టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో ఆయన స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అధికారంలో ఉన్న నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అంటూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా… అది తమ వల్ల జరిగినది కాదని, తమ వైరి వర్గాల కారణంగానే అది జరిగిందంటూ బుకాయించడమూ చూస్తున్నదే. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ ఎప్పుడో స్వస్తి చెప్పేశారు. ఏది జరిగినా… ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటున్న లోకేశ్… తనలోని సిసలైన నేతను జనానికి పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారీ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు తరఫున చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ ఆయన సారీ చెప్పించేలా చేశారు. తాజాగా ఏ ఒక్కరూ అడక్కుండానే… పవన్ కు మించిన రీతిలో లోకేశ్ సారీ చెప్పడం నిజంగానే ఆదర్శంగా నిలుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా లోకేశ్ సారీ చెప్పడానికి దారి తీసిన విషయం ఏమిటన్న విషయానికి వస్తే… బెజవాడలోని దుర్గ గుడి ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవంటూ శుక్రవారం పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. గుడి పరిసరాలూ అపరిశుభ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కాగా… లోకేశ్ వాటిపై స్పందిస్తూ మరోమారు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామంటూ బదులిచ్చారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…