Political News

విశాఖ ఉక్కుకు నవ జీవం… బాబు మాటకు కేంద్రం దన్ను

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు నిజంగానే కొత్త జీవం వచ్చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు జీవం పోసేలా… కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం తరఫున రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సాయత్రం కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కుకు పునరుద్ధరణ ప్యాకేజీ కింద రూ.11.440 రోటకలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కును వెంటాడుతున్న సమస్యలకు చెక్ పడిపోవడం ఖాయమేనని మంత్రి తెలిపారు.

విశాఖ ఉక్కు ఏపీకే కాకుండా… యావత్తు దేశానికి కీలక ప్రాజెక్టు అని వైష్ణవ్ తెలిపారు. ఈ కర్మాగారం ద్వారా దేశానికి విలువైన ఉక్కు అందుతోందని కూడా ఆయన అన్నారు. అలాంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుందని కూడా మంత్రి ప్రశ్నించారు. రివైవల్ ప్యాకేజీ కింద విశాఖ ఉక్కులో 3 బ్లాస్ట్ ఫర్నేస్ లను ఏర్పాటు చేస్తామన్న మంత్రి… వాటిలో రెండింటి పనులు తక్షణమే ప్రారంభమవుతాయని తెలిపారు. మూడో ఫర్నేస్ పనులు ఆగస్టులో మొదలు అవుతాయని పేర్కొన్నారు. వెరసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తన చర్యల ద్వారా కొట్టిపారేసింది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉక్కు కేంద్రంగా నాటి అధికార వైసీపీ, నేటి అధికార కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అదికారంలోకి వస్తే,… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగడం ఖాయమేనని వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అయితే తాము అధికారంలోకి వస్తే… విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడతామని టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖ ఉక్కును ప్రమాదంలో పడవేసింది జగనేనని కూడా ఆయన ఆరోపించారు.

తాజాగా కేంద్రం ప్రకటించిన రివైవల్ ప్యాకేజీతో జగన్ చేసినదంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది. జగన్ చెప్పినట్లుగా కూటమి అదికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం లభించింది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆయన ప్రధాని నరేంద్ర మోదీ వద్ద, ఇతర కేంద్ర మంత్రుల వద్ద విశాఖ ఉక్కు గురించి ప్రస్తావిస్తూ.. దాని పునరుద్ధరణఎంత అవసరమో వివరిస్తూ వచ్చారు. దీంతోనే విశాఖ ఉక్కుకు కేంద్రం నుంచి రివైవల్ ప్యాకేజీ లభించింది. ఈ ప్యాకేజీతో చంద్రబాబుతో పాటు కూటమి సర్కారుకు ఓ రేంజి మైలేజీ దక్కినట్టేనని చెప్పాలి.

ఇదిలా ఉంటే… విశాఖ ఉక్కుకు రివైవల్ ప్యాకేజీ అంటూ గురువారమే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గురువారం నాటి కేంద్ర కేబినెట్ లో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం జరిగిపోయిందని ప్రచారం జరిగింది.అయితే ఆ ప్యాకేజీ ఏమిటన్న దానిపై శుక్రవారం కేంద్రమే కీలక ప్రకటన చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ఈ ప్యాకేజీపై ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోన్ నాయుడు చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తించింది. విశాఖఉక్కుకు కేంద్రం రూ.10,300 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని ఆయన పేర్కొనడం గమనార్హం. అయితే అంతకుమించి రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించడం ఏపీ వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

This post was last modified on January 18, 2025 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago