Political News

నిన్న సంజయ్… నేడు సునీల్

ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్ గా వ్యవరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై విచారణకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ మంత్రిమండలి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన అథారిటీని ఏర్పాటు చేసింది.

జగన్ సీఎంగా ఉండగా… సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ నాటి ప్రభుత్వం చెప్పినట్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం నిబంధనలను సైతం ఆయన పక్కనపెట్టేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాకృష్ణరాజు నాడు నరసాపురం ఎంపీగా కొనసాగిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు ఆదేశాలతో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆయనను తమ కస్టడీలో టార్చర్ చేసినట్లుగా వార్తలు రాగా..దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.

ఈ కేసులో సునీల్ కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలున్నాయి. సునీల్ ఆదేశాలతోనే సీఐడీ అధికారులు రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా సునీల్ కు సన్నిహితంగా కొనసాగిన ప్రైవేట్ వ్యక్తి తులసిబాబును రఘురామ గుండెలపై కూర్చోబెట్టి… మాజీ ఎంపీని చంపేయాలని చూశారని కూడా ఆరోపణలున్నాయి. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలున్న సీఐడీ అధికారి విజయ్ పాల్ తో పాటుగా తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటు విజయ్ పాల్ తో పాటుగా అటు తులసిబాబును రోజుల తరబడి విచారించిన పోలీసులు.. ఈ కేసులో సునీల్ ప్రత్యక్ష పాత్రను నిర్ధారించుకున్న తర్వాతే… ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఈ విచారణ అథారిటిలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాతో పాటుగా సీనియర్ ఐపీఎస్ అదికారి హరీశ్ కుమార్ గుప్తాలను ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణను పూర్తి చేసి నివేదికను అందించాలని అథారిటీని ఆదేశించింది.

సునీల్ తర్వాత సీఐడీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి… జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారని ఆరోపణలు ఎదర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా.. ఆయనపై ఏకంగా కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా సునీల్ పైనా విచారణ షురూ కావడంతో వైైసీపీ జమానాలో సీఐడీ చీఫ్ లుగా వ్యవహరించిన ఇద్దరిపైనా చర్యలు తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే…అటు సంజయ్, ఇటు సునీల్…ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.

This post was last modified on January 18, 2025 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 minutes ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

9 minutes ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

31 minutes ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

2 hours ago

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…

2 hours ago

నంద‌మూరి నాలుగో తరం సినిమా ఏమైంది?

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్ప‌టికే మూడు త‌రాల హీరోలు వ‌చ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…

3 hours ago