తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి చేసుకున్నారనే వార్తలు కలకలం రేపాయి. అతడి కుటుంబ సభ్యుల ప్రకటనతో ఈ విషయంపై అనుమానాలు చెలరేగాయి. గోపన్ స్వామి కుటుంబం ఇటీవల అతడు జీవ సమాధి చేసుకున్నాడని, సమాధి ప్రదేశాన్ని దేవాలయం సమీపంలో ఏర్పాటు చేశారని ప్రచారం చేసింది. అయితే ఈ సంఘటనపై స్థానికులు, అధికారులలో సందేహాలు మొదలయ్యాయి.
గోపన్ స్వామి కుమారులు రాజేశన్, సనందన్ మాట్లాడుతూ, జీవ సమాధి సమయంలో ఎవరూ అడ్డంకిగా ఉండకూడదని గోపన్ స్వామి చెప్పినందువల్లే ఇతరులకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో గోపన్ స్వామి జీవితం, మరణంపై సందేహాలు మరింతగా పెరిగాయి. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ చొరవ తీసుకుని విచారణ ప్రారంభించారు. అధికారులు నెయ్యటింకర ప్రాంతంలోని సమాధి ప్రదేశానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నిరసన మధ్య సమాధిని తవ్వే ప్రయత్నం చేశారు. హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న తర్వాత, భారీ పోలీసు బందోబస్తుతో తవ్వకాలు కొనసాగించారు.
తవ్వకం అనంతరం, సమాధి లోపల గోపన్ స్వామి కూర్చుని ధ్యానం చేస్తున్న స్థితిలో ఉన్న మృతదేహం బయటపడింది. సమాధి చుట్టూ పూజా సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు నెలకొన్నాయి. గోపన్ స్వామి జీవ సమాధి వెనుక నిజాలు, పునాది కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
This post was last modified on January 17, 2025 10:02 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…