టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో ఆయన స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అధికారంలో ఉన్న నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అంటూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా… అది తమ వల్ల జరిగినది కాదని, తమ వైరి వర్గాల కారణంగానే అది జరిగిందంటూ బుకాయించడమూ చూస్తున్నదే. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ ఎప్పుడో స్వస్తి చెప్పేశారు. ఏది జరిగినా… ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటున్న లోకేశ్… తనలోని సిసలైన నేతను జనానికి పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారీ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు తరఫున చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ ఆయన సారీ చెప్పించేలా చేశారు. తాజాగా ఏ ఒక్కరూ అడక్కుండానే… పవన్ కు మించిన రీతిలో లోకేశ్ సారీ చెప్పడం నిజంగానే ఆదర్శంగా నిలుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా లోకేశ్ సారీ చెప్పడానికి దారి తీసిన విషయం ఏమిటన్న విషయానికి వస్తే… బెజవాడలోని దుర్గ గుడి ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవంటూ శుక్రవారం పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. గుడి పరిసరాలూ అపరిశుభ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ వీడియో వైరల్ కాగా… లోకేశ్ వాటిపై స్పందిస్తూ మరోమారు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామంటూ బదులిచ్చారు.
This post was last modified on January 18, 2025 12:35 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…