వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు. మీడియా మైకు కనిపించిందంటే చాలు… చోటామోటా వైసీపీ నేతలు కూడా బాబుపై పరాచకాలాడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. టీడీపీతో పాటు కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ ను ఏ రేంజిలో విమర్శిస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి పనినీ.. చంద్రబాబు నిర్ణయాలతో పోలుస్తూ వారు సెటైర్లు సంధిస్తున్నారు.
అలాంటి సెటైర్లకు ప్రస్తుత సీఎం చంద్రబాబు అదిరిపోయే మెటీరియల్ ఇచ్చేశారు. శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ బేటీలో కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే స్థలాల విస్తీర్ణాన్ని కూటమి సర్కారు దాదాపుగా ట్రిపుల్ చేసింది. అంటే… జగన్ జమానాలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మూడింతల విస్తీర్ణం మేర స్థలం పేదల ఇంటి నిర్మాణం కోసం ఇస్తారన్న మాట.
జగన్ హయాంలో అటు గ్రామీణ ప్రాంతాల్లో అయినా, ఇటు పట్టణ ప్రాంతాల్లో అయినా… సెంటు, లేదంటే సెంటున్నర విస్తీర్ణంతో స్థలాలను ఇచ్చారు. ఈ విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3 సెంట్లకు, పట్టణాల్లో 2 సెంట్లకు పెంచుతున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేటినెట్ భేటీ వివరాలను వెల్లడించిన సందర్బంగా తెలిపారు.
నాడు జగన్ ఇచ్చే సెంటు స్థలంలో సమాధి కట్టుకోవడం కూడా వీలు కాదంటూ టీడీపీ నేతలు సెటైర్లు సంధించింది. వాస్తవంగా సింగిల్ సెంటులో ఇల్లు కట్టుకోవడం అంటే ఒకింత కష్టమే. అయినా కూడా పట్టణాల్లోని అపార్ట్ మెంట్ కల్చర్ ను చూపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇప్పుడు వైసీపీకి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తూ… కూటమి సర్కారు పేదల ఇంటి స్థలాలను ట్రిపుల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
This post was last modified on January 18, 2025 10:27 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…