కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుకు నవ జీవనం ప్రసాదిస్తూ కేంద్రం ఓ భారీ రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే… షా ఏపికి రావడంతో ఆయనకు ఏపీలోని కూటమి సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికింది. సాంతం సంబరాల్లో జరగాల్సిన ఈ పర్యటనలో శనివారం రాత్రి ఓ అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఏపీ సమస్యలు పరిష్కరించుకునే దిశగా… కూటమి సర్కారు షా ముందు భారీ స్థాయిలో ప్రతిపాదనలు పెట్టే సమయంలో… కేంద్రం తీరుపై ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
శనివారం రాత్రికి షా విజయవాడ చేరుకుని… నేరుగా ఉండవల్లిలోని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికార నివాసానికి డిన్నర్ కోసం వెళ్లారు. ఈ సమయంలో చంద్రబాబు నుంచి ఓ అనూహ్య ప్రస్తావనను షా ఎదుర్కొన్నారు. కేంద్రం తీరు ఇలా ఉంటే… తాము ముందుకెలా సాగుతామంటూ చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తాను వచ్చిన వేళ… సంతోషించాల్సిన చంద్రబాబు ఇలా అసహనం వ్యక్తం చేయడమేమిటన్న కోణంలో షా కూడా ఒకితం షాక్ కు గురయ్యారనే చెప్పాలి. చంద్రబాబు అసహనానికి గల కారణాన్ని తెలుసుకున్న షా.,.. వెనువెంటనే బాబు కోపాన్ని తగ్గించేలా కీలక ఆదేశాలు జారీ చేశారు.
అయినా ఏం జరిగిందన్న విషయానికి వస్తే… తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట, దానిని మరువకముందే తిరుపతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై కేంద్రం దృష్టి సారించింది. వరుస ఘటనల నేపథ్యంలో అసలు తిరుపతిలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్వి సంజీవ్ కుమార్ జిందాల్ ను తిరుమల పంపించి..టీటీడీ అదికారులతో సమీక్షించాలని తీర్మానించింది. ఇందుకోసం అప్పటికప్పుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఓ లేఖ రాసింది. జిందాల్ విచారణకు సహకరించాలని అందులో ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయం తెలిసినంతనే చంద్రబాబు అసహనానికి గురయ్యారట. కేంద్ర హోం మంత్రి తొలి సారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న సమయంలో ఆ శాఖే అతి చేస్తూ ఈ లేఖ రాయడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకున్న దాఖలా లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా షా వద్దే తేల్చుకోవాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా షా వద్ద ఈ విషయాన్ని ఎలా ప్రస్తావించాలన్న దానిపై ఆయన ముందుగానే కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం.
తన ఇంటికి షా రాగానే… పసందైన విందును ఆయనకు చంద్రబాబు అందించారు. ఆ తర్వాత షాతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో టీటీడీపై కేంద్రం సమీక్షను చంద్రబాబు ప్రస్తావించారు. తొక్కిసలాటపై ఇప్పటికే తాము వేగంగా స్పందించి… బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, తిరుమలలో పటిష్ట చర్యలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి సమయంలో కేంద్రం సమీక్ష ఏమిటని ఆయన ప్రశ్నించారట. దీంతో విషయం తీవ్రతను పసిగట్టిన షా… అక్కడిక్కడే ఫోన్ తీసుకుని… జిందాల్ తిరుమల టూర్ ను రద్దు చేయాలని అదికారులకు ఆదేశాలు జారీ చేశారట. క్షణాల్లో సమస్యను పరిష్కరించిన షాకు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఇతరత్రా విషయాలపై దృష్టి సారించారట.
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…