టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో ఆయన స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అధికారంలో ఉన్న నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అంటూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా… అది తమ వల్ల జరిగినది కాదని, తమ వైరి వర్గాల కారణంగానే అది జరిగిందంటూ బుకాయించడమూ చూస్తున్నదే. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ ఎప్పుడో స్వస్తి చెప్పేశారు. ఏది జరిగినా… ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటున్న లోకేశ్… తనలోని సిసలైన నేతను జనానికి పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారీ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు తరఫున చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ ఆయన సారీ చెప్పించేలా చేశారు. తాజాగా ఏ ఒక్కరూ అడక్కుండానే… పవన్ కు మించిన రీతిలో లోకేశ్ సారీ చెప్పడం నిజంగానే ఆదర్శంగా నిలుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా లోకేశ్ సారీ చెప్పడానికి దారి తీసిన విషయం ఏమిటన్న విషయానికి వస్తే… బెజవాడలోని దుర్గ గుడి ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవంటూ శుక్రవారం పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. గుడి పరిసరాలూ అపరిశుభ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కాగా… లోకేశ్ వాటిపై స్పందిస్తూ మరోమారు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామంటూ బదులిచ్చారు.
This post was last modified on January 18, 2025 12:35 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…