వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు. మీడియా మైకు కనిపించిందంటే చాలు… చోటామోటా వైసీపీ నేతలు కూడా బాబుపై పరాచకాలాడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. టీడీపీతో పాటు కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ ను ఏ రేంజిలో విమర్శిస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి పనినీ.. చంద్రబాబు నిర్ణయాలతో పోలుస్తూ వారు సెటైర్లు సంధిస్తున్నారు.
అలాంటి సెటైర్లకు ప్రస్తుత సీఎం చంద్రబాబు అదిరిపోయే మెటీరియల్ ఇచ్చేశారు. శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ బేటీలో కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే స్థలాల విస్తీర్ణాన్ని కూటమి సర్కారు దాదాపుగా ట్రిపుల్ చేసింది. అంటే… జగన్ జమానాలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మూడింతల విస్తీర్ణం మేర స్థలం పేదల ఇంటి నిర్మాణం కోసం ఇస్తారన్న మాట.
జగన్ హయాంలో అటు గ్రామీణ ప్రాంతాల్లో అయినా, ఇటు పట్టణ ప్రాంతాల్లో అయినా… సెంటు, లేదంటే సెంటున్నర విస్తీర్ణంతో స్థలాలను ఇచ్చారు. ఈ విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3 సెంట్లకు, పట్టణాల్లో 2 సెంట్లకు పెంచుతున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేటినెట్ భేటీ వివరాలను వెల్లడించిన సందర్బంగా తెలిపారు.
నాడు జగన్ ఇచ్చే సెంటు స్థలంలో సమాధి కట్టుకోవడం కూడా వీలు కాదంటూ టీడీపీ నేతలు సెటైర్లు సంధించింది. వాస్తవంగా సింగిల్ సెంటులో ఇల్లు కట్టుకోవడం అంటే ఒకింత కష్టమే. అయినా కూడా పట్టణాల్లోని అపార్ట్ మెంట్ కల్చర్ ను చూపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇప్పుడు వైసీపీకి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తూ… కూటమి సర్కారు పేదల ఇంటి స్థలాలను ట్రిపుల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…