వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు. మీడియా మైకు కనిపించిందంటే చాలు… చోటామోటా వైసీపీ నేతలు కూడా బాబుపై పరాచకాలాడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. టీడీపీతో పాటు కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ ను ఏ రేంజిలో విమర్శిస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి పనినీ.. చంద్రబాబు నిర్ణయాలతో పోలుస్తూ వారు సెటైర్లు సంధిస్తున్నారు.
అలాంటి సెటైర్లకు ప్రస్తుత సీఎం చంద్రబాబు అదిరిపోయే మెటీరియల్ ఇచ్చేశారు. శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ బేటీలో కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే స్థలాల విస్తీర్ణాన్ని కూటమి సర్కారు దాదాపుగా ట్రిపుల్ చేసింది. అంటే… జగన్ జమానాలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మూడింతల విస్తీర్ణం మేర స్థలం పేదల ఇంటి నిర్మాణం కోసం ఇస్తారన్న మాట.
జగన్ హయాంలో అటు గ్రామీణ ప్రాంతాల్లో అయినా, ఇటు పట్టణ ప్రాంతాల్లో అయినా… సెంటు, లేదంటే సెంటున్నర విస్తీర్ణంతో స్థలాలను ఇచ్చారు. ఈ విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3 సెంట్లకు, పట్టణాల్లో 2 సెంట్లకు పెంచుతున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేటినెట్ భేటీ వివరాలను వెల్లడించిన సందర్బంగా తెలిపారు.
నాడు జగన్ ఇచ్చే సెంటు స్థలంలో సమాధి కట్టుకోవడం కూడా వీలు కాదంటూ టీడీపీ నేతలు సెటైర్లు సంధించింది. వాస్తవంగా సింగిల్ సెంటులో ఇల్లు కట్టుకోవడం అంటే ఒకింత కష్టమే. అయినా కూడా పట్టణాల్లోని అపార్ట్ మెంట్ కల్చర్ ను చూపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇప్పుడు వైసీపీకి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తూ… కూటమి సర్కారు పేదల ఇంటి స్థలాలను ట్రిపుల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
This post was last modified on January 18, 2025 10:27 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…