Political News

టీడీపీని కాపీ కొట్టేసిన బీజేపీ

టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇకపై చెరిగిపోయే అవకాశాలు కూడా లేవు. అంతేనా… సంక్షేమ పాలనను కూడా దేశానికి పరిచయం చేసిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రాామారావు పార్టీని అన్ని పార్టీలకు అందనంత ఎత్తులో నిలబెట్టారు. ఆ సంక్షేమాన్ని, నిబద్ధతను ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు కొనసాగిస్తూ ఉంటే… లోకేశ్ దానిని మరింతగా పెంచుతూ సాగుతున్నారు.

దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్న టీడీపీ… తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ రథ సారథి బీజేపీకి కూడా మార్గదర్శిగా నిలిచింది. ఎన్డీఏలో టీడీపీ కూడా ఓ కీలక భాగస్వామిగానే ఉన్నా… ఇప్పుడు ఏకంగా బీజేపీకి మార్గదర్శిగా నిలిచిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో టీడీపీది అందె వేసిన చెయ్యే కదా. అందుకే కాబోలు… టీడీపీని బీజేపీ ఆదర్శంగా తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో అన్నా క్యాంటీన్లు అంటూ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం దేశంలో ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. చాలా రాష్ట్రాలు చంద్రబాబు పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాంటీన్లను ఏర్పాటు చేసి నామమాత్రపు రేట్లకు పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించాయి. ఈ పథకం పలు రకాల పేర్లతో ఇంకా అమలు అవుతోంది కూడా. అన్నా క్యాంటీన్లలో రూ.5కే భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 3 పూటలా ఆహారాన్ని అందిస్తున్న ఈ పథకంలో… ప్రతి పూటకు రూ.5తో పేదలు కడుపు నింపుకుంటున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఆ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ… శుక్రవారం తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో భాగంగా… అన్నా క్యాంటీన్ల తరహాలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. అన్నా క్యాంటీన్ల మాదిరే… అటల్ క్యాంటీన్లలోనూ రూ.5కే రుచికరమైన భోజనం లభించనుంది. బీజేపీ దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సంస్మరణార్థం ఈ పథకానికి అటల్ క్యాంటీన్లు అనే పేరు పెట్టినట్టు సమాచారం.

ఇక బీజేపీ మేనిఫెస్టోలో చాలా అంశాలు… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయి. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను పెంచి ఇవ్వనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ప్రస్తావించిన నడ్డా… హోలీ, దీపావళిలకు ఉచిత సిలిండర్లను ఇస్తామని చెప్పారు. మహిళలకు, నెలకు రూ.2,500 ఆర్థిక చేయూతను అందిస్తామని తెలిపారు. మొత్తంగా టీడీపీ మేనిఫెస్టోను బీజేపీ ఫాలో అయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on January 18, 2025 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

1 hour ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

5 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

5 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

7 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

9 hours ago