Political News

ఏపీకి ‘ట్రిపుల్’ భరోసా దక్కింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ లేమితో పాటుగా అప్పుల కుప్ప నెత్తిన పెట్టుకుని ఏపీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ… ఏపీలో ఆదాయ వనరులను పెంచుకుంటూ సాగగా… ఆ తర్వాత వచ్చిన వైసీపీ సంక్షేమ పాలనకే ప్రాధాన్యం ఇచ్చింది. పలితంగా ఏపీ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి రాష్ట్రం ఎప్పుడు అబివృద్ధి బాట పడుతుందంటూ మేథావులు ఆందోళన చెందేవారు. అయితే ఇప్పుడు వారి ఆందోళనలకు ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి.

రెండు రోొజుల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. తన టూర్ లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా కొండపావులూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ప్రసంగించిన అమిత్ షా… ఏపీకి సంపూర్ణ భరోసా ఇచ్చారు. అభివృద్ధి పరంగా ఏపీ ప్రజలు ఇకప ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటను ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు.

తన ప్రసంగంలో ఏపీ కష్టాలను ఒకింత లోతుగానే అమిత్ షా ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ భారీ విధ్వంసానికి గురైందని కూడా ఆయన చెప్పారు. అయినా కూడా ఏపీ ప్రజలు భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భరోసా ఇచ్చారు. ఎందుకంటే… ఏపీలోని కూటమి సర్కారుతో కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏపీని మూడింతల స్పీడుతో (ట్రిపుల్ స్పీడ్)తో అభివృద్ధిలో పరుగులు పెట్టేలా చేస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే గడచిన 6 నెలల వ్యవధిలోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేలా సహకరించామని షా తెలిపారు.

ఇప్పటికే ఆంధ్రుల ఆత్మ గౌరవంగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం ఇచ్చేందుకు రూ.11,440 కోట్లతో రివైవల్ ప్యాకేజీ ప్రకటించామని షా తెలిపారు. ఇక రాజధాని అమరావతికి కూడా కేంద్రం ఇతోదికంగా సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి రూ.27 వేల కోట్ల మేర రుణాన్ని అందించగలిగామన్నారు. ఇక ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన మేర నిధులను అందించనున్నట్లు కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అండదండలు, సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ వెన్నుదన్ను నిరంతరం లభిస్తాయని కూడా ఆయన ప్రకటించారు. వెరసి ఏపీ అభివృద్ధికి అమిత్ షా కొండంత భరోసా ఇచ్చారనే చెప్పాలి.

This post was last modified on January 20, 2025 2:36 am

Share

Recent Posts

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

2 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

2 hours ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

2 hours ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

3 hours ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

4 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

5 hours ago