న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలతల మధ్య నెలకొన్న పంచాయతీ అప్పుడే ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే జేసీ ఈ వివాదాన్ని ముగించే దిశగా అడుగులు వేసినా… ఎందుకనో గానీ మాధవీ లత ఈ వ్యవహారాన్ని అప్పుడప్పుడే వదలేలా కనిపించడం లేదు. జేసీపై కఠిన చర్యలు తీసుకునే దాకా ఆమె తగ్గేలా కనిపించడం లేదు.
న్యూ ఇయర్ నాడు మహిళల కోసం తాడిపత్రిలో తాను ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నానని…పట్టణ మహిళలంతా అక్కడికి రావాలంటూ జేసీ ఇన్విటేషన్లు పంపారు. ఈ ప్రకటన చూసినంతనే మాధవీ లత భగ్గుమన్నారు. మహిళలకు భద్రత లేని ఈ తరహా కార్యక్రమాలకు ఎవరూ వెళ్లరాదంటూ ఆమె కోరారు. మాధవీలత ప్రకటనపై జేసీ భగ్గుమన్నారు. సినిమాల్లో నటించే ఆమె ఓ వ్యభిచారి అంటూ పరుష పదజాలంతో దూషించారు. జేసీ వ్యాఖ్యలు వైరల్ కాగా…మాధవీ లతకు పెద్దగా సానుభూతి ఏమీ లభించలేదనే చెప్పాలి.
ఇలాంటి తరుణంలో జేసీ ఈ వివాదానికి తెర దించాలన్న దిశగా… మాధవీ లతకు బేషరతుగా సారీ చెప్పారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కూడా ఆయన అన్నారు. జేసీ సారీ చెప్పిన తర్వాత తనకు జరిగిన అవమానాన్ని తలచుకుని మాధవీ లత బోరుమన్నారు. ఈ వీడియో కూడా వైరల్ అయిపోయింది. తన దు:ఖాన్ని ఆపుకునేందుకు యత్నించిన ఆమె… తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించారు.
ఓ సినీ నటిగా కొనసాగిన తనకు ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయం జరుగుతుందన్న భావనతోనే ఆమె ఛాంబర్ ను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తనను జేసీ అసభ్య పదజాలంతో దూషించారని, తనను ఆయన అనరాని మాటలు అన్నారని ఆమె ఛాంబర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రకమైన చులకన బావం కలిగేలా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి మాధవీ లత ఫిర్యాదుపై ఛాంబర్ ఏ రీతిన స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on January 18, 2025 11:52 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…