Political News

ఏపీకి ‘ట్రిపుల్’ భరోసా దక్కింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ లేమితో పాటుగా అప్పుల కుప్ప నెత్తిన పెట్టుకుని ఏపీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ… ఏపీలో ఆదాయ వనరులను పెంచుకుంటూ సాగగా… ఆ తర్వాత వచ్చిన వైసీపీ సంక్షేమ పాలనకే ప్రాధాన్యం ఇచ్చింది. పలితంగా ఏపీ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి రాష్ట్రం ఎప్పుడు అబివృద్ధి బాట పడుతుందంటూ మేథావులు ఆందోళన చెందేవారు. అయితే ఇప్పుడు వారి ఆందోళనలకు ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి.

రెండు రోొజుల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. తన టూర్ లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా కొండపావులూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ప్రసంగించిన అమిత్ షా… ఏపీకి సంపూర్ణ భరోసా ఇచ్చారు. అభివృద్ధి పరంగా ఏపీ ప్రజలు ఇకప ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటను ఆయన ఒకింత గట్టిగానే చెప్పారు.

తన ప్రసంగంలో ఏపీ కష్టాలను ఒకింత లోతుగానే అమిత్ షా ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ భారీ విధ్వంసానికి గురైందని కూడా ఆయన చెప్పారు. అయినా కూడా ఏపీ ప్రజలు భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భరోసా ఇచ్చారు. ఎందుకంటే… ఏపీలోని కూటమి సర్కారుతో కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏపీని మూడింతల స్పీడుతో (ట్రిపుల్ స్పీడ్)తో అభివృద్ధిలో పరుగులు పెట్టేలా చేస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే గడచిన 6 నెలల వ్యవధిలోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేలా సహకరించామని షా తెలిపారు.

ఇప్పటికే ఆంధ్రుల ఆత్మ గౌరవంగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం ఇచ్చేందుకు రూ.11,440 కోట్లతో రివైవల్ ప్యాకేజీ ప్రకటించామని షా తెలిపారు. ఇక రాజధాని అమరావతికి కూడా కేంద్రం ఇతోదికంగా సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి రూ.27 వేల కోట్ల మేర రుణాన్ని అందించగలిగామన్నారు. ఇక ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన మేర నిధులను అందించనున్నట్లు కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అండదండలు, సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ వెన్నుదన్ను నిరంతరం లభిస్తాయని కూడా ఆయన ప్రకటించారు. వెరసి ఏపీ అభివృద్ధికి అమిత్ షా కొండంత భరోసా ఇచ్చారనే చెప్పాలి.

This post was last modified on January 20, 2025 2:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

21 minutes ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

30 minutes ago

నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్‌లో, లవర్ బాయ్‌గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…

51 minutes ago

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

3 hours ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

3 hours ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

7 hours ago