Political News

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు పలు విజ్ఞాప‌లు, విన్న‌పాలు వినిపించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు అంత‌ర్గ‌తంగా సంభా షించుకున్న‌ట్టు తెలిసింది. ఈ చ‌ర్చ‌ల్లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ పాల్గొన‌లేద‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌-ఏపీ మ‌ధ్య ఉన్న విభేదాల‌పైనే ఎక్కువ‌గా చంద్ర‌బాబు ఫోక‌స్ చేశార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం న‌దుల అనుసంధానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

రాజ‌స్థాన్‌లో ఇప్ప‌టికే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల వ‌ర‌కు కృష్ణా, గోదావ‌రి, పెన్నా న‌దుల జ‌లాల‌నుతీసుకువెళ్లే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో తెలంగాణ దీనిపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ.. మ‌రో వివాదానికి కాలు దువ్వుతోంది. బ‌న‌కచ‌ర్ల ప్రాజెక్టును తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ‌లు సంధించారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు అమిత్ షాకు కూలంక‌షంగా వివ‌రించార‌ని స‌మాచారం.

ఈ న‌దుల అనుసంధానంతో క‌రువు సీమ‌కు నీరు అందుతాయ‌ని.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త తీసుకోవాల‌ని అమిత్‌షాకు విన్న‌వించిన‌ట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం ప్ర‌తిపాదించిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యున‌ల్‌-2పై పునః స‌మీక్ష చేయాల‌ని.. న్యాయ ప‌రంగా కంటే.. దౌత్య ప‌రంగా ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయితే..ఏపీకి మేలు జ‌రుగుతుంద‌నికూడా ఆయ‌న చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ సందర్భంగా నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం కూడా.. ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో త‌మ మిత్ర‌ప‌క్షం బీజేపీకి న్యాయం చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌గా.. ఈ విష‌యంలో తాము సంతృప్తిగానే ఉన్నామ‌ని, అయితే.. క్షేత్ర‌స్తాయిలో కొంత అసంతృప్తి ఉంద‌ని.. దానిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాల‌ని అమిత్‌షా సూచించిన‌ట్టు స‌మాచారం. ఇక‌, పోల‌వ‌రం ప‌నులు, విశాఖ రైల్వే జోన్‌, స్టీల్‌ప్లాంటు నిధుల పై చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కారు పాల‌న‌పై.. అమిత్ షా సంతోషం వ్య‌క్తం చేశారు. పాల‌న బాగుంద‌ని.. జీడీపీ పెంచుకునేలా ప్ర‌య‌త్నాలుచేయాల‌ని ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం.

This post was last modified on January 19, 2025 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

33 minutes ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

3 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

5 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

10 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

10 hours ago