వ్యవధిలోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేలా సహకరించామని షా తెలిపారు.

ఇప్పటికే ఆంధ్రుల ఆత్మ గౌరవంగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం ఇచ్చేందుకు రూ.11,440 కోట్లతో రివైవల్ ప్యాకేజీ ప్రకటించామని షా తెలిపారు. ఇక రాజధాని అమరావతికి కూడా కేంద్రం ఇతోదికంగా సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి రూ.27 వేల కోట్ల మేర రుణాన్ని అందించగలిగామన్నారు. ఇక ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన మేర నిధులను అందించనున్నట్లు కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అండదండలు, సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ వెన్నుదన్ను నిరంతరం లభిస్తాయని కూడా ఆయన ప్రకటించారు. వెరసి ఏపీ అభివృద్ధికి అమిత్ షా కొండంత భరోసా ఇచ్చారనే చెప్పాలి.

This post was last modified on January 20, 2025 2:36 am

Share

Recent Posts

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

15 minutes ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

31 minutes ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

4 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

9 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

13 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

14 hours ago