Political News

నిన్న సంజయ్… నేడు సునీల్

ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్ గా వ్యవరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై విచారణకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ మంత్రిమండలి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన అథారిటీని ఏర్పాటు చేసింది.

జగన్ సీఎంగా ఉండగా… సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ నాటి ప్రభుత్వం చెప్పినట్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం నిబంధనలను సైతం ఆయన పక్కనపెట్టేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాకృష్ణరాజు నాడు నరసాపురం ఎంపీగా కొనసాగిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు ఆదేశాలతో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆయనను తమ కస్టడీలో టార్చర్ చేసినట్లుగా వార్తలు రాగా..దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.

ఈ కేసులో సునీల్ కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలున్నాయి. సునీల్ ఆదేశాలతోనే సీఐడీ అధికారులు రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా సునీల్ కు సన్నిహితంగా కొనసాగిన ప్రైవేట్ వ్యక్తి తులసిబాబును రఘురామ గుండెలపై కూర్చోబెట్టి… మాజీ ఎంపీని చంపేయాలని చూశారని కూడా ఆరోపణలున్నాయి. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలున్న సీఐడీ అధికారి విజయ్ పాల్ తో పాటుగా తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటు విజయ్ పాల్ తో పాటుగా అటు తులసిబాబును రోజుల తరబడి విచారించిన పోలీసులు.. ఈ కేసులో సునీల్ ప్రత్యక్ష పాత్రను నిర్ధారించుకున్న తర్వాతే… ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఈ విచారణ అథారిటిలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాతో పాటుగా సీనియర్ ఐపీఎస్ అదికారి హరీశ్ కుమార్ గుప్తాలను ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణను పూర్తి చేసి నివేదికను అందించాలని అథారిటీని ఆదేశించింది.

సునీల్ తర్వాత సీఐడీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి… జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారని ఆరోపణలు ఎదర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ పై ఇప్పటికే విచారణ పూర్తి కాగా.. ఆయనపై ఏకంగా కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా సునీల్ పైనా విచారణ షురూ కావడంతో వైైసీపీ జమానాలో సీఐడీ చీఫ్ లుగా వ్యవహరించిన ఇద్దరిపైనా చర్యలు తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే…అటు సంజయ్, ఇటు సునీల్…ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.

This post was last modified on January 18, 2025 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

12 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

15 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

23 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

33 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

60 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago