నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా పాలనా అనుభవం లేదన్న వాదనలు ఇప్పుడు పటాపంచలు అయిపోయాయి.. రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమే అయినా పవన్ కల్యాణ్ ఓ ఎమ్మెల్యేగా, ఆపై డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి కేవలం 7 నెలలు మాత్రమే అవుతోంది. అయితేనేం… ఈ అతి తక్కువ కాలంలోనే పాలనపై పట్టు సాధించేశారు. తనకు కేటాయించిన శాఖలపై నిత్యం సమీక్షలు చేస్తూ సాగుతున్న పవన్… శుక్రవారం దాదాపుగా తన పరిధిలోని అన్నిశాఖలకు సంబంధించి ఓ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆయా ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అదికారుల చేతివాటం చూస్తున్నదే. ఇందులో ఏ ఒక్క శాఖకూ మినహాయింపు లేదనే చెప్పాలి. ఇదే విషయాన్ని గ్రహించిన పవన్… తన పరిధిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటివీ శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఏసీబీ కేసులపై దృష్టి సారించారు. అసలు ఈ శాఖల్లో ఇన్నేసి కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయంటూ ఆయన ఆయా శాఖల కార్యదర్శులను నిలదీశారు. ఇప్పటిదాకా ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఎన్ని?.. వాటి పెండింగ్ కు కారణాలేమిటన్న దానిప సమగ్ర నివేదిక కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పవన్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల విచారణ సందర్బంగా…నిందితుడు, విచారణాధికారి మధ్య సంబంధం లేకుండా వ్యవహరిస్తే… కేసులు ఎందుకు పరిష్కారం కాకుండా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. నిజమే మరి… ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి… విచారణాధికారితో ఏ రూపంగానైనా సంబంధాలు కలిగి ఉంటే… ఆ కేసుల పరిష్కారం అటకెక్కుతుంది కదా. ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఏఒక్కరూ అంతగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. పాలనపై ఎంత అవగాహన లేకుంటే పవన్ ఈ అంశాన్ని ప్రప్తావిస్తారన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పవన్ ఇదే స్పీడును కొనసాగిస్తే… ఆయా శాఖల్లో అవినీతికి పాల్పడాలంటేనే అధికారులు హడలిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.
This post was last modified on January 18, 2025 12:34 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…