టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో ఆయన స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అధికారంలో ఉన్న నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అంటూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా… అది తమ వల్ల జరిగినది కాదని, తమ వైరి వర్గాల కారణంగానే అది జరిగిందంటూ బుకాయించడమూ చూస్తున్నదే. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ ఎప్పుడో స్వస్తి చెప్పేశారు. ఏది జరిగినా… ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటున్న లోకేశ్… తనలోని సిసలైన నేతను జనానికి పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారీ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు తరఫున చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ ఆయన సారీ చెప్పించేలా చేశారు. తాజాగా ఏ ఒక్కరూ అడక్కుండానే… పవన్ కు మించిన రీతిలో లోకేశ్ సారీ చెప్పడం నిజంగానే ఆదర్శంగా నిలుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా లోకేశ్ సారీ చెప్పడానికి దారి తీసిన విషయం ఏమిటన్న విషయానికి వస్తే… బెజవాడలోని దుర్గ గుడి ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవంటూ శుక్రవారం పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. గుడి పరిసరాలూ అపరిశుభ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కాగా… లోకేశ్ వాటిపై స్పందిస్తూ మరోమారు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామంటూ బదులిచ్చారు.
This post was last modified on January 18, 2025 12:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…