ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు పలు విజ్ఞాపలు, విన్నపాలు వినిపించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు అంతర్గతంగా సంభా షించుకున్నట్టు తెలిసింది. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదని సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ-ఏపీ మధ్య ఉన్న విభేదాలపైనే ఎక్కువగా చంద్రబాబు ఫోకస్ చేశారని తెలిసింది. ప్రస్తుతం నదుల అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
రాజస్థాన్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలోని బనకచర్ల వరకు కృష్ణా, గోదావరి, పెన్నా నదుల జలాలనుతీసుకువెళ్లే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. మరో వివాదానికి కాలు దువ్వుతోంది. బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి కేంద్రానికి లేఖలు సంధించారు. దీనిపై సీఎం చంద్రబాబు అమిత్ షాకు కూలంకషంగా వివరించారని సమాచారం.
ఈ నదుల అనుసంధానంతో కరువు సీమకు నీరు అందుతాయని.. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని అమిత్షాకు విన్నవించినట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం ప్రతిపాదించిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్-2పై పునః సమీక్ష చేయాలని.. న్యాయ పరంగా కంటే.. దౌత్య పరంగా ఈ సమస్య పరిష్కారం అయితే..ఏపీకి మేలు జరుగుతుందనికూడా ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల వ్యవహారం కూడా.. ప్రస్తావనకు వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నామినేటెడ్ పదవుల విషయంలో తమ మిత్రపక్షం బీజేపీకి న్యాయం చేస్తున్నామని చంద్రబాబు చెప్పగా.. ఈ విషయంలో తాము సంతృప్తిగానే ఉన్నామని, అయితే.. క్షేత్రస్తాయిలో కొంత అసంతృప్తి ఉందని.. దానిని తగ్గించే ప్రయత్నం చేయాలని అమిత్షా సూచించినట్టు సమాచారం. ఇక, పోలవరం పనులు, విశాఖ రైల్వే జోన్, స్టీల్ప్లాంటు నిధుల పై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది. ప్రస్తుతం కూటమి సర్కారు పాలనపై.. అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. పాలన బాగుందని.. జీడీపీ పెంచుకునేలా ప్రయత్నాలుచేయాలని ఆయన సూచించినట్టు సమాచారం.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…