Political News

గ్యాంగ్ రేప్ కేసులో హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

షాకింగ్ అంశం వెలుగు చూసింది. సాధారణంగా ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మీద తీవ్ర ఆరోపణలు రావటం చాలా అరుదు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మీద తాజాగా గ్యాంగ్ రేప్ ఆరోపణలు వెల్లువెత్తటం సంచలనంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ.. సింగర్ రాకీ మిట్టల్ అకా జై భగవాన్ పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. దీనికి కారణం ఢిల్లీకి చెందిన ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
తనపై గ్యాంగ్ రేప్ 2023 జులై మూడున తన ఓనర్.. ఫ్రెండ్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ దారుణం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలీకి తానో టూరిస్టుగా ఫ్రెండ్ తో కలిసి వెళ్లానని చెప్పిన ఆమె.. ఆ హోటల్ లో తాను బడోలీ.. మిట్టల్ ను కలిసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాను తీసే అల్బమ్ లో నటిగా మారేందుకు అవకాశం ఇస్తానని తనతో మిట్టల్ చెప్పారన్నారు.

మరోవైపు తన స్నేహతుడు బడోలీ సీనియర్ పొలిటీషియన్ అని.. అతనికి పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో తన చేత బలవంతంగా మద్యం తాగించి.. తన స్నేహితురాలిని పక్కకు తీసుకెళ్లారని ఆరోపించిన ఆమె.. ‘‘ఆ ఇద్దరు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. నా నగ్న చిత్రాలు.. వీడియోల్ని తీసుకున్నారు’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఢిల్లీ యువతి చేసిన ఫిర్యాదుతో నిందితులపై 376డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ వెల్లడించారు. ఈ ఉదంతంలో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు చేయలేదని చెప్పారు. ఒక ప్రముఖ నేత మీద ఈ స్థాయిలో ఆరోపణలు రావటం ఇదే తొలిసారి. దీంతో..రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారింది.

This post was last modified on January 16, 2025 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

31 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago