Political News

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ను ఏక్కడ ఏర్పాటు చేస్తుందన్నది ఈ చర్చల సారాంశం. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్… హెచ్125 హెలికాఫ్టర్ల తయారీ కోసం భారత్ లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కు భారత్ ను అయితే ఎంచుకున్న ఎయిర్ బస్… భారత్ లో ఎక్కడ పెట్టాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయం అయితే తీసుకోలేదు. దేశంలోని పలు ప్రాంతాలను ఆ సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రధానంగా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వాటిలో ఏపీతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ ప్రదాని మోదీ సొంత రాష్ట్రమైతే… ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కీలకమైనది. ఇక కర్ణాటక ఏవియేషన్ రంగానికి అనుకూలమైన రాష్ట్రంగా పేరు గడించింది. మరి ఏపీ ఏ రీతిన ఈ జాబితాలోకి చేరిందంటే… ఏపీలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కియా ప్లాంట్ తో అటు అనంతపురం జిల్లాతో పాటుగా ఏపీ కూడా వరల్డ్ టాప్ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాయలసీమలోని అత్యంత ఎడారి జిల్లాగా పేరున్న అనంతపురంలో ఏ కంపెనీ తన ప్లాంట్ ను పెట్టాలన్నా… అవసరమైన మేర భూమి ఇట్టే దొరికిపోతుంది. మానవ వనరుల విషయంలోనూ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్లకు అనంత ఓ అవకాశాల గని కిందే లెక్క. జిల్లాలో ఇటీవలి కాలంలో పెరిగిన నీటి లభ్యత కూడా ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పాలి. తక్కువ ధరలకే భూమి లభిస్తుండటంతో ఆటోమొబైల్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనంత జిల్లానే ప్రిఫర్ చేస్తోంది.

ఈ క్రమంలో ఎయిర్ బస్ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఓ దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఎయిర్ బస్ యూనిట్ కోసం అవసరమైన మేర భూములు ఎక్కడ ఉన్నాయో చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఎయిర్ బస్ తో చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు విడుదల  కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా… ఎయిర్ బస్ అనంతకు వస్తే… జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

4 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago