షాకింగ్ అంశం వెలుగు చూసింది. సాధారణంగా ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మీద తీవ్ర ఆరోపణలు రావటం చాలా అరుదు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మీద తాజాగా గ్యాంగ్ రేప్ ఆరోపణలు వెల్లువెత్తటం సంచలనంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ.. సింగర్ రాకీ మిట్టల్ అకా జై భగవాన్ పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. దీనికి కారణం ఢిల్లీకి చెందిన ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
తనపై గ్యాంగ్ రేప్ 2023 జులై మూడున తన ఓనర్.. ఫ్రెండ్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ దారుణం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలీకి తానో టూరిస్టుగా ఫ్రెండ్ తో కలిసి వెళ్లానని చెప్పిన ఆమె.. ఆ హోటల్ లో తాను బడోలీ.. మిట్టల్ ను కలిసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాను తీసే అల్బమ్ లో నటిగా మారేందుకు అవకాశం ఇస్తానని తనతో మిట్టల్ చెప్పారన్నారు.
మరోవైపు తన స్నేహతుడు బడోలీ సీనియర్ పొలిటీషియన్ అని.. అతనికి పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో తన చేత బలవంతంగా మద్యం తాగించి.. తన స్నేహితురాలిని పక్కకు తీసుకెళ్లారని ఆరోపించిన ఆమె.. ‘‘ఆ ఇద్దరు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. నా నగ్న చిత్రాలు.. వీడియోల్ని తీసుకున్నారు’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఢిల్లీ యువతి చేసిన ఫిర్యాదుతో నిందితులపై 376డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ వెల్లడించారు. ఈ ఉదంతంలో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు చేయలేదని చెప్పారు. ఒక ప్రముఖ నేత మీద ఈ స్థాయిలో ఆరోపణలు రావటం ఇదే తొలిసారి. దీంతో..రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…