దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ను ఏక్కడ ఏర్పాటు చేస్తుందన్నది ఈ చర్చల సారాంశం. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్… హెచ్125 హెలికాఫ్టర్ల తయారీ కోసం భారత్ లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కు భారత్ ను అయితే ఎంచుకున్న ఎయిర్ బస్… భారత్ లో ఎక్కడ పెట్టాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయం అయితే తీసుకోలేదు. దేశంలోని పలు ప్రాంతాలను ఆ సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రధానంగా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వాటిలో ఏపీతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ ప్రదాని మోదీ సొంత రాష్ట్రమైతే… ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కీలకమైనది. ఇక కర్ణాటక ఏవియేషన్ రంగానికి అనుకూలమైన రాష్ట్రంగా పేరు గడించింది. మరి ఏపీ ఏ రీతిన ఈ జాబితాలోకి చేరిందంటే… ఏపీలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కియా ప్లాంట్ తో అటు అనంతపురం జిల్లాతో పాటుగా ఏపీ కూడా వరల్డ్ టాప్ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రాయలసీమలోని అత్యంత ఎడారి జిల్లాగా పేరున్న అనంతపురంలో ఏ కంపెనీ తన ప్లాంట్ ను పెట్టాలన్నా… అవసరమైన మేర భూమి ఇట్టే దొరికిపోతుంది. మానవ వనరుల విషయంలోనూ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్లకు అనంత ఓ అవకాశాల గని కిందే లెక్క. జిల్లాలో ఇటీవలి కాలంలో పెరిగిన నీటి లభ్యత కూడా ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పాలి. తక్కువ ధరలకే భూమి లభిస్తుండటంతో ఆటోమొబైల్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనంత జిల్లానే ప్రిఫర్ చేస్తోంది.
ఈ క్రమంలో ఎయిర్ బస్ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఓ దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఎయిర్ బస్ యూనిట్ కోసం అవసరమైన మేర భూములు ఎక్కడ ఉన్నాయో చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఎయిర్ బస్ తో చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు విడుదల కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా… ఎయిర్ బస్ అనంతకు వస్తే… జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…