Political News

బాబు అసహనంతో దిగొచ్చిన కేంద్రం…?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుకు నవ జీవనం ప్రసాదిస్తూ కేంద్రం ఓ భారీ రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే… షా ఏపికి రావడంతో ఆయనకు ఏపీలోని కూటమి సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికింది. సాంతం సంబరాల్లో జరగాల్సిన ఈ పర్యటనలో శనివారం రాత్రి ఓ అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఏపీ సమస్యలు పరిష్కరించుకునే దిశగా… కూటమి సర్కారు షా ముందు భారీ స్థాయిలో ప్రతిపాదనలు పెట్టే సమయంలో… కేంద్రం తీరుపై ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

శనివారం రాత్రికి షా విజయవాడ చేరుకుని… నేరుగా ఉండవల్లిలోని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికార నివాసానికి డిన్నర్ కోసం వెళ్లారు. ఈ సమయంలో చంద్రబాబు నుంచి ఓ అనూహ్య ప్రస్తావనను షా ఎదుర్కొన్నారు. కేంద్రం తీరు ఇలా ఉంటే… తాము ముందుకెలా సాగుతామంటూ చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తాను వచ్చిన వేళ… సంతోషించాల్సిన చంద్రబాబు ఇలా అసహనం వ్యక్తం చేయడమేమిటన్న కోణంలో షా కూడా ఒకితం షాక్ కు గురయ్యారనే చెప్పాలి. చంద్రబాబు అసహనానికి గల కారణాన్ని తెలుసుకున్న షా.,.. వెనువెంటనే బాబు కోపాన్ని తగ్గించేలా కీలక ఆదేశాలు జారీ చేశారు.

అయినా ఏం జరిగిందన్న విషయానికి వస్తే… తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట, దానిని మరువకముందే తిరుపతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై కేంద్రం దృష్టి సారించింది. వరుస ఘటనల నేపథ్యంలో అసలు తిరుపతిలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్వి సంజీవ్ కుమార్ జిందాల్ ను తిరుమల పంపించి..టీటీడీ అదికారులతో సమీక్షించాలని తీర్మానించింది. ఇందుకోసం అప్పటికప్పుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఓ లేఖ రాసింది. జిందాల్ విచారణకు సహకరించాలని అందులో ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయం తెలిసినంతనే చంద్రబాబు అసహనానికి గురయ్యారట. కేంద్ర హోం మంత్రి తొలి సారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న సమయంలో ఆ శాఖే అతి చేస్తూ ఈ లేఖ రాయడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకున్న దాఖలా లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా షా వద్దే తేల్చుకోవాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా షా వద్ద ఈ విషయాన్ని ఎలా ప్రస్తావించాలన్న దానిపై ఆయన ముందుగానే కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం.

తన ఇంటికి షా రాగానే… పసందైన విందును ఆయనకు చంద్రబాబు అందించారు. ఆ తర్వాత షాతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో టీటీడీపై కేంద్రం సమీక్షను చంద్రబాబు ప్రస్తావించారు. తొక్కిసలాటపై ఇప్పటికే తాము వేగంగా స్పందించి… బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, తిరుమలలో పటిష్ట చర్యలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి సమయంలో కేంద్రం సమీక్ష ఏమిటని ఆయన ప్రశ్నించారట. దీంతో విషయం తీవ్రతను పసిగట్టిన షా… అక్కడిక్కడే ఫోన్ తీసుకుని… జిందాల్ తిరుమల టూర్ ను రద్దు చేయాలని అదికారులకు ఆదేశాలు జారీ చేశారట. క్షణాల్లో సమస్యను పరిష్కరించిన షాకు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఇతరత్రా విషయాలపై దృష్టి సారించారట.

This post was last modified on January 20, 2025 2:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

38 minutes ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

42 minutes ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

1 hour ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

1 hour ago

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

3 hours ago

ఇలా అర్థం చేసుకున్నారా.. టొవినో ఆవేద‌న‌

మ‌ల‌యాళ స్టార్ హీరో టొవినో థామ‌స్.. తాను జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న‌ డ్రాగ‌న్ (వ‌ర్కింగ్ టైటిల్)…

4 hours ago